పండిత రమాబాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండిత రమాబాయి
పండిత రమాబాయి సరస్వతి
జననం
రమా డోంగ్రే

(1858-04-23)1858 ఏప్రిల్ 23
కానా జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1922 ఏప్రిల్ 5(1922-04-05) (వయసు 63)
బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
జాతీయతభారతీయులు
పౌరసత్వంభారతీయులు
వృత్తిసంఘసంస్కర్త, స్త్రీవాది
క్రియాశీల సంవత్సరాలు1885 నుండి 1922
పండిత రాంబాయి ముతి మిషన్, కెడ్గాన్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నిరాశ్రయ & అనాధ బాలికల మంత్రిత్వశాఖ
గుర్తించదగిన సేవలు
ది హై=కేస్ట్ హిందూ వుమెన్ పుస్తకం
పిల్లలుమనోరమ

పండిత రమాబాయి సరస్వతి (1858 ఏప్రిల్ 23 - 1922 ఏప్రిల్ 5 ) భారతీయ సంఘ సంస్కర్త. భారతదేశంలో మహిళల విద్య, విముక్తికి మార్గదర్శకురాలు. కలకత్తా విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆమెను పరీక్షించిన తరువాత సంస్కృత పండితురాలిగా "పండిత", "సరస్వతి" బిరుదులు ప్రదానం చేసారు.[1] ఆ బిరుదులను పొందిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచింది. 1889 నాటి కాంగ్రెస్ సమావేశానికి హాజరైన 10 మంది మహిళా ప్రతినిధులలో ఆమె ఒకరు.[2] [3] 1890 ల చివరలో పూణే నగరానికి నలభై మైళ్ల తూర్పున ఉన్న కేడ్గావ్ గ్రామంలో ముక్తి మిషన్‌ను స్థాపించింది[4][5]. ఈ మిషన్‌కు తరువాత పండిత రమాబాయి ముక్తి మిషన్ అని పేరు పెట్టారు.పండిత రమాబాయి Christan

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

పండిత రమాబాయి సరస్వతి 1858 ఏప్రిల్ 23న రామా డోంగ్రేగా మరాఠీ మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కాని తరువాత ఆమె ఇంగ్లాండ్‌లో క్రైస్తవ మతాన్ని స్వీకరించింది.[6] ఆమె తండ్రి అనంత్ శాస్త్రి డోంగ్రే సంస్కృత పండితుడు. ఇంట్లో ఆమెకు సంస్కృతాన్ని నేర్పించాడు. 1876-78 నాటి గొప్ప కరువు సమయంలో 16 సంవత్సరాల వయస్సులో అనాథలుగా మారిన డోంగ్రే, ఆమె సోదరుడు శ్రీనివాస్ సంస్కృత గ్రంథాలను పఠిస్తూ భారతదేశం అంతటా తిరిగారు. అధ్యాపకురాలిగా రమాబాయి కీర్తి కలకత్తాకు చేరుకుంది. అక్కడ పండితులు ఆమెను మాట్లాడటానికి ఆహ్వానించారు[7]. 1878 లో కలకత్తా విశ్వవిద్యాలయం వివిధ సంస్కృత రచనలపై ఆమెకు ఉన్న జ్ఞానాన్ని గుర్తించి ఆమెకు పండిత, సరస్వతి అనే బిరుదులను ప్రదానం చేసింది[8][6]. ఆస్తిక సంస్కర్త కేశబ్ చంద్ర సేన్ ఆమెకు హిందూ సాహిత్యంలోని అత్యంత పవిత్రమైన వేదాల కాపీని ఇచ్చి, వాటిని చదవమని ప్రోత్సహించాడు. 1880 లో శ్రీనివాస్ మరణం తరువాత రమాబాయి బెంగాలీ న్యాయవాది బిపిన్ బిహారీ మేధ్వీని వివాహం చేసుకుంది. వరుడు బెంగాలీ కాయస్థ అయినందున వారి వివాహం అంతర్-కులం, అంతర్-ప్రాంతీయమైనది. అందువల్ల ఆ వయస్సుకి ఆ వివాహం అనుచితమైనదిగా భావించబడింది. 1880 నవంబరు 13 న ధర్మశాస్త్ర వేడుకలో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది, వారికి మనోరమ అని పేరు పెట్టారు. 1882 లో మేధ్వీ మరణం తరువాత కేవలం 23 ఏళ్ళ వయసున్న రమాబాయి పూణేకు వెళ్లి మహిళల విద్యను ప్రోత్సహించడానికి ఒక సంస్థను స్థాపించింది.[6][9]

