కందుకూరి రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:భారతీయ మహిళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 53: పంక్తి 53:
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు ప్రముఖులు]]
[[వర్గం:భారతీయ మహిళలు]]

14:58, 4 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

కందుకూరి రాజ్యలక్ష్మమ్మ
దస్త్రం:Kandukuri Veereshalingam and his Wife.jpg
కందుకూరి దంపతులు
జననంబాపమ్మ
నవంబరు 5, 1851
కంతేరు, తూర్పు గోదావరి జిల్లా
మరణంఆగష్టు 11, 1910
ప్రసిద్ధిసంఘ సేవకురాలు
భార్య / భర్తకందుకూరి వీరేశలింగం
తండ్రిఅద్దంకి పట్టాభిరామయ్య
తల్లికొండమాంబ

కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (నవంబరు 5, 1851 - ఆగష్టు 11, 1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి.

జీవిత విశేషాలు

ఈమె నవంబరు 5, 1851 తేదీన తూర్పు గోదావరి జిల్లా, కంతేరు గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట కందుకూరి వీరేశలింగంతో వివాహం జరిగింది. అప్పటికి వీరేశలింగం వయసు 12 సంవత్సరాలు. ఈమె చిన్నతనములో చదివిన చదువుల వల్లను, మేనమామ నేర్పిన సంస్కారం వల్లను తన భర్త సంఘసేవ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచింది.

భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెండ్లి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసెడివారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది.[1] ఈమె సంగీతము కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు కొన్ని రచించింది.

మరణం

ఈమె 1910, ఆగష్టు 11వ తేదీన మరణించింది.

మూలాలు

  1. ప్రజాశక్తి. "రాజేశ్వరమ్మకు నివాళి". Retrieved 4 April 2017.