ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం

వికీపీడియా నుండి
(రాష్ట్ర ఎన్నికల కమీషన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం
సంస్థ వివరాలు
స్థాపన జూన్ 1994
అధికార పరిధి ఆంధ్రప్రదేశ్
ప్రధానకార్యాలయం 1వ అంతస్తు , కొత్త హెఒడిల భవనం , ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, మహాత్మా గాంధీ రోడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్- 520010
కార్యనిర్వాహకులు నీలం సాహ్నీ, ఐఎఎస్, (రిటైర్డు) [1], రాష్ట్ర ఎన్నికల కమీషనర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇది ఒక స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర రాజ్యాంగ, చట్టపరమైన అధికారం కలిగిన సంస్థ. ఇది భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్సు 243 ZA, 243 K కింద ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది.

చరిత్ర[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జూన్ 1994 లో ఏర్పడింది. ఇది ఏర్పడిన తర్వాత మునిసిపాలిటీలు , పంచాయతీ రాజ్ సంస్థలకు మొదటి స్థానిక సంస్థ ఎన్నికలు 1995 మార్చిలో జరిగాయి. రెండవ, మూడవ స్థానిక సంస్థ ఎన్నికలు వరుసగా 2000-2001, 2005-2006లో జరిగాయి. 4 వ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీలకు జూలై 2013 లో, మునిసిపాలిటీలకు 2014 మార్చిలో, ఎంపిటిసిలు జెడ్‌పిటిసిలకు 2014 ఏప్రిల్‌లో జరిగాయి.

వ్యవస్థ రూపం[మార్చు]

రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమీషనరును మంత్రిమండలి సిఫారస్ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియమిస్తారు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిలో ఉన్న అధికారులను ఈ పదవికి నియమిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఒక కార్యదర్శి సహాయం చేస్తారు, అతను కేడర్ ఆఫీసర్ (IAS), న్యాయ సలహాదారు (జిల్లా జడ్జి ర్యాంక్) ఒక జాయింట్ సెక్రటరీ.

కమీషనర్[మార్చు]

2016 ఏప్రిల్ 1 న న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నివృత్త ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించబడ్డాడు.[2] 2020 మార్చి లో MPTC/ZPTC, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభం తర్వాత కరోనా కారణంగా నిమ్మగడ్డ నిర్ణయం మేరకు ఎన్నికలు నిలిపివేయబడ్డాయి. ఇది రాష్ట్రప్రభుత్వ కోరికకు వ్యతిరేకంగా వుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ పదవికాలాన్ని మూడు సంవత్సరాలకు పరిమితం చేసి, నివృత్త హైకోర్టు న్యాయమూర్తి నియమించాలని ఆర్డినెన్స్ చేసి, నిమ్మగడ్డను అర్ధంతరంగా విధులనుంచి తప్పించి న్యాయమూర్తి కనగరాజ్ ను నియమించింది. దీనిగురించి హైకోర్టు, సుప్రీంకోర్టులలో వివాదం నడచి, హైకోర్టు ఉత్తర్వుమేరకు (సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి) నిమ్మగడ్డను మరల నియమించారు.[3] నిమ్మగడ్డ పదవీ విరమణ అనంతరం, 2021 ఏప్రిల్ 1 న నీలం సాహ్నీ పదవి చేపట్టారు. [4]

విధులు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ , పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రత్యక్ష , పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. వీటిపై ఏకైక నియంత్రణ అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంది. వార్డులు వారీగా ఎన్నికల జాబితాల తయారీకి ప్రధాన ఎన్నికల అధికారి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్నికలు) విభాగం (రాష్ట్రంలోని భారత ఎన్నికల సంఘం ప్రతినిధి ) పర్యవేక్షణలో తయారుచేసిన అసెంబ్లీ ఎన్నికల వోటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఉపయోగిస్తుంది. వోటర్ జాబితా ఆధారంగా పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తారు. స్థానిక సంస్థలలో సీట్లు, పరిధి హద్దులను నిర్ణయించడం, రిజర్వేషన్ లాంటి ముందస్తు ఎన్నికల పనులు పూర్తయినవని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన తరువాత, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేస్తుంది.

ప్రత్యక్ష ఎన్నికలు[మార్చు]

కింది పదవులకు ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిలో జరుగుతాయి .

గ్రామీణ స్థానిక సంస్థలు[మార్చు]

  1. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్‌పిటిసి) సభ్యులు
  2. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) సభ్యులు
  3. గ్రామ పంచాయతీ సర్పంచ్
  4. గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యుడు

పట్టణ స్థానిక సంస్థలు[మార్చు]

పట్టణ స్థానిక సంస్థలు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలను కలిగి ఉంటాయి.

  1. మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు / వార్డ్ సభ్యులు
  2. మునిసిపాలిటీ / నగర్ పంచాయతీ కౌన్సిలర్లు / వార్డ్ సభ్యులు

పరోక్ష ఎన్నికలు[మార్చు]

కింది స్థానాలకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి: ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, సంబంధిత స్థానిక సంస్థలలో కమిషన్ నియమించిన తేదీ, సమయం ప్రకారం పరోక్ష ఎన్నికలు జరుగుతాయి.

గ్రామీణ స్థానిక సంస్థలు[మార్చు]

  1. గ్రామ పంచాయతీకి చెందిన ఉప-సర్పంచ్.
  2. మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు.
  3. జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్.

పట్టణ స్థానిక సంస్థలు[మార్చు]

  1. మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్
  2. మునిసిపాలిటీల చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్

కమిషనర్స్[మార్చు]

  • నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ - 2016 జ‌న‌వ‌రి 30 నుండి మార్చి 31, 2021
  • నీలం సాహ్ని - 2021 ఏప్రిల్ నుండి ప్రస్తుతం [4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్నీ బాధ్యతలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక ప్రకటన!". సమయం. 2021-04-01. Retrieved 2021-04-01.
  2. "Ramesh Kumar takes office as new Andhra SEC". The Hindu. 2016-04-01. Retrieved 2021-01-23.
  3. "అర్ధరాత్రి ఉత్తర్వులు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ పునర్నియామకం." వన్ ఇండియా. 2020-07-31. Retrieved 2021-01-23.
  4. 4.0 4.1 "ఏపీ ఎస్‌ఈసీగా నీలం సాహ్ని | Neelam Sahni appointed as the SEC of AP". web.archive.org. 2021-09-30. Archived from the original on 2021-09-30. Retrieved 2022-08-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు[మార్చు]