సామాజిక క్రియాశీలత[మార్చు]

మేధ్వీ మరణం తరువాత (1882), రమాబాయి పూణేకు వెళ్లి అక్కడ ఆర్య మహిళా సమాజ్ (ఆర్య ఉమెన్స్ సొసైటీ) ను స్థాపించింది. ఈ సమాజం యొక్క ఉద్దేశ్యం మహిళలకు విద్యనందించడం, బాల్యవివాహాల అణచివేత నుండి విముక్తి పొందడం. 1882 లో విద్యా వ్యవస్థను పరిశీలించడానికి భారత ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించినప్పుడు రమాబాయి దాని ముందు ఆధారాలు ఇచ్చింది. లార్డ్ రిపోన్ ఎడ్యుకేషన్ కమిషన్ లో ఆమె ప్రసంగిస్తూ "ఈ దేశంలోని వంద మంది విద్యావంతులైన పురుషులలో తొంభై తొమ్మిది మంది పురుషులు స్త్రీ విద్య, మహిళల సరైన స్థితిని వ్యతిరేకిస్తున్నారు. వారు స్వల్పంగానైనా తప్పును గమనిస్తే, వారు ఆవ గింజలను ఒక పర్వతంలోకి పెద్దది చేసి, స్త్రీ పాత్రను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని " ప్రకటించింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, మహిళా పాఠశాల ఇనస్పెక్టర్లను నియమించాలని ఆమె సూచించింది. అంతేకాకుండా భారతదేశంలో మహిళల పరిస్థితులు మహిళలకు మహిళలు మత్రమే వైద్యపరంగా చికిత్స చేయగలరని, భారతీయ మహిళలను మెడికల్ కాలేజీల్లో చేర్పించాలని ఆమె అంది. రమాబాయి సాక్ష్యం గొప్ప సంచలనాన్ని సృష్టించి విక్టోరియా రాణికి చేరుకుంది. లార్డ్ డఫెరిన్ చేత మహిళా వైద్య ఉద్యమాన్ని ప్రారంభించిన తరువాత ఇది ఫలించింది.[10]
వైద్య శిక్షణ ప్రారంభించడానికి రమాబాయి 1883 లో బ్రిటన్ వెళ్ళింది; ఎక్కువవుతున్న చెవిటితనం కారణంగా ఆమె వైద్య కార్యక్రమాల నుండి ఆమెను తిరస్కరించారు.[11] ఆమె అక్కడ బస చేసిన సమయంలో క్రైస్తవ మతంలోకి మారిపోయింది. బ్రిటన్ నుండి ఆమె తన బంధువు, మొదటి మహిళా భారతీయ వైద్యురాలు ఆనందీబాయి జోషి[11] గ్రాడ్యుయేషన్‌కు హాజరు కావడానికి 1886 లో అమెరికా వెళ్ళి అక్కడ రెండేళ్లపాటు ఉంది. ఈ సమయంలో ఆమె పాఠ్యపుస్తకాలను కూడా అనువదించింది. యునైటెడ్ స్టేట్స్, కెనడా అంతటా ఉపన్యాసాలు ఇచ్చింది[12]. ఆమె తాను రాసిన అతి ముఖ్యమైన పుస్తకం "ది హై-కేస్ట్ హిందూ వుమెన్" ను ప్రచురించింది. ఆమె ఆంగ్లంలో రాసిన మొదటి పుస్తకం కూడా ఇదే. రమాబాయి ఈ పుస్తకాన్ని డాక్టర్ ఆనందీబాయి జోషి కి అంకితమిచ్చింది. ఈ పుస్తకంలో ఇది బాల వధువు, బాల వితంతువులతో సహా హిందూ మహిళల జీవితంలోని చీకటి కోణాలను చూపించింది, బ్రిటిష్ ఇండియా హిందువులలో మహిళల అణచివేతను బహిర్గతం చేయడానికి ప్రయత్నించింది. 1896 లో తీవ్రమైన కరువు సమయంలో రమబాయి ఎద్దుల బండ్ల సమూహంతో మహారాష్ట్ర గ్రామాలలో పర్యటించి, వెలివేసిన వేలాది మంది పిల్లలు, బాల వితంతువులు, అనాథలు, ఇతర నిరాశ్రయులైన మహిళలను రక్షించి ముక్తి, శారదా సదన్ల ఆశ్రయానికి తీసుకువచ్చింది. ఆమె ఏడు భాషలను క నేర్చుకున్న మహిళ. ఆమె హీబ్రూ, గ్రీకు భాషల నుండి బైబిలును తన మాతృభాష అయిన మరాఠీలోకి అనువదించింది.[13]

