రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి (1860 - 1935) సుప్రసిద్ధ గాయకుడు. అతను పల్లవి పాడటం లో నేర్పరి. అందువల్ల అతనికి పల్లవి వెంకటప్పయ్య అనే వేరొక పేరు ఉండేది.

జీవిత విశేషాలు[మార్చు]

అతను గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జన్మించాడు. అతను చిన్నతనంలోనే సంగీతం మీద అభిరుచి కలిగి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి వద్ద సంగీతంలో శిక్షణ పొందాడు.[1] తర్వాత పలుప్రాంతాలలో కచేరీలు చేసి గొప్ప సంగీతవేత్తగా పేరుపొందాడు.అతను సంగీత విద్యను శాస్త్రీయ రీతిలో శిష్యులకు అన్నదానంతో పాటుగా బోధించేవారు.[2]

వీరి శిష్యులలో వారణాసి రామసుబ్బయ్య, షేక్ సిలార్ సాహెబ్, పెదమౌలానా, చినమౌలానా పేర్కొనదగినవారు. వీరి కుమారులు రాజనాల వెంకట్రామయ్య కూడా సంగీత విద్వాంసులుగా పేరుపొందారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-22.
  2. gdurgaprasad (2020-01-08). "దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2020-06-22.