సికింద్రాబాద్ రైల్వే ప్రింటింగ్ ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సికింద్రాబాద్ రైల్వే ప్రింటింగ్ ప్రెస్
Typeకేంద్ర రైల్వే శాఖ
పరిశ్రమప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ముద్రణ
స్థాపన1879
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం,
Areas served
ప్రాంతాల సేవలు

సికింద్రాబాద్ రైల్వే ప్రింటింగ్ ప్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో ఉన్న రైల్వే ప్రింటింగ్ ప్రెస్. 144 ఏళ్ళ క్రితం నిజాం పాలనలో ఏర్పాటైన ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఫామ్స్ డిపార్టమెంట్ గా ఈ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించబడింది. రైల్వే రిజర్వుడు, అన్ రిజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ఈ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించబడేవి. 2023 మే నెలలో ఈ ప్రెస్ మూతబడిపోయింది.[1]

చరిత్ర[మార్చు]

1870లో ఆవిర్భవించబడిన నిజాం స్టేట్ రైల్వేకు సంబంధించిన రైలు టికెట్ల ముద్రణకోసం 1879లో సికింద్రాబాదులో ఈ ప్రెస్ ఏర్పాటుచేయబడింది.[2] ఈ ప్రెస్ ప్రారంభంలో 1,500మంది ఉద్యోగులుండేవారు.

మూసివేత[మార్చు]

రైల్వేశాఖ టికెట్ల జారీలో డిజిటలైజేషన్ తీసుకురావడంతో ఆన్లైన్ టికెట్ల విక్రయం 80 శాతానికి చేరగా, ఉద్యోగుల సంఖ్య 169కి తగ్గింది. ఆన్లైన్ లో టిక్కెట్ల విక్రయం జరుగుతున్న కారణంగా రైల్వే బోర్డు భావించి ప్రెస్ ను మూసేసింది.[3] రైలు టికెట్ల విధానం పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యేంతవరకు రిజర్వుడు, అన్ రిజర్వుడు టికెట్ల ముద్రణను ఔట్సోర్సింగ్ కు ఇవ్వబడింది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవ్ చేసి ఇతర విభాగాల్లో నియమించారు.[4]

మూలాలు[మార్చు]

  1. "144ఏళ్ల చరిత్రకు రెడ్‌ సిగ్నల్‌". EENADU. 2023-05-06. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-15.
  2. "Railways to shut down Nizam-era SCR press in Secunderabad". The Times of India. 2019-07-08. ISSN 0971-8257. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
  3. Kumar, S. Vijay (2023-05-10). "Indian railways to go ahead with closure of five printing presses". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2023-05-11. Retrieved 2023-05-15.
  4. M, Praveen. "సికింద్రాబాద్‌ ప్రింటింగ్ ప్రెస్ మూసివేత". Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.