1900 నాటికి ముక్తి మిషన్‌లో 1,500 మంది నివాసితులు, వందకు పైగా పశువులు ఉన్నాయి. ముక్తి వద్ద చర్చిని స్థాపించడంలో కూడా ఆమె కృషి చేసింది. పండిత రమాబాయి ముక్తి మిషన్ నేటికీ చురుకుగా ఉంది. వితంతువులు, అనాథలు, అంధులతో సహా అనేక పేద సమూహాలకు గృహ, విద్య, వృత్తి శిక్షణ మొదలైనవి అందిస్తోంది.[14]

కుటుంబ జీవితం[మార్చు]

1989 భారత తపాలా బిళ్లపై రమాబాయి

పండిత రమాబాయి సామాజిక సేవలో ఎక్కువగా పాలుపంచుకున్నందున, ఆమెకు కుటుంబ జీవితం చాలా తక్కువగా ఉంది. ఆమె బాల్యం కష్టాలతో నిండి ఉంది, ఆమె తల్లిదండ్రులను ప్రారంభంలోనే కోల్పోయింది. వివాహం అయిన రెండు సంవత్సరాలలో భర్త మరణించాడు. ఆమె తన ఏకైక కుమార్తె మనోరమ బాయికి చదువించవలసి వచ్చింది. ఆమె కుమార్తెను చదివించింది: మనోరమ బొంబాయి విశ్వవిద్యాలయంలోబి.ఎ పూర్తి చేసింది; ఉన్నత చదువుల కోసం యు.ఎస్.ఎ ‌కు వెళ్ళింది; భారతదేశానికి తిరిగి వచ్చి, ముంబైలోని శారదా సదన్ ప్రిన్సిపాల్‌గా పనిచేసింది. ఆమె సహాయంతో పండిత రమాబాయి 1912 లో దక్షిణ భారతదేశంలోని వెనుకబడిన జిల్లా అయిన గుల్బర్గా (ప్రస్తుతం కర్ణాటకలో) వద్ద క్రిస్టియన్ హైస్కూల్‌ను స్థాపించింది. ఆ పాఠశాలకు ఆమె కుమార్తె పాఠశాల ప్రిన్సిపాల్ గా ఉంది. 1920 లో రమాబాయి శరీరం బలహీనపడడం ప్రారంభించింది. ఆమె తన కుమార్తెను ముక్తి మిషన్ మంత్రిత్వ శాఖ బాద్యతలు చేపట్టే వ్యక్తిగా పేర్కొంది. అయితే మనోరమ 1921 లో మరణించింది. ఆమె మరణం రమాబాయికి షాక్ ఇచ్చింది. తొమ్మిది నెలల తరువాత సెప్టిక్ బ్రాంకైటిస్ తో బాధపడుతున్న రమాబాయి తన 64 వ పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు 1922 ఏప్రిల్ 5 న మరణించింది.[15]

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

  • సంస్కృతంలో ఆమె నైపుణ్యాలను గుర్తించి బెంగాల్‌లో (బ్రిటన్ వెళ్లే ముందు) "పండిట్", "సరస్వతి" బిరుదులిచ్చారు.
  • 1919 లో సమాజ సేవ కోసం కైసరి-ఇ-హింద్ పతకాన్ని బ్రిటిష్ వలసరాజ్యాల ప్రభుత్వం ప్రదానం చేసింది.[16]
  • ఏప్రిల్ 5 న లిటర్జికల్ కేలందర్ ఆఫ్ ద ఎపిస్కోపల్ చర్చ్ (యుఎస్ఎ) ‌లో ఫీస్ట్ డే గా గౌరవించారు.[17]
  • 26 అక్టోబర్ 1989 న, భారతీయ మహిళల పురోగతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం స్మారక ముద్రను విడుదల చేసింది.[18]
  • ఆమె గౌరవార్థం ముంబైలోని ఒక రహదారికి పేరు పెట్టారు. గామ్‌దేవి ప్రాంతానికి సమీపంలో ఉన్న హ్యూస్ రోడ్‌ను నానా చౌక్‌కు అనుసంధానించే రహదారిని పండిత రామాబాయి మార్గ్ అని పిలుస్తారు.[19]

