యోగిమల్లవరం
యోగిమల్లవరం | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°36′29″N 79°26′35″E / 13.608123°N 79.443036°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | తిరుపతి గ్రామీణ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,166 |
- పురుషుల సంఖ్య | 1,131 |
- స్త్రీల సంఖ్య | 1,035 |
- గృహాల సంఖ్య | 547 |
పిన్ కోడ్ | 517561 |
ఎస్.టి.డి కోడ్ |
యోగిమల్లవరం, తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన తిరుపతి (గ్రా) నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 4 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 547 ఇళ్లతో, 2166 జనాభాతో 17 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1131, ఆడవారి సంఖ్య 1035. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 204 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595733[1].పిన్ కోడ్: 517503.
గ్రామ చరిత్ర[మార్చు]
ఈ గ్రామం అతి పురాతన గ్రామం. ఇక్కడ అతి పురాతన శివుడు దేవాలయం ఉంది. ఈ దేవాలయం పేరు పరాశరేశ్వర స్వామి.
విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్/ సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తిరుచానూరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల తిరుపతిలో ఉన్నాయి.
వైద్య సౌకర్యం[మార్చు]
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.
ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]
తాగు నీరు[మార్చు]
గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.
పారిశుధ్యం[మార్చు]
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]
సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]
గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు[మార్చు]
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం[మార్చు]
యోగిమల్లవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 15 హెక్టార్లు
- బంజరు భూమి: 1 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 2 హెక్టార్లు
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం
ఈ విభాగం లోని అంశం https://sarasabharati.wordpress.com/2020/08/17/పరాశర-మహర్షి-ప్రతిష్టించ నుండి గాని, లేదా ఏ ఇతర లేదా ఏదైనా మూలం నుండి కాపీ పేస్టు చేసినదై ఉండవచ్చు. ఇది బహుశా వికీపీడియా కాపీహక్కుల విధానం ప్రకారం ఉల్లంఘనై ఉండవచ్చు. ఈ వ్యాసంలో ఉచితం గాని కాపీహక్కులు కలిగిన భాగాలను తొలగించి, సరైన ఉచిత అంశాలనూ చేర్చి సరి చేయండి. లేదా తొలగించడానికి ప్రతిపాదించవచ్చు. ఈ కాపీహక్కుల ఉల్లంఘనకు మూలం వికీపీడియా మిర్రర్లు గాని, ఫోర్కులు గానీ కాదని గమనించండి. |
చిత్తూరు జిల్లా తిరుచానూర్ కు రెండుకిలో మీటర్ల దూరం లో జోగిమల్లవరం అనే చిన్న గ్రామం ఉన్నది .ఇదిఒకప్పుడు తిరుచనూరు లో భాగమే .దీనికి తిరుచుకానూర్ అనీ ,తిరు చోగినూర్ ,శుకగ్రామం అనే పేర్లు కూడా ఉండేవి .శుకమహర్షి పేరు మీద ఏర్పడిన గ్రామం అని అర్ధం యోగి చివరికి జోగి అయింది .ఇక్కడే అద్భుత శ్రీ పరశారేశ్వర చోళ దేవాలయం ఉంది .ఈగ్రామానికి పరశారేశ్వరం అనే పేరు స్వామి వలన కలిగింది .వశిష్ట మహర్షి మనవడు పరాశర మహర్షి ఈ లింగాన్ని ప్రతిస్టించాడు .ఈయన శక్తి మహర్షికు కుమారుడు .శక్తిమహర్శిని ఒకరాక్షసుడు సంహరిస్తే ,తండ్రిలేని పరాశరుడిని తాత వషిస్టుడే పోషించి పెంచాడు .తండ్రిని చూడాలని తాతను అడిగితె తాత శివుడికోసం తపస్సు చేయమని చెప్పగా పరశారుడు శివునికోసం ఇక్కడే తపస్సు చేశాడు.శివుడు ప్రత్యక్షమై స్వర్గం లో తండ్రిని దర్శించగలవని చెప్పాడు .అందుకే పరాశరమహర్షి ఇక్కడ శివలింగం ప్రతిస్టించాడు .కనుక పరాషరేశ్వర లింగం గాపేరు వచ్చింది .
అర్జునుడు యోగి గా దేశాలు తిరుగుతూ ఇక్కడే పాశుపతాస్త్రం కోసం తపస్సు చేయగా శివుడు వేటగాడి రూపం అంటే మల్ల రూపం లో ప్రత్యక్షమై పాశుపతాస్త్రం అనుగ్రహించాడు .యోగి అయిన అర్జునుడు మల్లుడైన శివుడు పవిత్రం చేసిన ప్రదేశం కనుక యోగిమల్లేశ్వరం అయి ఇప్పుడు జోగి మల్లవరం అని పిలువబడుతోంది .
