బిర్లా మందిరం, హైదరాబాదు
| బిర్లా మందిర్, హైదరాబాద్ | |
|---|---|
బిర్లా మందిర్, హైదరాబాద్ | |
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 17°24′22″N 78°28′09″E / 17.4061875°N 78.4690625°E |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | హైదరాబాద్ జిల్లా |
| ప్రదేశం | నౌబత్ పహాడ్, హైదరాబాద్ |
| సంస్కృతి | |
| దైవం | వేంకటేశ్వరుడు |
| వాస్తుశైలి | |
| నిర్మాణ శైలులు | హిందూ దేవాలయ నిర్మాణ శైలి |
| చరిత్ర, నిర్వహణ | |
| నిర్మించిన తేదీ | 1976 |

బిర్లా మందిర్ ఒక హిందూ దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న “నౌబత్ పహాడ్” (ప్రాచీన కాలంలో “మొహబత్ పహాడ్”గా పిలువబడిన) అనే 280 అడుగులు (85 మీ) ఎత్తైన కొండపై నిర్మించబడింది. దేవాలయం 13 ఎకరాలు (53,000 మీ2) విస్తీర్ణంలో ఉంది. నిర్మాణానికి పది సంవత్సరాలు పట్టగా, 1976లో రామకృష్ణ మిషన్కు చెందిన స్వామి రంగనాథానంద చేత ప్రారంభించబడింది. ఈ దేవాలయాన్ని బిర్లా ఫౌండేషన్ నిర్మించింది. భారతదేశంలోని అనేక నగరాలలో ఇదే పేరుతో నిర్మించబడిన దేవాలయాలు కూడా “బిర్లా మందిర్”లుగా ప్రసిద్ధి చెందాయి.
ఈ ఆలయం హైదరాబాదులో రవీంద్రభారతి సమీపాన లకిడీ-కా-పూల్ బస్టాండ్ నుండి దగ్గరగా కల చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాదు దర్శనీయ ప్రదేశాలలో ఒకటి.[1]
నిర్మాణ శైలి
[మార్చు]
ఈ దేవాలయం ద్రావిడ, రాజస్థానీ, ఉత్కల నిర్మాణ శైలుల సమ్మేళనంగా రూపొందించబడింది. దేవాలయం సుమారు 2000 టన్నుల స్వచ్ఛమైన తెల్లటి మరబుల్ రాయితో నిర్మించబడింది. ప్రధాన దేవత అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం సుమారు 11 అడుగులు (3.4 మీ) ఎత్తు కలిగిన గ్రానైట్ రాతితో చెక్కబడింది. విగ్రహం పైభాగంలో చెక్కిన కమల ఆకృతి గొడుగువలె అలంకరించబడింది. దేవాలయ ప్రాంగణంలో 42 అడుగుల (13 మీటర్లు) ఎత్తైన పిత్తల ధ్వజస్తంభం నిలిచివుంది. ఈ దేవాలయంలో సాంప్రదాయ గంటలు ఏర్పాటు చేయలేదు. దేవాలయ వాతావరణం ధ్యానానికి అనుకూలంగా ఉండాలనే స్వామి రంగనాథానంద సంకల్పం ప్రకారం ఈ విధంగా నిర్మించబడింది.
ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడింది. ఈ ఆలయ నిర్మాణం 1966లో మొదలై, 1976 కల్లా పూర్తైంది. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ సరస్సు దక్షిణపు వైపు బిర్లా మందిర్ ఉంది. ఇది నౌబత్ పహద్ జంట కొండ కళా పహద్ పైన ఉన్నది. 1976లో బిర్లా కుటుంబం హైదరాబాదులో ఈ ఆలయాన్ని నిర్మించడానికి రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న తెల్లటి పాలరాయిని వినియోగించారు. ఈ కొండ 280 అడుగుల ఎత్తు ఉంది. దాని మీద అలయం 13 అడుగుల ఎత్తులో నిర్మించబడింది.
దేవాలయం గురించి
[మార్చు]ప్రధాన గర్భగృహంతో పాటు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి భార్యలు పద్మావతి, ఆండాళ్కు వేర్వేరు సన్నిధులు ఏర్పాటు చేయబడ్డాయి. దేవాలయంలో వివిధ దేవతలు, దేవిలకు ప్రత్యేక మండపాలు ఉన్నాయి. వీటిలో శివుడు, శక్తి, గణేశుడు, హనుమంతుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మిలకు చెందిన సన్నిధులు ఉన్నాయి.
దేవాలయ గోడలపై ప్రముఖుల బోధనలు, గురుబాణిలోని ఎన్నుకున్న శ్లోకాలు చెక్కబడ్డాయి.
మహాత్మా గాంధీ, ఇతర హిందూ నాయకుల ఆలోచనల ప్రకారం, బిర్లా దేవాలయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించబడ్డాయి; అందువల్ల ఇవి అందరికీ ప్రవేశయోగ్యంగా ఉంటాయి.
రామకృష్ణ మిషన్కు చెందిన స్వామి రంగనాథనంద చేత ఈ నిర్మాణం పూర్తయ్యేందుకు దాదాపు ఒక దశాబ్దం పట్టింది. బిర్లా ఫౌండేషన్ భారతదేశంలోని దేవాలయాలను నిర్మించటంలో ప్రసిద్ధి చెందింది. ఈ బిర్లా మందిర్ నిర్వహణ బిర్లా ఫౌండేషన్ చూసుకుంటోంది.
