లాల్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాల్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లాల్ సింగ్ గిల్
పుట్టిన తేదీ(1909-12-16)1909 డిసెంబరు 16
కౌలాలంపూర్, మలేసియా
మరణించిన తేదీ1985 నవంబరు 19(1985-11-19) (వయసు 75)
కౌలాలంపూర్
బ్యాటింగుRight-handed
బౌలింగుRight-arm slow-medium
పాత్రBatsman
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 4)1932 25 June - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1933–1936Patiala
1935–1936Southern Punjab
1934–1935Hindus
1935Maharaja of Patiala's XI
1935Cricket Club of India
1934Retrievers
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 1 32
చేసిన పరుగులు 44 1123
బ్యాటింగు సగటు 22.00 24.95
100లు/50లు 0/0 1/5
అత్యధిక స్కోరు 29 107*
వేసిన బంతులు 0 80
వికెట్లు 1
బౌలింగు సగటు 59.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/9
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 23/0
మూలం: ESPNcricinfo, 2020 9 May

లాల్ సింగ్ (1909 డిసెంబరు 16 - 1985 నవంబరు 19) తొలి భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు . [1]

క్రికెట్ కెరీర్[మార్చు]

1932లో ఇంగ్లండ్‌లో పర్యటించిన పోర్‌బందర్ మహారాజా కెప్టెన్సీలో ఉన్న టెస్ట్ జట్టు ఫోటోలో లాల్ సింగ్ కుడివైపు నుండి మొదటిగా నిలబడి కనిపించాడు.

లాల్ సింగ్ గిల్ పూర్తి పేరు లాల్ సింగ్, మలయాలోని కౌలాలంపూర్‌లో 1909 డిసెంబరు 16న జన్మించాడు. 1985 నవంబరు 19న కౌలాలంపూర్‌లోని పెటాలింగ్ జయాలో మరణించాడు. అతను, 1932లో ఇంగ్లాండ్‌లో ఏకైక-టెస్టు కోసం పర్యటించిన భారత జట్టులో సభ్యుడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, అత్యుత్తమ ఫీల్డరు. ఈ పర్యటనలో ఆడిన ఏకైక టెస్టులో అతను రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేశాడు. 40 నిమిషాల్లో అమర్ సింగ్‌తో కలిసి 74 పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ సమయంలో, అతను ప్రారంభ ఉదయం అద్భుతమైన పిక్ అప్ అండ్ త్రోతో ఫ్రాంక్ వూలీని రనౌట్ చేశాడు.

1926-40 మధ్య కౌలాలంపూర్‌లో జరిగిన మ్యాచ్‌లలో లాల్ సింగ్ పేరు ప్రముఖంగా ఉండేది. 1931 ఆగస్టులో అతను సింగపూర్‌లోని పదాంగ్‌లో స్ట్రెయిట్స్ సెటిల్‌మెంట్‌లకు వ్యతిరేకంగా ఫెడరేటెడ్ మలయ్ స్టేట్స్ తరపున 138 పరుగులు చేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అదే మ్యాచ్‌లో, 118 పరుగులు సాధించాడు.

జీవితం తొలి దశలో[మార్చు]

ఎడమ నుండి కుడికి కూర్చున్నవారు: ఒడిలో కొడుకుతో SS గిల్ భార్య, లాల్ సింగ్ తల్లి, BS గిల్ భార్య ఒడిలో సోదరి కొడుకుతో. కింద వరుసలో ఎడమ నుండి కుడికి: SS గిల్ పెద్ద కుమార్తె అజ్మీర్ కౌర్ (తర్వాత నీలం షమ్సీ అని పేరు మార్చుకుంది) ; SS గిల్ చిన్న కూతురు అమర్ కౌర్

లాల్ సింగ్ మలయాలోని సంపన్న గిల్ జాట్ కుటుంబంలో జన్మించాడు, వీరు 3 తరాల క్రితం భారతదేశం నుండి మలయాకు వలస వచ్చారు. అతను 3 కుమారులలో చిన్నవాడు. పెద్దవాడు శాంత సింగ్ గిల్ (తారిఖ్ బి షమ్సీ యొక్క తల్లితండ్రులు) కాగా మధ్య సోదరుడు బిషెన్ సింగ్ గిల్.