ఆలయం లోచాలా శాసనాలున్నాయి .మొదటి రాజరాజ చోళుడు తన 23వయేట పాలనలో 1 008 లో వేసిన శాసనం బట్టి ఆలయం 11వ శతాబ్దికి ము౦దుదని తెలుస్తోంది .9వ శతాబ్దం చివర చోళరాజులు తిరుపతిని జయించారు . కనుక ఇది 10వ శతాబ్ది మధ్యకాలం నాటి ఆలయం అని అందరూ భావిస్తారు .చోళరాజచక్రవర్తి వీర రాజేంద్ర దేవుడు ఈ ఆలయాన్ని ‘’పిప్లాధీశ్వర ముదైయ మహాదేవాలయం ‘’గా పేర్కొన్నాడు .కులోత్తుంగ చోళ చక్రవర్తి దేవాలయానికి కానుకలు సమర్పించాడు .అలాగే త్రిభువన చక్రవర్తి రాజరాజ దేవుడుకూడా స్వామికి కానుక సమర్పించిన శాసనం ఉన్నది .మరొక శాసనం లో ఇక్కడి కోనేరు ను తిరుప్పత్తి ఉదై యార్ త్రవ్వించి నట్లున్నది .స్వామికి సమర్పించిన భూములు బంగారం తెలియజేసే రికార్డ్ లున్నాయి .
ఆలయం ఒకేఒక దక్షిణ ముఖద్వారమున్న ఆలయం .గర్భాలయం లోస్వామి లింగం ,అమ్మవారు ,ముఖమండపం ఉన్నాయి .గర్భాలయ, అంతరాలయాలు అధిష్టాన, ఉపానాలు కలిగిఉంటాయి.కొష్టాలు,తోరణాలు భూతమాలలు ఉంటాయి . ముఖమంటపం ఉంది .గర్భాలయం పై విమానం ఇటుకలతో కట్టారు .అంతరాలయ ప్రవేశం దగ్గర కుడివైపు గణపతి విగ్రహం అంకుశ,పాశ , దంత ,మోదుక,కర్ణ దామకూటం,యజ్ఞోపవీతం కలిగి ఉంటాడు .గర్భాలయం దక్షిణాన వీరాసన దక్షిణామూర్తి అక్షమాల కమండలం చిన్ముద్ర ,ప్రభామండలం ,చక్రకుండల గ్రైవేయక ,యజ్ఞోపవీత ఉదర బంధనాలతో జటాజూటం తోదర్శనంస్తాడు .కింద ఇరువైపులా ఇద్దరు మహర్షులుంటారు .గర్భాలయం పడమటి గోడపై విష్ణుమూర్తి సామభ౦గ౦ తో నిలబడి శంఖు చక్ర అభయ ముద్రతో ఉంటాడు .వాయవ్యభాగం లో కుమారస్వామి ఇద్దరు దేవేరులతో వీరాసనం లో ఆరు ముఖాలతో ,12చేతులతో ,వజ్ర బాణ ఖడ్గ చక్ర త్రిశూల ధనుస్సు శక్తి ,కుక్కుట,పాశాలతో అభయ ,వరద హస్తాలతో ఉంటాడు .చక్రకు౦డలం గ్రైవేయకం ,చన్నవీర ,ఉదర బంధనాలుంటాయి .కుడిప్రక్కా అమ్మవారు ఉత్పలం తో ఎడమవైపు అమ్మవారు కూడా చేతిలో ఉత్పలం తోకనిపిస్తారు .
బ్రహ్మ సమభంగం లో నిలబడి మూడు తలలు నాలుగు చేతులతో అక్షమాల కమండలం అభయముద్ర కటి హస్తం ,జటామకుట ,మకరకుండల గ్రైవేయక యజ్ఞోపవీత సింహలలాటాలతో ఉంటాడు .బ్రహ్మకు ఎడురుగా చండీశ్వరుడు ఎడమకాలు మడిచి కుడికాలు వేలాడుతూ ఎడమచేతిలోపద్మం ,కుడి తొడపై కుడిచేతితో శివ బంటుగా ఉంటాడు .కామాక్షి అమ్మవారి ప్రవేశ ద్వారం ఎడమవైపు సమభంగం లో నిలబడి బాల సుబ్రహ్మణ్యస్వామి కుడి అభయహస్తం ఎడమ కటిహస్తం తో యజ్ఞోపవీత ,ఉదరబంధన,గ్రైవేయక ,సింహ లలాట ,మెడహారం మోకాళ్ళవరకు వ్రేలాడుతూ కనిపిస్తాడు .
ముఖమండప ప్రదక్షిణ మార్గంలో కామాక్షీ అమ్మవారి చిన్న విగ్రహం సమభంగం లో నిలబడి ఉన్న ఆలయం ఉంటుంది .కుడిపై చేతిలో అంకుశం ,ఎడమ పై చేతిలో పాశం ,కింది చేతులలో అభయ వరముద్రలతో దర్శనమిస్తుంది
పార్వతీ పరిణయ దృశ్యం నృత్యగణపతి సోమస్క౦ద ,కంకాళమూర్తిలు కూడా చూడ ముచ్చటగా ఉంటారు .
గ్రామజనాభా[మార్చు]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామ జనాభా- మొత్తం 1,514 - పురుషుల 754 - స్త్రీల 760 - గృహాల సంఖ్య 337
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
ఇటువంటి పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ మల్లవరం చూడండి.