బోగీబీల్ వంతెన
బోగీబీల్ వంతెన | |
|---|---|
| నిర్దేశాంకాలు | 27°24′31″N 94°45′37″E / 27.40861°N 94.76028°E |
| OS grid reference | [1] |
| దీనిపై వెళ్ళే వాహనాలు | మోటారు వాహనాల, రైల్వే |
| దేనిపై ఉంది | బ్రహ్మపుత్రా నది |
| స్థలం | అస్సాం, భారతదేశం |
| లక్షణాలు | |
| వాడిన వస్తువులు | స్టీల్,కాంక్రీట్ |
| మొత్తం పొడవు | 4.94 kilometres (3.07 mi) |
| అత్యంత పొడవైన స్పాన్ | 125 m (410 ft) |
| స్పాన్ల సంఖ్య | 41 |
| చరిత్ర | |
| నిర్మించినవారు | Hindustan Construction Company (HCC), Gammon India |
| నిర్మాణం ప్రారంభం | 21 ఏప్రియల్ 2002 |
| నిర్మాణం పూర్తి | డిసెంబర్ 2018 |
| ప్రారంభం | 25 డిసెంబర్ 2018 |
| ప్రదేశం | |
![]() | |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బోగీబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన ఈ బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న అస్సాంలో డిబ్రూగఢ్ సమీపంలోని బోగీబీల్ వద్ద ప్రారంభించారు.[1]
చరిత్ర
[మార్చు]ఈ వంతెన దీబ్రూగఢ్ సమీపాన బ్రహ్మపుత్ర నదిపై దీనిని నిర్మించారు.1985 అస్సాం ఒప్పందంలో భాగంగా [2] 1997 లో భారత ప్రభుత్వం ఈ బోగీబీల్ వంతెనను నిర్మించే ఆమోదించింది. 1997, జనవరి 22న ప్రధాని హెచ్డీ దేవెగౌడ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానిగా ఉండగా 2002, ఏప్రిల్ 1న ప్రారంభమయ్యాయి.నిర్మాణంలో తీవ్ర జాప్యం కారణంగా అంచనా వ్యయం రూ.3,230.02 కోట్ల నుంచి 85 శాతం పెరిగి రూ. 5,960 కోట్లకు చేరింది.
నిర్మాణం
[మార్చు]ఈ వంతెన బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. భారతదేశంలోని అతి పొడవైన రైలు కమ్ రోడ్డు వంతెన. ఈ వంతెన నిర్మాణంలో 80 వేల టన్నుల స్టీల్ ప్లేట్లను ఉపయోగించారు.జాయింట్లు లేకుండా పూర్తిగా వెల్డింగ్ చేశారు.వంతెన పైన వాహనాలు వెళ్లడానికి మూడు వరుసల రహదారి, కింద రెండు వరుసల రైల్వే ట్రాక్ ఉంటుంది.[3][4][5]
ఇతర వివరాలు
[మార్చు]- ఈ వంతెన వల్ల అరుణాచల్లోని చైనా సరిహద్దు
భారత సైన్యాన్ని తరలించడం సులువు సులువుగా ఉంటుంది.అత్యవసర సందర్భాల్లో యుద్ధ విమానాలు దిగేందుకు కూడా అనుకూలంగా వంతెనను నిర్మించారు.
- యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో నిర్మితమైన తొలి వంతెన.
- ఈ వంతెన నిర్మాణం పూర్తి అవడానికి 21 సంవత్సరాలు పట్టింది. ఈ కాలంలోలో భారత దేశ ప్రధానులు నలుగురు మారారు
మూలాలు
[మార్చు]- ↑ "Bogibeel Rail-Cum-Road Bridge Project Targeted for Completion by March 2018". Government of India. Press Information Bureau. 25 July 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2014.
- ↑ "- Page flonnet". Frontline (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-12-15.
- ↑ http://www.thehindu.com/news/national/other-states/dhola-sadiya-bridge-10-things-to-know/article18582536.ece
- ↑ "Bogibeel Bridge project marks 10 years with slow work progress". Times of India. 21 April 2012. the original నుండి 3 డిసెంబరు 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 May 2013.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "railway-technology" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