ముగ్గురు సోదరులు కౌలాలంపూర్‌లోని ప్రతిష్టాత్మకమైన విక్టోరియా ఇన్‌స్టిట్యూషన్ (VI)లో చదువుకున్నారు, ఇది సెలంగోర్ యొక్క నాల్గవ సుల్తాన్ అయిన సుల్తాన్ అబ్దుల్ సమద్ ఇబ్నీ అల్మర్‌హూమ్ రాజా అబ్దుల్లా ఆధ్వర్యంలో స్థాపించబడింది. విక్టోరియా రాణి పేరు పెట్టబడింది. విక్టోరియా ఇన్‌స్టిట్యూషన్ లేదా VI ఆమె పాలన యొక్క స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ప్రారంభించబడింది. VI పూర్వ విద్యార్థులలో చాలా మంది గౌరవప్రదమైన, విశిష్ట వ్యక్తులున్నారు. సుల్తాన్ హస్సనల్ బోల్కియా - బ్రూనై సుల్తాన్ తదితర రాజ కుటుంబీకులు వీరిలో ఉన్నారు.

విక్టోరియా ఇన్‌స్టిట్యూషన్ అండ్ క్రికెట్ ఇన్ ఇండియాలో లాల్ సింగ్[మార్చు]

ప్రిఫెక్ట్స్ విక్టోరియా ఇన్స్టిట్యూషన్ 1928. లాల్ సింగ్ కుడి నుండి మూడవ స్థానంలో కూర్చున్నాడు
లాల్ సింగ్, BS గిల్ విక్టోరియా ఇన్స్టిట్యూషన్ క్రికెట్ టీమ్ 1924
BS గిల్, లాల్ సింగ్, విక్టోరియా ఇన్స్టిట్యూషన్ క్రికెట్ టీమ్ 1925
లాల్ సింగ్, BS గిల్, విక్టోరియా ఇన్స్టిట్యూషన్ క్రికెట్ టీమ్ 1926

సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో క్రికెట్ ఆడాలనే మక్కువతో, అతను తన తల్లిని భారతదేశంలో క్రికెట్ ఆడేందుకు అనుమతించి, స్పాన్సర్ చేయమని ఒప్పించాడు. కుటుంబం తదనుగుణంగా మహారాజా పాటియాలా, కుటుంబానికి తెలిసిన భూపిందర్ సింగ్‌ను సంప్రదించింది. మహారాజా భూపిండిర్ సింగ్, స్వయంగా మంచి క్రికెట్ ఆటగాడు, ఆటను ఇష్టపడేవాడు. లాల్ సింగ్‌ను మహారాజా స్వయంగా నాయకత్వం వహించిన మహారాజా పాటియాలా XI తన జట్టులో ఆడటానికి లాల్ సింగ్‌ను పంపమని కుటుంబానికి సలహా ఇచ్చాడు. 1931లో అతను పాటియాలా చేరుకుని, మహారాజా భూపిందర్ సింగ్ సహవాసంలో 'పాటియాలా పెగ్' పట్ల తన జీవితకాల ప్రేమను పెంచుకున్నాడు. మరుసటి సంవత్సరం లాల్ సింగ్, 1932లో ఇంగ్లండ్‌కు భారత తొలి పర్యటనకు ఎంపికయ్యాడు. జట్టు కెప్టెన్‌గా మహారాజా భూపిందర్ సింగ్ ఉండాల్సి ఉంది, అయితే జట్టు బయలుదేరడానికి కొన్ని వారాల ముందు, అతను అనారోగ్యానికి గురయ్యాడు. అతని స్థానంలో పోర్‌బందర్ మహారాజా నట్వర్‌సిన్హ్జీ భావ్‌సిన్హ్జీని కెప్టెన్‌గా నియమించారు.

1934-35లో, లాల్ సింగ్ బాంబే క్వాడ్రాంగులర్ టోర్నమెంట్‌లో హిందువులకు, ప్రారంభ రంజీ ట్రోఫీలో సౌత్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దక్షిణ పంజాబ్ జట్టుకు పాటియాలా మహారాజా భూపిందర్ సింగ్ నాయకత్వం వహించారు. లాలా అమర్‌నాథ్, మహమ్మద్ సయీద్, నజీర్ అలీ, నిస్సార్ మొహమ్మద్, మహారాజాలు లాల్ సింగ్‌లతో కలిసి ఆడిన ప్రముఖ ఆటగాళ్లు. యునైటెడ్ ప్రావిన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో, 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ, లాల్ సింగ్ 56 పరుగులు చేశాడు. సదరన్ పంజాబ్ ఆడిన ఏకైక ఇన్నింగ్స్‌లో ఇది అత్యధికం.

