Jump to content

పరిష్కారం

వికీపీడియా నుండి
పరిష్కారం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం తరణి
నిర్మాణం ప్రతాపరాజు
కథ రాబిన్
చిత్రానువాదం తరణి
తారాగణం నాగబాబు ,
వాణీ విశ్వనాధ్
సంగీతం ఎం. ఎం. కీరవాణి
సంభాషణలు సంజీవి, యడవల్లి
ఛాయాగ్రహణం పి. సాంబశివరావు
కూర్పు మహీధర్
నిర్మాణ సంస్థ నవభారత్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పరిష్కారం 1991 లో వచ్చిన యాక్షన్ చిత్రం, నవ భారత్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై, తరణి దర్శకత్వంలో ప్రతాప రాజు నిర్మించాడు. విద్యాసాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో జగపతి బాబు, నాగేంద్ర బాబు, వాణి విశ్వనాథ్ నటించారు.[1]

ఎసిపి చంద్ర శేఖర్ (జగపతి బాబు) నిజాయితీగల పోలీసు అధికారి. అతను ఒక అందమైన అమ్మాయి జ్యోతి (వాణి విశ్వనాథ్) ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. వెంటనే, పోలీసు ఆపరేషన్లో తీవ్రంగా గాయపడి అతడి శరీరం పూర్తిగా చచ్చుబడి పోతుంది. దాంతో శేఖర్ కుంగుబాటుకు లోనవుతాడు. అతనికి మానసిక శాంతి అవసరమని వైద్యులు చెప్తారు. జ్యోతి అతన్ని అతడి స్నేహితుడు విక్రమ్ (మనోహర్) కు ఒక హిల్ స్టేషన్ లో ఉన్న గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్తుంది. అక్కడ వారికి సత్యం (నాగేంద్ర బాబు) అనే ఒక చలాకీ యువ కార్మికుడిని కలుస్తారు. అతడి సమక్షంలో, శేఖర్ బాధ నుండి రిలాక్స్ అవుతాడు. సత్యం శేఖర్ కి నేచురల్ థెరపీని ఇస్తాడు. ఆక్యుపంక్చర్ చికిత్స ద్వారా వైద్యం చేసి పూర్తిగా నయం చేసిన వైద్యుడికి సహకరిస్తాడు. శేఖర్ సత్యంలో ఒక వైద్యుడి లక్షణాలను గమనిస్తాడు. అతను ఆశ్చర్యకరంగా ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశోధించగా సత్యం ఒక ప్రసిద్ధ డాక్టర్ ఆనంద్ అనీ, పోలీసుల నుండి పరారీలో ఉన్న వాంటెడ్ క్రిమినల్ అనీ తెలుసుకుంటాడు. తనకు చికిత్స చేసిన డాక్టరు ఆనంద్‌కు మామేనని కూడా అతను తెలుసుకుంటాడు. అతను వెంటనే నిజం విచారిస్తాడు. ఈ పరిస్థితికి శేఖరే కారణమని డాక్టర్ సమాధానం ఇస్తాడు. ఒకసారి శేఖర్, అతని స్నేహితులు విక్రమ్ వెంకట్ (బెనర్జీ) లు ఒక ప్రమాదంలో ఇరుక్కుంటారు. శేఖర్ తీవ్రంగా గాయపడతాడు. డాక్టర్ ఆనంద్ అతనికి చికిత్స చేస్తాడు. అతని గుడ్డి భార్య సుధా రాణి (గాయత్రి) ఆమె రక్తదానం చేసి అతనిని రక్షిస్తుంది. ఆ తర్వాత ఆనంద్‌ను కలవకుండానే శేఖర్ పోలీసు శిక్షణకు వెళ్ళిపోతాడు. కానీ దుర్మార్గులైన వెంకట్ విక్రమ్‌లు సుధారాణిపై అత్యాచారం చేస్తారు. కోపంతో ఆనంద్ వెంకట్ ను చంపేస్తాడు, భయపడిన విక్రమ్ పారిపోతాడు.

ఇప్పుడు శేఖర్ ఆనంద్ ను రక్షించాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో, విక్రమ్ తిరిగి వస్తాడు. ఆనంద్ తన పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఆనంద్ ను ఆపడానికి శేఖర్ గరిష్ఠంగా ప్రయత్నించి, తప్పనిసరై అతడిని కాలుస్తాడు. గాయపడిన ఆనంద్ తన పగను తీర్చుకుని, శేఖర్ ఒడిలో మరణిస్తాడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
ఎస్ పాట పేరు గాయకులు పొడవు
1 కన్యా కుమారిని మనో, చిత్ర 3:48
2 చేమంతి చెంపలో మనో, ఎస్పీ శైలజ 4:14
3 ఇల్లంతా ఉయ్యాలవుతుంది మనో, పి. సుశీల 4:10

మూలాలు

[మార్చు]
  1. "Titles". gomolo. Archived from the original on 2018-10-13. Retrieved 2020-08-25.