రామ్ ప్రసాద్ బిస్మిల్
Ram Prasad Bismil | |
---|---|
జననం | Shahjahanpur, North-Western Provinces, British India | 1897 జూన్ 11
మరణం | 1927 డిసెంబరు 19 Gorakhpur jail, United Provinces of Agra and Oudh, British India | (వయసు 30)
సంస్థ | Hindustan Republican Association |
ఉద్యమం | Indian independence movement |
మతం | Hinduism |
రామ్ ప్రసాద్ బిస్మిల్ (11 జూన్ 1897 - 19 డిసెంబర్ 1927) భారతీయ విప్లవకారుడు, ఆయన 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర వంటివాటిలో పాల్గొని బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర సమరయోధుడు కావడంతో పాటుగా రామ్, ఆగ్యాత్, బిస్మిల్ వంటి కలంపేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాసిన కవి. కానీ ఆయన బిస్మిల్ అన్న పేరుతోనే ప్రఖ్యాతులయ్యారు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం స్ఫూర్తినివ్వగా, ఆయన ఆర్య సమాజ్ సంస్థతో అనుబంధం కలిగివుండేవారు. ఆర్య సమాజ్ బోధకుడు అయిన తన గురువు స్వామి సోమ్ దేవ్ ద్వారా లాలా హర్ దయాళ్ తో రహస్య సంబంధం కలిగివుండేవారు.
హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో బిస్మిల్ కూడా ఒకరు. భగత్ సింగ్ ఆయనను ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రశంసించేవారు. కవిత్వ రచనతో పాటుగా ఆయన ఆంగ్లం నుంచి కేథరీన్, బెంగాలీ నుంచి బోల్షెవికోం కీ కర్తూత్ పుస్తకాలను హిందీలోకి అనువదించారు. సర్ఫరోషీ కీ తమన్నాతో సహా అనేక స్ఫూర్తిదాయకమైన దేశభక్తి గీతాలు రచించారు.'
తొలినాళ్ళ జీవితం[మార్చు]
రాం ప్రసాద్ బిస్మిల్ 11 జూన్ 1897లో బ్రిటీష్ ఇండియాలో వాయువ్య సరిహద్దు ప్రావిన్సులోని షాజహాన్ పూర్ లో జన్మించారు. ఆయన ఇంట్లో తన తండ్రి నుండి హిందీ నేర్చుకొని ఒక moulvi నుండి ఉర్దూ తెలుసుకోవడానికి పంపబడ్డారు. ఆయన తండ్రి యొక్క తిరస్కారం ఉన్నప్పటికీ, ఆంగ్ల భాష పాఠశాల చేర్పించారు, షాజహాన్పూర్ ఆర్య సమాజ్ లో చేరారు. బిస్మిల్ దేశభక్తి కవిత్వం వ్రాయడం లో ఒక ప్రజ్ఞను ప్రదర్శించాడు.[మూలాలు తెలుపవలెను]