Jump to content

పాక్ జలసంధి

వికీపీడియా నుండి
మన్నార్ గల్ఫ్, రామసేతు, పాక్ అఖాతం, పాక్ జలసంధి, బంగాళాఖాతం
మన్నార్ గల్ఫ్ నుంచి పాక్ జలసంధి వేరుగా ఆడం బ్రిడ్జి

భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రానికీ, ద్వీప దేశమైన శ్రీలంక ఉత్తర ప్ర్రాంతంలోని మన్నార్ జిల్లాకూ మధ్యనున్న జలసంధి, పాక్ జలసంధి. ఇది ఈశాన్యంలోని బంగాళాఖాతం లోని పాక్ అఖాతాన్నీ, లక్షద్వీప సముద్రం లోని మన్నార్ అఖాతాన్నీ కలుపుతుంది. ఈ జలసంధి 53 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పున ఉంటుంది. తమిళనాడులోని వైగై నది సహా అనేక నదులు దీని లోకి ప్రవహిస్తాయి. ఈ జలసంధికి రాబర్ట్ పాక్ పేరు పెట్టారు. ఇతను ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో (1755-1763) మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నరుగా ఉండేవాడు.

భౌగోళిక స్థితి

[మార్చు]

ఈ జలసంధి, దక్షిణాన రామ సేతు నుండి ఉత్తరాన బంగాళాఖాతం లోని పాక్ అఖాతం వరకు 137 కి.మీ. ల పొడవున ఉంటుంది. రామసేతు అంది చిన్నచిన్న ద్వీపాలతో, వరసగా ఉన్న ఇసుకమేట దిబ్బలతో ఉంటుంది. దీన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ రామసేతు తమిళనాడులోని పంబన్ ద్వీపం ధనుష్కోడి (రామేశ్వరం ద్వీపం) నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు ఉంది. రామేశ్వరం ద్వీపం పంబన్ వంతెన ద్వారా భారత ప్రధాన భూభాగానికి అనుసంధానించబడి ఉంది.

చరిత్ర

[మార్చు]

1914 నుండి, మద్రాసు నుండి ధనుష్కోడికి రెగ్యులర్ రైళ్లు, మన్నార్ ద్వీప తలైమన్నార్ కు ఒక ఫెర్రీ, అక్కడి నుండి కొలంబోకి ఒక రైలు ఉండేది. 1964 తుపాను తరువాత ఇది ఆగిపోయింది.[1]

మూలాలు

[మార్చు]
  1. "The Hindu : LAND'S END". web.archive.org. 2004-10-14. Archived from the original on 2004-10-14. Retrieved 2023-02-17.

బయటి లింకులు

[మార్చు]