Coordinates: 16°01′23″N 79°57′25″E / 16.023°N 79.957°E / 16.023; 79.957

మక్కెన వారి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 16°01′23″N 79°57′25″E / 16.023°N 79.957°E / 16.023; 79.957
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంసంతమాగులూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


మక్కెన వారి పాలెం, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పటం

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల ప్రాంగణంలో, గ్రామస్థుల సమష్టి సహకారంతో, 2.5 లక్షల వ్యయంతో సభావేదిక నిర్మించుచున్నారు. జిల్లా పరిషత్తు నిధులు ఐదు లక్షల రూపాయలతో పాఠశాలకు ప్రహరీగోడ, సర్వశిక్షా అభియాన్ నిధులు ఏడు లక్షల రూపాయలతో మరుగుదొడ్లు నిర్మించుచున్నారు.

గ్రంథాలయం:- గ్రామానికి చెందిన కీ.శే. మక్కెన లింగయ్య శత జయంతి కానుకగా, ఈ పాఠశాలలో, ఆధునిక సౌకర్యాలతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేటందుకు, వారి సతీమణి శ్రీమతి మక్కెన తులశమ్మ, ప్రవాస భారతీయురాలైన వారి కుమార్తె డాక్టర్ మక్కెన రామాంజమ్మ, ఐదు లక్షల రూపాయల విరాళం అందజేసినారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఏలూరి పద్మావతి, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె తరువాత 2013 డిసెంబరు 12 నాడు, సంతమాగులూరు మండల సర్పంచుల సంఘం కార్యదర్శిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

పోలేరమ్మ గుడి[మార్చు]

మక్కెనవారిపాలెం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద, 2014, మార్చి-31, సోమవారం, ఉగాది రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో పొంగళ్ళు నిర్వహించారు. గుడి ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. చిన్నపాటి ప్రభను ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

  • ఈ గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో రామాలయ నిర్మాణం జరుగుచున్నది. గ్రామంలో గత 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ప్రాచీన ఆలయ ప్రదేశంలో నూతనంగా తయారు చేయించిన మూలవిరాట్టులను ప్రతిష్ఠించెదరు. నూతన ఆలయంలో గర్భగుడి, ఆలయమండపం, ఆంజనేయస్వామి గుడి, ప్రవేశమార్గంలో సూర్యభగవానుడు, శ్రీకృష్ణార్జునుల రథాలతో పాటు, ఆలయం చుట్టూ దేవతా ప్రతిమలు చెక్కిన ప్రహరీ నిర్మాణం పూర్తి అయినది. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2014, మే-29న ప్రారంభమైనవి. ఈ సందర్భంగా, 2014, జూన్-1, ఆదివారం నాడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు హోమాలు, విశేషపూజలు నిర్వహించారు. మూలవిరాట్టులు, కలశాలు, ధ్వజస్తంభాన్ని, భక్తులు జలంతో శుద్ధిచేసి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వస్తిశ్రీ చాంద్రమాన జయనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పంచమి అనగా జూన్-2,2014, సోమవారం, పుష్యమీ నక్షత్రయుక్త మిధునలగ్న పుష్కరాంశమున ఉదయం 8-04 గంటలకు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళవాద్యాలనడుమ, ఆలయప్రతిష్ఠతోపాటు, ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, గ్రామంలో నాభిశిల ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నసంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు స్థానికులేగాక మండలంలోని ఇతర గ్రామాలనుండి గూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ ఆలయంలో, 2014, జూన్-17, మంగళవారం నాడు, ఆలయ ప్రతిష్ఠ, 16 రోజుల పండుగను గ్రామప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
  • ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015, మే నెల-22వతేదీ, శుక్రవారంనాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. మూలవిరాట్టులను విశేషంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు, గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అన్నదానం నిర్వహించారు.

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

  1. ఈ ఆలయంలో, 2015, మే నెల-13వ తేదీ బుధవారం నాడు, హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు.
  2. ఈ ఆలయ 52వ ప్రతిష్ఠా వార్షికోత్సవాన్ని, 2016, ఫిబ్రవరి-17వ తేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం[మార్చు]

శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు, 2015, మే నెల-20వ తేదీ బుధవారం నుండి, 24వ తేదీ ఆదివారం వరకు నిర్వహించెదరు.

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

స్థానిక బి.సి.కాలనీలో నెలకొన్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక కొలుపులు, 2015, మే-20వ తేదీ బుధవారం నుండి 24వ తేదీ ఆదివారం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఆఖరిరోజైన ఆదివారం నాడు, విచ్చేసిన భక్తాదులకు అన్నసంతర్పణ నిర్వహించారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • ఏలూరి పూర్ణచంద్ర రావు.
  • దండా వెంకట్రామయ్య, వి ఎ ఎం సి. దండ

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]