వేటూరి ఆనందమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేటూరి ఆనందమూర్తి (జ: 1930) ప్రఖ్యాత పరిశోధకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి కుమారుడు. స్వయంగా పరిశోధకుడు. అన్నమయ్య సాహిత్యంపై అధ్యయనం చేశాడు. ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకుడు. మణిమంజరి అనే అర్ధవార్షిక పత్రికకు సంపాదకత్వం వహించి నడిపాడు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా 1989-1990లలో పనిచేశాడు. సాహిత్య అకాడమీ భాషాసమ్మాన్ పురస్కారం(2006), శ్రీకృష్ణదేవరాయ పురస్కారం,సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టువారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2010) మొదలైన అనేక పురస్కారాలు పొందాడు.[1]

రచనలు[మార్చు]

  1. తాళ్లపాక కవుల కృతులు వివిధ సాహితీ ప్రక్రియలు
  2. తాళ్లపాకకవుల పదకవితలు భాషా ప్రయోగ విశేషాలు
  3. క్షేత్రజ్ఞులు పదసాహితి
  4. మన వాగ్గేయకారులు-తొలి సంకీర్తన కవులు

2017,ఫిబ్రవరి-7న, కీ.శే.వేటూరి ప్రభాకరశాస్త్రి 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా, పెదకళ్ళేపల్లి గ్రామములో, వీరు రచించిన ఆంధ్ర సాహిత్యంపై విష్ణు మత ప్రభావం - తాళ్ళపాక కవులు అను గ్రంధావిష్కరణ జరిగినది. [ఈనాడు అమరావతి; 2017,ఫిబ్రవరి-7; 2వపేజీ]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2015-10-23.