శ్రీ వెంకటేశ్వరస్వామి రూపంలో విష్ణువు దేవాలయంలో కొలువయ్యాడు. త్యాగరాజ, అన్నమయ్య, రామాదాసుల కీర్తనలు ఉదయం ఒక నీలి ఆకాశం నేపథ్యంలో ప్రతిధ్వనిస్తుంది. ఈ దేవాలయం ఉత్కల్ (ఒరియా), దక్షిణ భారతీయ శైలి శిల్ప శైలిని కలిగి ఉంటుంది. రాజగోపురం సౌత్ ఇండియన్ వాస్తుశిల్ప శైలిని సూచిస్తుంది, జగదనంద వైమానం అని పిలువబడే ప్రధాన మందిరం మీద టవర్ ఒరియా శైలిని సూచిస్తుంది. ఈ ఆలయంలో రామాయణం, మహాభారతం వంటి గొప్ప పురాణాలను చిత్రీకరించిన సరసంగా చెక్కిన పాలరాయి చిత్రాలు ఉన్నాయి. 42 అడుగుల ఎత్తైన గర్భగునం (గర్భ గుడి)లో వెంకటేశ్వరస్వామి, తిరుమల లోని దేవుడువలే ఆకట్టుకునే ప్రతిరూపం.
ఈ దేవత 11 అడుగుల పొడవైన గ్రానైట్తో చేయబడింది. వెంకటేశ్వరస్వామితోపాటు పద్మావతి, ఆండాల్ అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేకమైన దేవాలయాలలో పూజిస్తారు. బిర్లా మందిర్ ఆవరణలో బుద్ధుడి కూడా ఆలయం ఉంది. అలాగే బ్రహ్మ, శివుడు, వినాయకుడు, దుర్గామాత, సరస్వతిదేవి, లక్ష్మిదేవి, హనుమంతుడు, సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు వైకుంఠధామంలో మందిరానికి ఇరువైపులా ద్వారపాలకులు జయ విజయులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సాయంకాలం వేళల్లో బిర్లా మందిర్ ప్రశాంతంగాను, ఆహ్లాదకరంగానూ ఉంటుంది. పర్యాటకులకు బిర్లా మందిర్ చూడకుండా హైదరాబాదు పర్యటన పూర్తికాదు. మంత్రముగ్ధమైన బిర్లా మందిర్ యాత్ర అద్భుతమైన నిర్మాణం, పనితనానికి గుర్తుగా, మిళితమై పర్యటన. ఆధ్యాత్మిక కేంద్రం. ఆలయం పనివేళలు రోజూ ఉదయం 7.00 నుండి 12.00 గంటలు, సాయత్రం 2.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ఉంటుంది. బిర్లా మందిర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బస్సుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న రవీంద్ర భారతి దగ్గర బస్ రైడ్ తీసుకున్న వారు ఇక్కడికి రావచ్చు.
ఆలయ ప్రత్యేకతలు
[మార్చు]- ఈ మందిరం హైదరాబాదు నడి మధ్య ఉంది.
- కొండ పై భాగంలో వెహికల్ పార్కింగ్ ఉండుటచే సులభముగా చేరుకొనవచ్చును.
- దేవాలయానికి ప్రక్కన బిర్లా సైన్స్ మ్యూజియం, ప్లానెటేరియం ఉన్నాయి.
- పార్కింగ్ వద్ద నుండి దేవాలయం మొత్తం మెట్లతో సహా పాలరాతితో నిర్మించబడింది.
- మందిర పై భాగం నుండి చూస్తే దగ్గరగా హుస్సేన్ సాగర్, బుద్దవిగ్రహం, అసెంబ్లీ, రవీంద్రభారతి, లాల్ బహుదూర్ స్టేడియం, లుంబిని పార్క్ నూతన సచివాలయం,Dr BRఅంబేద్కర్ ,అమరవీరుల స్మారక చిహ్నంలాంటివి అందంగా కనిపిస్తుంటాయి.
పార్కింగ్
[మార్చు]దేవాలయానికి ఉన్న అపార ప్రజాదరణ కారణంగా, ఇక్కడి వాహన పార్కింగ్ సౌకర్యాలు తరచుగా పూర్తిగా నిండిపోతాయి. దీంతో దేవాలయం సమీపంలో పార్కింగ్ కొరత ఏర్పడుతుంది.[2] పార్కింగ్ సమస్యలను నివారించడానికి, స్థానిక పర్యాటక మార్గదర్శకులు నౌబత్ పహాడ్ అడుగుభాగంలో (అసెంబ్లీ సమీపంలో) వాహనాలను నిలిపి, అక్కడి నుంచి సుమారు రెండు నిమిషాల నడకదూరంలో ఉన్న బిర్లా మందిరానికి కాలినడకన వెళ్లాలని సూచిస్తున్నారు.[3]
చిత్రావళి
[మార్చు]-
దేవాలయ ప్రధాన భవనం
-
బిర్లా మందిరంలోని విగ్రహం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Ts News: కొత్త సంవత్సర వేళ.. బిర్లా మందిర్కు పోటెత్తిన భక్తులు". web.archive.org. 2022-05-03. Archived from the original on 2022-05-03. Retrieved 2022-05-03.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ The Hans India, The Hans India (18 April 2019). "Scant parking space irks residents, visitors". The Hans India. Retrieved 2 November 2020.
- ↑ Nanisetti, Serish (13 December 2017). "Living Hyderabad: drum house on the hillock". The Hindu. Retrieved 2 November 2020.
వెలుపలి లంకెలు
[మార్చు]రాష్ట్రప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://hyderabad.telangana.gov.in/tourist-places/