శ్రీమంతులు (1968 సినిమా)
శ్రీమంతులు | |
---|---|
దర్శకత్వం | టి.ఆర్.రామన్న |
రచన | టి.కె.కృష్ణమూర్తి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రహ్మాన్ |
కూర్పు | ఎం.ఎస్.మణి పి.ఎల్.మణి |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి, టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | కల్పనాలయ |
విడుదల తేదీ | 1968 నవంబరు 22 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్రీమంతులు కల్పనాలయ బ్యానర్పై టి.ఆర్.రామన్న దర్శకత్వంలో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1968, నవంబర్ 22న విడుదలయ్యింది.[1] 1964లో వచ్చిన పనక్కర కుడుంబం అనే తమిళ సినిమాను శ్రీమంతులు పేరుతో తెలుగులోనికి డబ్ చేశారు. ఇదే సినిమా 1984లో ఇంటిగుట్టు పేరుతో పునర్మించారు.
నటీనటులు[మార్చు]
- ఎం.జి.రామచంద్రన్ - రాము
- బి.సరోజాదేవి -రాణి
- ఎస్.ఎ.అశోకన్ - భూషయ్య
- మనోహర్ - రంగడు
- జి.శకుంతల - వెంకమ్మ
- నగేష్ (త్రిపాత్రాభినయం)
- మణిమాల
- మాధవి
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: టి.ఆర్.రామన్న
- కథ: శక్తి టి.కె.కృష్ణమూర్తి
- మాటలు: అనిసెట్టి
- సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి, టి.చలపతిరావు
- కూర్పు: ఎం.ఎస్.మణి, పి.ఎల్.మణి
- ఛాయాగ్రహణం: ఎం.ఎ.రహ్మాన్
సంక్షిప్త కథ[మార్చు]
భూషయ్య తను ప్రేమించిన భార్యను వదిలి ధనాశపరుడై మరో భార్య వెంకమ్మను కట్టుకున్నాడు. ఆమె, ఆమె తమ్ముడు రంగడు అతడిని నానా యాతన పెట్టారు. మొదటి భార్య కూతురు రాణి తన ఆఫీసులోనే పనిచేస్తున్నా తనను నాన్నా అని పిలవద్దంటాడు. రాణి ప్రేమించిన రామును పిలిచి రాణిని పెళ్ళి చేసుకోవద్దంటాడు. రాము రాణిని తిరస్కరించగా అపార్థం చేసుకుని రాణి అతడిని నిందిస్తే రాము కుమిలిపోతాడు. రాము చెల్లెలు రాము మిత్రుడిని పెళ్ళి చేసుకుంటుంది. చివరకు రాణి చనిపోయిందనుకున్న తన తల్లిని కలుసుకుంటుంది. రంగడితో జరగనున్న రాణి పెళ్ళి ఎలా భగ్నమౌతుంది, రాము, రాణి తిరిగి ఎలా కలిసిపోతారు, భూషయ్య రెండవభార్యకు, రంగడికీ ఎలా శాస్తి జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తాయి.[2]
మూలాలు[మార్చు]
- ↑ వెబ్ మాస్టర్. "Srimanthulu (T.R. Ramanna) 1968". ఇండియన్ సినిమా. Retrieved 9 December 2022.
- ↑ సమీక్షకుడు - చిత్రజ్యోతి (24 November 1968). "చిత్రసమీక్ష:శ్రీమంతులు" (PDF). ఆంధ్రజ్యోతి. Archived from the original (PDF) on 9 డిసెంబర్ 2022. Retrieved 9 December 2022.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help)