Jump to content

దాసరి అమరేంద్ర

వికీపీడియా నుండి
దాసరి అమరేంద్ర
దాసరి అమరేంద్ర
జననం (1953-03-14) 1953 మార్చి 14 (వయసు: 73)
వృత్తిరచయిత, యాత్రికుడు

దాసరి అమరేంద్ర తెలుగు రచయిత. అతను రాసిన కథలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను 1953, మార్చి 14పశ్చిమ గోదావరి జిల్లా, లింగపాలెం మండలానికి చెందిన ధర్మాజీగూడెంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతడి తల్లి నంబూరి పరిపూర్ణ కూడా మంచి రచయిత్రి. ఆమె ప్రజనాట్యమండలి, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలలో పాల్గొనేది. ఆమె బాల్యంలో భక్త ప్రహ్లాద అనే సినిమాలో ప్రహ్లాదుని పాత్రలో నటించింది. ఇతడి బాల్యం విద్యాభ్యాసం బంటుమిల్లి, విజయవాడ, కాకినాడలో గడచింది. ఉద్యోగరీత్యా ఘజియాబాద్, బెంగుళూరు, పూణేలలో నివసించాడు[2]. 1977లో అతని మొదటి కథ ప్రజాతంత్ర అనే పత్రికలో ప్రచురితిమైంది. అతని సాహితీ ప్రస్థానం ముఖ్యంగా 1990-91లలో ప్రారంభమైంది.

రచనలు

[మార్చు]
  1. కథాపరిపూర్ణం
  2. శేఫాలిక
  3. స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర
  4. ఆత్మీయం
  5. సాహితీయాత్ర
  6. చిత్రగ్రీవం (అనువాదం)
  7. కోర్టు మార్షల్ (అనువాదం)

మూలాలు

[మార్చు]
  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-05.
  2. My writings reflect real life, says Amarendra

బాహ్య లంకెలు

[మార్చు]