పెనుగొండ లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయకవి. ప్రముఖ న్యాయవాది. శ్రామిక పక్షపాతి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శిగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేస్తున్నాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు 1954, అక్టోబర్ 24వ తేదీన గుంటూరు జిల్లా, నూజెండ్ల మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు[1]. పెనుగొండ లింగమ్మ, గోవిందరెడ్డి ఇతని తల్లి దండ్రులు. బి.ఎ., బి.ఎల్ చదివాడు. న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఇతని భార్య పేరు ఉప్పుటూరి గీత. ఈమె ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నది. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రచనా వ్యాసంగం[మార్చు]

రచయితగా :

  1. విదిత (సాహిత్యవ్యాసాల సంపుటి)
  2. అనేక (సాహిత్యవ్యాసాల సంపుటి)
  3. రేపటిలోకి (కవిత్వం)

సంపాదకుడిగా :

  1. బల్గేరియా కవితా సంకలనం
  2. అరాజకీయం కవితా సంకలనం
  3. గుంటూరు కథలు
  4. కథాస్రవంతి (నాలుగు భాగాలు)

పురస్కారాలు[మార్చు]

  • తెలుగు భాషాపురస్కారం
  • సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం
  • మిలీనియం లాయర్ పురస్కారం

మూలాలు[మార్చు]

  1. కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి (2015-07-16). "సాహిత్యాన్ని ఉద్యమస్ఫూర్తిగా పెనుస్తూన్న "పెనుగొండ" (కదిలించే కలాలు)". నేటి నిజం. బైసా దేవదాసు. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 July 2015.