Jump to content

శకుంతల (1932 సినిమా)

వికీపీడియా నుండి
శకుంతల
(1932 తెలుగు సినిమా)
దర్శకత్వం బాదామి సర్వోత్తం
నిర్మాణం అంబాలా ఎమ్.పటేల్
తారాగణం సురభి కమలాబాయి (శకుంతల),
యడవల్లి సూర్యనారాయణ (దుష్యంతుడు)
బాకురపండ వెంకటరావు
నెల్లూరు నాగరాజారావు
నిర్మాణ సంస్థ సాగర్ స్టూడియోస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శకుంతల, 1932లో విడుదలైన ఒక తెలుగు సినిమా. సాగర్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో సురభి కమలాబాయి, యడవల్లి సూర్యనారాయణ ప్రథాన పాత్రలు పోషించారు. బాదామి సర్వోత్తం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ప్రసిద్ధమైన కాళిదాసు రచన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. శ్రీరామ పట్టాభిషేకం సినిమా నిర్మించిన సంస్థయే ఈ సినిమాను కూడా నిర్మించింది. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అకట్టుకోలేదు.

సినిమా ప్రకటనలో ఇలా వ్రాశారు - "ఆంధ్ర దేశమునకు మరియొక అత్యద్భుతమగు తెలుగు టాకీ. ఇది పాదుకాపట్టాభిషేకమున కంటె చాల పెద్దదిగాను, బాగుగాను యున్నది"

తెలుగు సినిమాల్లో సర్వసాధారణమైన హాస్యపాత్రలు శకుంతల చిత్రంతో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రంలో శకుంతల చేతి ఉంగరాన్ని మింగిన చేపను పట్టుకున్న జాలర్లతో హాస్యం పలికించారు.[1]

తారాగణం

[మార్చు]
  • సురభి కమలాబాయి
  • యడవల్లి సూర్యనారాయణ
  • నెల్లూరు నాగరాజారావు
  • బాకురపండ వెంకటరావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: బాదామి సర్వొత్తం
  • నిర్మాత: అంబాలా ఎం.పటేల్
  • నిర్మాణ సంస్థ: సాగర్ స్టూడియోస్
  • విడుదల:1932.

మూలాలు, వనరులు

[మార్చు]
  1. "నవ్వుల నవాబులు... మన తారలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-03.
  • సూర్య దినపత్రిక - 2007 డిసెంబరు 28లో "సూర్య చిత్ర" అనుబంధం వ్యాసం - వినాయకరావు రచన