ముద్దు రామకృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్దు రామకృష్ణయ్య
జననంముద్దు రామకృష్ణయ్య
అక్టోబర్ 18, 1907
మంథని
మరణంఅక్టోబర్ 21, 1985
కరీంనగర్ జిల్లా, మంథని
ప్రసిద్ధివిద్యావేత్త
మతంహిందూ మతము

ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన విద్యావేత్త. 1907లో మంథనిలో జన్మించాడు[1]. ఆయన తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి విద్యలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఇడి., ) పొందాడు. 1950వ దశకంలో అనేక దేశాలు తిరిగాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలు అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. నేటికీ ఇతని విధానాలు కొన్ని అమలులో ఉన్నాయి. నిరక్షరాస్యతా నిర్మూలన కొరకు 'ఈచ్ వన్ టీచ్ వన్' ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించిన గొప్ప విద్యావేత్త. తాను విదేశాలలో చదువుకొవడానికి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాలతో నా ప్రథమ విదేశీ యాత్ర అను పుస్తకాన్ని వెలువరించాడు.

మరణం[మార్చు]

ముద్దు రామకృష్ణయ్య 1985 అక్టోబరు 21వ తేదిన మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నవ వసంతం-3, 8 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015, పుట-11