అతను 1935-36లో జాక్ రైడర్ ఆస్ట్రేలియన్ జట్టుతో బాంబేలో జరిగిన అనధికారిక 'టెస్ట్'లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

లాల్ సింగ్ చేసిన ఏకైక ఫస్ట్-క్లాస్ సెంచరీ (107 నాటౌట్) 1935-36 బాంబే క్వాడ్రాంగులర్ టోర్నమెంట్‌లో జింఖానా గ్రౌండ్‌లో పార్సీలతో జరిగిన మ్యాచ్‌లో హిందువుల జట్టు తరఫున వచ్చింది. తన జట్టు స్కోరు 99-6 వద్ద ఉండగా, అతను విజయ్ మర్చంట్ (30 నాటౌట్)తో 8వ వికెట్‌కు 132 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

మహారాజా భూపిందర్ సింగ్‌కు లాల్ సింగ్ అంటే చాలా ఇష్టం. లాల్ సింగ్‌కు మహారాజుతో ఉన్న ఈ సాన్నిహిత్యం వలన అతనికి చాలా మంది శత్రువులు అయ్యారు. దాని ఫలితంగా, 1936 లో లాల్ సింగ్ పై ఒక హత్యా ప్రయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడినా ప్రాణాలతో బయటపడ్డాడు. కోలుకున్న తర్వాత, మహారాజా భూపిందర్ సింగ్ అనుమతితో అతను, 1936లో పారిస్ వెళ్లిపోయాడు.

పారిస్, ప్రేమలో పడటం[మార్చు]

భారతదేశంలో ఉన్నప్పుడు, అతను బొంబాయిలోని తాజ్ మహల్ హోటల్‌లో ప్రదర్శన ఇస్తున్న ఆఫ్రో-అమెరికన్ గాయని మర్టిల్ వాట్కిన్స్‌ను కలిశాడు. అతని గాయాల నుండి కోలుకున్న తర్వాత, అతను, మర్టల్ ప్యారిస్‌కు వెళ్లారు, అక్కడ లాల్ సింగ్ రాత్రిపూట ప్రదర్శన ఇవ్వడానికి మైర్టిల్ కోసం నైట్ క్లబ్‌ను ప్రారంభించాడు. నైట్ క్లబ్ తెరవడానికి డబ్బును అతని తల్లి లాల్ సింగ్‌కు పంపింది.

పారిస్ నుండి అతను తన కుటుంబానికి, మర్టల్‌తో ఉన్న స్టూడియో ఫోటోను పంపాడు, దాని వెనుక అతను ఇలా వ్రాసాడు, 'ఇది ఆమె, ఇది నేను ..... అతి త్వరలో మేం ముగ్గురం కావచ్చు'.

దురదృష్టవశాత్తూ, ఈ వ్యవహారం ఎక్కువ కాలం కొనసాగలేదు. మిర్టెల్, లాల్ సింగ్ విడిపోయారు. అతని నైట్ క్లబ్‌ను విక్రయించి 1939 ఆగస్టులో మలయాకు తిరిగి వెళ్ళాడు. తరువాతి నెలలో జర్మనీ పోలాండ్‌పై దాడి చేసింది. అది WWIIకి నాంది. జపాన్ 1941 డిసెంబరు 7 న పెర్ల్ హార్బరుపై దాడి చేసి, మరుసటి రోజు మలయాను క్రమంగా ఆక్రమించడం ప్రారంభించింది. 1942 జనవరి 31 నాటికి మలయా ద్వీపకల్పం మొత్తాన్ని జపాన్ స్వాధీనం చేసుకుంది.

రెండో ప్రపంచ యుద్దం[మార్చు]

1942 జూన్‌లో లాల్ సింగ్ అన్నయ్య SS గిల్‌ను, మలయా నుండి సింగపూర్‌కు పారిపోవడానికి బ్రిటిష్ ఆర్మీ అధికారులకు సహాయం చేస్తున్నందున జపనీయులు అరెస్టు చేసారు. మరుసటి రోజు అతని సోదరులు BS గిల్, లాల్ సింగ్ కూడా అరెస్టయ్యారు. వారి మూడు ఇళ్ళు, రబ్బరు తోటలు, బంగారు గనితో సహా అన్ని ఆస్తులను జపనీయులు జప్తు చేశారు. 3 నెలల్లో SS గిల్, BS గిల్‌లను జపాన్ ఆక్రమణ దళాలు ఉరితీశారు. లాల్ సింగ్‌ను బోర్నియోలోని బానిస కార్మిక శిబిరానికి పంపారు.

SS గిల్ పెద్ద కుమార్తె అజ్మీర్ కౌర్ (తరువాత నీలం షమ్సీ), అప్పుడు కేవలం 15 సంవత్సరాలు, ఆమె చెల్లెలు, నాన్నమ్మతో కలిసి ఒక ఇంటిలోని ఒక భాగంలో నివసించడానికి అనుమతించారు. అయితే, అజ్మీర్ కౌర్, ఆమె సోదరి అమర్ కౌర్ చదువుకున్న కులాలంపూర్‌లోని విశాలమైన బుకిట్ నానాస్ కాన్వెంట్‌లోని మదర్ సుపీరియర్, ఈ సోదరీమణులను వారి నాన్నమ్మను ఇద్దరినీ కాన్వెంట్‌లోకి తీసుకెళ్లి అక్కడ ఉంచి, వారి సంరక్షణను చాలా కాలం పాటు చూసుకున్నారు. లాల్ సింగ్, బోర్నియోలోని బానిస కార్మిక శిబిరం నుండి తప్పించుకుని, 1945 ఆగస్టులో కౌలాలంపూర్‌కు తిరిగి వెళ్ళగలిగాడు. అతను తన తల్లిని, ఇద్దరు పిల్లలనూ తిరిగి కలిసినప్పటికి అతనొక అస్థిపంజరం లాగా ఉన్నాడు. ఖైదులో అతన్ని చాలా దారుణంగా హింసించారు. పైగా తలపాగా లేని అతన్ని చూసి తల్లి, మొదట్లో అతనిని గుర్తించలేకపోయింది.[2]

