శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 80: | పంక్తి 80: | ||
* మహామహోపాధ్యాయ |
* మహామహోపాధ్యాయ |
||
* కవిసార్వభౌమ |
* కవిసార్వభౌమ |
||
* కళాప్రపూర్ణ |
* [[కళాప్రపూర్ణ]] |
||
==మూలాలు== |
==మూలాలు== |
11:18, 10 జనవరి 2016 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి | |
---|---|
జననం | 1866 |
మరణం | 1960, డిసెంబరు 29 |
వృత్తి | రచయిత |
తల్లిదండ్రులు |
|
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి (జననం: 1866 - మరణం: 1960) ఆధునిక తెలుగు ఆస్థాన కవి.
వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెం దగ్గర దేవరపల్లిలో వెంకట సోమయాజులు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా గ్రంథాలు రచించారు. వానిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి.
పత్రికా సంపాదకుడిగా
శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును మదరాసులో నెలకొలిపి పిమ్మట దానిని రాజమహేంద్రవరమునకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయినది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి.
ఈతీరున బత్త్రి కాసంపాదకులై, శతాధిక గ్రంథరచయితలై, భారత బాగవత రామాయణాంధ్రీకర్తలై, కవిరాజులై, కవిసార్వభౌములై, కళాప్రపూర్ణులై, మహామహోపాధ్యాయులై, ఆంధ్రవ్యాసులై, కనకాభిషిక్తులై, పూర్ణపురుషాయుషజీవులై విరాజిల్లుచున్న కృష్ణమూర్తి శాస్త్రిగారి సమగ్రజీవితము వ్రాసినచో మఱియొక మహాభారతము. https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:AndhraRachaitaluVol1.djvu/243
ముఖ్యమైన రచనలు
నాటకాలు
- కలభాషిణి
- రాజభక్తి
- భోజరాజ విజయం
- శ్రీనాథ కవి రాజీయం
పద్య కావ్యాలు
- గౌతమీ మహత్యం
- సత్యనారాయణోపాఖ్యానం
- గజానన విజయం
- శ్రీకృష్ణ కవి రాజీయం
- సావిత్రీ చరిత్రం
- వేదాద్రి మహాత్మ్యము
- యజ్ఞవల్క్య చరిత్ర
అచ్చతెలుగు కావ్యాలు
- బ్రహ్మానందం
- శాకుంతలం
వచన గ్రంథాలు
- సంస్కృత కవి జీవితాలు
- కాళిదాస విలాసము
- తెనాలి రామకృష్ణ చరిత్రము
- చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (మొదటి భాగము)
- చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (రెండవ భాగము)
అనువాదాలు
- శ్రీకృష్ణ భారతం
- శ్రీకృష్ణ రామాయణం
- శ్రీకృష్ణ భాగవతం
జీవితచరిత్ర
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి అనంతపంతుల రామలింగస్వామి ఈ గ్రంథాన్ని రచించారు.[1] ఇది వజ్రాయుధపత్రిక నుండి 1933 సంవత్సరంలో పునర్ముద్రించబడినది.
బిరుదులు
- మహామహోపాధ్యాయ
- కవిసార్వభౌమ
- కళాప్రపూర్ణ
మూలాలు
- ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1850, పేజీలు: 136-243.
- డి.ఎల్ః.ఐలో చెళ్ళపిళ్ళ వారి చెరలాటము(మొదటి భాగము) పుస్తక ప్రతి
- డి.ఎల్ః.ఐలో చెళ్ళపిళ్ళ వారి చెరలాటము(రెండవ భాగము) పుస్తక ప్రతి