Jump to content

బొగ్గుల శ్రీనివాస్

వికీపీడియా నుండి
బొగ్గుల శ్రీనివాస్

బొగ్గుల శ్రీనివాస్ (1977 మార్చి 5 - 2026 ఫిబ్రవరి 14), ప్రముఖ రచయిత, సమగ్ర సాహిత్య పరిశోధకుడు. ఆయన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ మొత్తం రచనలల్ని వెలుగులోకి తీసుకు రావడమేకాక సమగ్రంగా పరిశోధించాడు.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

కర్నూలు జిల్లా, నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో చెన్నమ్మ, చెన్న రాయుడు దంపతులకు 1977 మార్చి 5న జన్మించాడు. ఆయన ఎం.యస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) డిగ్రీ పూర్తి చేసాడు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ప్రవేశంపై "పవన్ కల్యాణ్ హటావో - పాలిటిక్స్ బచావో" అనే పుస్తకంతో ఆయన చాలా గుర్తింపు పొందాడు. అయితే పవన్ కళ్యాణ్‌పై రాజకీయ దురుద్దేశంతోనే ఈ పుస్తకం రాశారని పవన్ అభిమాన సంఘాలు ఆందోళనలు చేట్టాయి.[1] 2014లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ హటావో - పాలిటిక్స్ బచావో పుస్తకాలను విక్రయిస్తున్న నేపథ్యంలో తనకు పవన్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలుపడంతో, తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించింది.[2] ఈ పుస్తకం ఎనమిది లక్షల నలభై ఐదువేల కాపీలు అమ్ముడయై చరిత్ర సృష్టించింది.

మరణం

[మార్చు]

బొగ్గుల శ్రీనివాస్ 2026 ఫిబ్రవరి 14న తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. http://www.sakshi.com/news/andhra-pradesh/no-buyers-for-hate-book-on-pawan-kalyan-196989 కక్షతోనే పవన్ కళ్యాణ్‌పై పుస్తక రచన
  2. http://www.sakshi.com/news/telangana/boggula-srinivas-ask-security-from-pawan-kalyan-fans-195652 'పవన్ కళ్యాణ్ హటావో' రచయితకు రక్షణ
  3. "ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ అనుమానాస్పద మృతి". Sakshi. Retrieved 2026-02-15.