ఉస్మానియా విశ్వవిద్యాలయం
![]() | |
రకం | ప్రభుత్వ |
---|---|
స్థాపితం | 1918 |
ఛాన్సలర్ | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
వైస్ ఛాన్సలర్ | ఆచార్య యస్.రామచంద్రం |
చిరునామ | ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు, తెలంగాణ - 500 007 భారతదేశం, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | పట్టణ |
జాలగూడు | www.osmania.ac.in |
NAAC ద్వారా ఐదు నక్షత్రాల నాణ్యత గుర్తింపు పొందినది |
ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ప్రధాన విశ్వవిద్యాలయం. దీని విస్తీర్ణం 3.90 హెక్టారులు.ఈ విశ్వవిద్యాలయం పరిధిని 2011 భారత జనాభా గణాంకాలలో ఒక జనగణన పట్టణంగా గుర్తించింది.[1]ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII చే 1917లో స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్ 26న జారీ చేశారు.
ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం[2]. హైదరాబాదులోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది.
చరిత్ర[మార్చు]
నిజాం పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది. ఆవిధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. ఆబిడ్స్ గన్ఫౌండ్రి దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి.[3] భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాదు సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.
ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా మాద్యమంగా ప్రవేశ పెట్టి బ్యూరో ఆఫ్ ట్రాన్స్లేషన్ ను ఏర్పాటు చేసారు. మొదట గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 విద్యార్థులతో ఇంటర్మీడియట్ సాయంకాలం కోర్సులతో ప్రారంభించి క్రమంగా 1921 లో బి.ఏ, 1923 లో ఎం.ఎ.ఎల్.ఎల్.బి 1927 లో మెడిసిన్, 1929 లో ఇంజనీరింగు కోర్సులనూ ప్రవేశ పెట్టారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాలలో వున్న కళాశాలలను పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే ప్రాంతంలో వుంటే బాగుంటుందని సంకల్పించి, తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత కాంపస్ ను ఏర్పాటు చేసారు.
భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్ లుగా సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్ లను నిమమించారు. వారు అమెరికాలోని కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్ లోని ఆక్స్ పర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన విశ్వవిద్యాలయాలను సందర్శించి వచ్చారు. బెల్జియానికి చెందిన ఇ.జస్సార్ ను సలహాదారుగా నియమించి లా, ఇంజరీరింగ్, ఆర్ట్స్ కళాశాల లైబ్రరి, సెనేట్ హాలు వంటి భవనాలను నిర్మించారు. ఆర్ట్స్ కాలేజి భవనానికి 1923 జూలై 5న పునాదులు వేసి, 1939 డిసెంబరు నాల్గవ తేదీన పూర్తి చేసారు. అదే రోజున హైదరాబాదు నిజాము దీనిని ప్రారంబించాడు. నైజాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండిన అక్బర్ హైదర్ చాన్సెలర్ గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ ఛాన్సెలర్ గా నియమితులయ్యారు. 1949 లో హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు ఉన్న ఉర్దూ మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశ పెట్టారు. ఇస్లాం యూనివర్సిటీగా నామకరణం చేయాలని మొదట్లో వచ్చిన ప్రతి పాదనను కాదని ఉస్మానియా యూనివర్సిటీగా పేరు పెట్టారు. ఇండియా టుడే పత్రిక మన దేశంలో వున్న 160 యూనివర్సిటీలపై సర్వే నిర్వహించగా 2010 వ సంవత్సరంలో 10వ స్థానం, 2011లో 7వ స్థానం, 2012 లో ఆరవ స్థానం లభించింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది.
స్నాతకోత్సవం[మార్చు]
2019, జూన్ 17న 80వ స్నాతకోత్సవం జరిగింది. స్నాతకోత్సవానికి గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై 292 మందికి బంగారు పతకాలు, 700 మందికిపైగా అభ్యర్థులకు పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు.[4][5] 1917 నుండి ఇప్పటివరకు 47మందికి గౌరవ డాక్టరేట్లు అందజేయబడ్డాయి.[6]
ప్రతిష్ఠ , బోధించే విషయాలు[మార్చు]
1,600 ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థలకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భూగోళ శాస్త్ర విభాగం దక్షిణ భారతావనిలోనే పురాతనమైనది, పెద్దది. ఇది 1942 లో స్థాపించబడింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ[మార్చు]
ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ. ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధన (పీ.హెచ్.డి) లను అందిస్తున్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం[మార్చు]
ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు ఎం. ఫిల్, పీహెచ్.డి డిగ్రీ లను అందిస్తున్నది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం[మార్చు]
ప్రత్యేక తెలంగాణకై విశ్వవిద్యాలయ విద్యార్థులు 1965 నుంచి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రాతంలో ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉండటం, ఇక్కడి విద్యార్థులు తెలంగాణ వారే అధికసంఖ్యలో ఉండటం ఇందుకు దోహదం చేసింది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇక్కడ విజయవంతంగా జరిగిన వందేమాతరం ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడి విద్యార్థులు, మేధావులు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చారు.