మూలాలు[మార్చు]

  1. "Women's History Month: Pandita Ramabai". Women's History Network. 11 March 2011.
  2. Kollanoor, Greger. "Indian Christianity and National Movements". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. "Short Biography of Ramabai". 25 May 2015. Archived from the original on 7 డిసెంబరు 2018. Retrieved 5 జూన్ 2020.
  4. Ramabai Sarasvati (Pandita); Pandita Ramabai (2003). Pandita Ramabai's American Encounter: The Peoples of the United States (1889). Indiana University Press. pp. 29–30. ISBN 0-253-21571-4.
  5. Anne Feldhaus (29 January 1998). Images of Women in Maharashtrian Society. SUNY Press. p. 205. ISBN 978-0-7914-3660-8.
  6. 6.0 6.1 6.2 Khan, Aisha (14 November 2018). "Overlooked No More: Pandita Ramabai, Indian Scholar, Feminist and Educator". The New York Times.
  7. My Story by Pandita Ramabai. Pub: Christian Institute for Study of Religion and Society, Bangalore.
  8. "Intl' Christian Women's History Project & Hall of Fame". Icwhp.org. Retrieved 15 May 2015.
  9. "Sarla R. Murgai". Utc.edu. Retrieved 15 May 2015.
  10. "Sarla R. Murgai". Utc.edu. Retrieved 15 May 2015.
  11. 11.0 11.1 "Overlooked No More: Pandita Ramabai, Indian Scholar, Feminist and Educator". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-11-14. ISSN 0362-4331. Retrieved 2020-03-26.
  12. Jayawardena, Kumari (1995). The white woman's other burden: Western women and South Asia during British colonial rule. New York: Routledge. p. 56. ISBN 978-0-415-91104-7.
  13. "Intl' Christian Women's History Project & Hall of Fame". Icwhp.org. Retrieved 15 May 2015.
  14. "Untold Tale of Revival: Pandita Ramabai | Grace Valley Christian Center". Gracevalley.org. Retrieved 15 May 2015.
  15. Panditha Ramabai Sarasvathi – Book in Kannada (1962) Pub by Christ Sahitya Sangha, Bangalore
  16. Butler (1922), p. 83
  17. A Great Cloud of Witnesses (PDF). Church Publishing. 15 అక్టోబరు 2016. p. 8. ISBN 9780898699661.
  18. "Indian Postage Stamps 1947–2000". Department of Posts, Ministry of Communications, Government of India. Archived from the original on 21 జనవరి 2021. Retrieved 9 ఏప్రిల్ 2019.
  19. Thale, Siddharaj (14 ఆగస్టు 2017). "Road in Mumbai named after woman who started Arya Mahila Samaj". The Indian Express. Retrieved 9 ఏప్రిల్ 2019.

ఇతర పఠనాలు[మార్చు]

  • Burton, Antoinette. "Colonial encounters in late-Victorian England: Pandita Ramabai at Cheltenham and Wantage 1883–6." Feminist Review 49.1 (1995): 29-49.
  • Butler, Clementina (1922). Pandita Ramabai Sarasvati: Pioneer in the movement for the education of the child-widow of India. Fleming H. Revell Company, New York.
  • Case, Jay Riley. An Unpredictable Gospel (Oxford University Press, 2012)
  • Chakravarti, Uma. Rewriting history: The life and times of Pandita Ramabai (Zubaan, 2014).
  • Dyer, Helen S. Pandita Ramabai: the story of her life (1900) online
  • Kosambi, Meera. "Indian Response to Christianity, Church and Colonialism: Case of Pandita Ramabai." Economic and Political Weekly (1992): WS61-WS71. online
  • White, Keith J. "Insights into child theology through the life and work of Pandita Ramabai." Transformation (2007): 95-102. online

ప్రాథమిక వనరులు[మార్చు]

  • Pandita Ramabai, Pandita Ramabai's American Encounter: The Peoples of the United States (1889), online
  • Ramabai Sarasvati, Pandita. The high-caste Hindu woman (1888) online
  • Sarasvati, Ramabai. Pandita Ramabai through her own words: Selected works (Oxford University Press, 2000).

బాహ్య లంకెలు[మార్చు]