యుద్ధం తరువాత[మార్చు]

యుద్ధం తరువాత

జపాన్ 1945 సెప్టెంబరు 5న మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోయింది. లాల్ సింగ్ ఎదుర్కొంటున్న తక్షణ సమస్య ఏమిటంటే, మలయాను జపాన్ ఆక్రమించుకోవడం వల్ల కుటుంబానికి డబ్బు లేకుండా పోయింది కాబట్టి అనారోగ్యంతో ఉన్న తన తల్లిని, ఇద్దరు మేనకోడళ్లను ఎలా చూసుకోవాలి అనేది. లాల్ సింగ్ తన జీవితంలో ఎప్పుడూ పని చేయలేదు. సహాయం కోసం ఎవరి తలుపు తట్టలేదు. వెంటనే, అతను ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు. యుద్ధానంతర మలయాలో దొరికిన ఉద్యోగం, కౌలాలంపూర్‌లోని సెలంగోర్ క్లబ్‌లోని గ్రౌండ్‌స్‌మెన్.

బందిఖానాలో ఉన్నప్పుడు, జపనీయులు అతని తల, గడ్డం షేవ్ చేసారు. ఆ తర్వాత, అతను మళ్లీ తన జుట్టు లేదా గడ్డం పెంచుకోలేదు, తలపాగా ధరించలేదు.

AB షమ్సీ, (బసీర్ షమ్సీ) బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్. అతన్ని బర్మా నుండి మలయాకు బదిలీ చేసారు. అతను క్రికెట్ ఆడటానికి సెలంగర్ క్లబ్‌కి వెళ్లి గ్రౌండ్స్‌మెన్‌గా పనిచేస్తున్న లాల్ సింగ్‌ను కలిసాడు. 1946లో, AB షమ్సీ, లాల్ సింగ్ పెద్ద మేనకోడలు అజ్మీర్ కౌర్‌ను పెళ్ళి చేసుకున్నాడు. 1946 సెప్టెంబరు 11 న ఆమె ఇస్లాం మతంలోకి మారి నీలం అనే పేరు పెట్టుకుంది.

1950లో, గిల్ కుటుంబానికి సన్నిహితులైన సుల్తాన్ సర్ హిషాముద్దీన్ ఆలం షా అల్-హాజ్, సెలంగర్ క్లబ్‌ను సందర్శించినపుడు, అక్కడ లాల్ సింగ్ గ్రౌండ్స్‌మెన్‌గా పని చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. సుల్తాన్, లాల్ సింగ్‌ కుటుంబానికి చెందిన ఎస్టేట్‌లను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించాడు. 1953 నాటికి ఆ ఎస్టేటులన్నీ లాల్ సింగ్ పేరిట వచ్చాయి.

లాల్ సింగ్, తన మిగిలిన రోజులను విదేశాలకు ప్రయాణిస్తూ గడిపాడు. ఎక్కువగా వేసవిలో పారిస్‌కు వెళ్లాడు. అతను 1985 నవంబరు 19 న కౌలాలంపూర్‌లోని పెటాలింగ్ జయాలో ప్రశాంతంగా మరణించాడు. 'లాల్ సింగ్ షీల్డ్' కోసం కౌలాలంపూర్‌లో ఏటా ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. మలేషియాలోని సిక్కు సంఘం, 'లాల్ సింగ్ ట్రోఫీ' కోసం క్లబ్‌ల మధ్య వార్షిక టోర్నమెంట్‌ని నిర్వహిస్తుంది.

గోల్డెన్ జూబ్లీ[మార్చు]

1980లో BCCI స్థాపన 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బొంబాయిలో జరిగిన గోల్డెన్ జూబ్లీ టెస్ట్‌కు హాజరైన అత్యంత పురాతన ఆటగాళ్ళలో అతను ఒకడు.

మూలాలు[మార్చు]

  1. "Lall Singh". ESPN Cricinfo. Retrieved 9 May 2020.
  2. "The incredible life of Lall Singh". Mid-day (in ఇంగ్లీష్). 2022-06-26. Retrieved 2023-08-29.