చెప్పుకోదగిన పూర్వవిద్యార్ధులు[మార్చు]
ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన అప్పటి విద్యార్థి నాయకులు, విద్యార్థులు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. వారిలో ప్రథముడు పీవీ నరసింహారావు. బీ హాస్టల్ నుంచి ప్రారంభమైన వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా దేశానికే ప్రధానిగా సేవలు అందించారు.
- సీహెచ్ విద్యాసాగరరావు (మహారాష్ట్ర గవర్నర్ )
- మహమ్మద్ రజీ-ఉద్దిన్ సిద్దిఖీ. గణిత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతికి నామిని చేయబడినవారు.
- పి.వి.నరసింహారావు, పూర్వ భారతదేశ ప్రధానమంత్రి.
- సయ్యద్ అలీ మొహమ్మద్ ఖుస్రో, ఆర్థికవేత్త, మాజీ జర్మనీ రాయబారి
- హరూన్ సిద్ధిఖీ, కెనడాలో భారత పాత్రికేయుడు
- రాములు కొమిరెడ్డి, జర్నలిస్టు
- ఆచార్య అఫ్జల్ మొహమ్మద్ ఉపసంచాలకుడు, బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు
- శ్యాం బెనగళ్, భారతీయ సినిమా దర్శకుడు
- హర్ష భోగ్లే, క్రికెట్ వ్యాఖ్యాత
- వరవరరావు, విప్లవ కవి
- జైపాల్ రెడ్డి, కాంగ్రెస్
- కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి
- గుంటుపల్లి కల్పలత, ఛాతీవైద్యురాలు. అమెరికా ఛాతీవైద్యుల సంఘం అధ్యక్షురాలు.
- అసదుద్దీన్ ఒవైసీ, రాజకీయుడు, భారత పార్లమెంటు సభ్యుడు.
- ఆనంద శంకర్ జయంత్, భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- మామిడాల రాములు, మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం.
- సంజీవ్ సిద్ధు, సాఫ్ట్వేర్ రంగ నిపుణుడు. o9 సొల్యూషన్స్, i2 టెక్నాలజీ సంస్థల వ్యవస్థాపకుడు.
- త్యాగరాజు, చలనచిత్ర నటుడు.
అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు[మార్చు]
- ఉస్మానియా విశ్వవిద్యాలయము ఇంజనీరింగ్ కళాశాల. (స్థా. 1929)
- ఉస్మానియా విశ్వవిద్యాలయ సాంకేతిక కళాశాల
అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలలు[మార్చు]
- సర్దార్ పటేల్ కళాశాల, సికిందరాబాదు
- ఆంధ్ర విద్యాలయ కళాశాల, లిబర్టీ, హైదరాబాదు
- ప్రగతి కళాశాల, కోఠి, హైదరాబాదు
బయటి లింకులు[మార్చు]
- ఉస్మానియా విశ్వవిద్యాలయము
- ఉస్మానియా విశ్వవిద్యాలయము బిజినెస్ మానేజ్మెంట్ శాఖ
- ఎన్.ఎ.ఏ.సి
- ఉస్మానియా విశ్వవిద్యాలయము పూర్వవిద్యార్ధుల సంఘం
- ఆంధ్రజ్యోతి వెబ్ [permanent dead link]
మూలాలు[మార్చు]
- ↑ https://censusindia.gov.in/2011census/dchb/2805_PART_A_DCHB_HYDERABAD.pdf
- ↑ ఆదాబ్ హైదరాబాద్, మల్లాది కృష్ణానంద్ రచన, ద్వితీయ ముద్రణ అక్టోబరు 2008, పేజీ సంఖ్య 70
- ↑ 24తెలుగు, ఎడ్యూకేషన్. "ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర". www.24telugu.com. రవీంద్రనాథ్ ఠాగూర్. Retrieved 21 April 2018.[permanent dead link]
- ↑ ఈనాడు, ప్రధాన వార్తలు (18 June 2019). "ఇక ఏటా స్నాతకోత్సవం". Archived from the original on 18 June 2019. Retrieved 18 June 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 June 2019). "ఓయూలో 80వ స్నాతకోత్సవం వేడుకలు.. హాజరైన గవర్నర్". Archived from the original on 18 June 2019. Retrieved 18 June 2019.
- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (17 June 2019). "80 స్నాతకోత్సవాలు..47 గౌరవ డాక్టరేట్లు". Archived from the original on 18 June 2019. Retrieved 18 June 2019.
వెలుపలి లంకెలు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జూన్ 2020
- Articles with permanently dead external links
- Pages using infobox university with unknown parameters
- Articles with dead external links from ఫిబ్రవరి 2020
- తెలంగాణ విశ్వవిద్యాలయాలు
- విశ్వవిద్యాలయాలు
- 1918 స్థాపితాలు
- హైదరాబాదు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం
- జనగణన పట్టణాలు