హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం
రకం | ప్రభుత్వరంగ సంస్థ |
---|---|
పరిశ్రమ | నౌకానిర్మాణం |
స్థాపించబడింది | జూన్ 22, 1941 |
ప్రధాన కార్యాలయం | , |
ప్రధాన వ్యక్తులు | రియర్ అడ్మిరల్ ఎన్.కె మిశ్రా, ఛైర్మన్ & ఎం.డీ |
సేవలు | నౌకానిర్మాణం నౌకల మరమ్మత్తులు |
జాలస్థలి | www |
హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం (Hindustan Shipyard Limited) భారతదేశపు తూర్పుతీరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో ఉంది. ఇది ఆధునిక భారతదేశపు మొట్టమొదటి నౌకానిర్మాణకేంద్రం
చరిత్ర[మార్చు]
1941 జూన్ 22న డా. రాజేంద్ర ప్రసాద్ దీనికి శంకుస్థాపన చేశాడు. సింధియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ లిమిటెడ్ లో భాగంగా వాల్చంద్ హీరాచంద్ అనే పారిశ్రామికవేత్త దీనిని స్థాపించాడు. అప్పట్లో దీనిని సింధియా షిప్యార్డ్ గా పిలిచేవారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట నిర్మించిన మెట్టమొదటి నౌక "జల ఉష"ని, 1948లో అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహరూ జలప్రవేశం చేయించారు. 1961వ సంవత్సరంలో జాతీయం చేయబడినపుడు, దీని పేరు హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ అయింది. 2009 సంవత్సరంలో జలరవాణా మంత్రిత్వ శాఖ పరిధి నుండి రక్షణశాఖ పరిధిలోకి మార్చబడింది. అరిహంత్ తరహా అణుజలాంతర్గాముల అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నది.
వసతులు[మార్చు]
సుమారు 46.2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నౌకా నిర్మాణ కేంద్రంలో ప్లాస్మా కోతయంత్రాలు, ఉక్కు సంవిధాన, వెల్డింగ్ యంత్రాలు, పదార్థ నిర్వహణ పరికరాలు, నిల్వ వసతులు కూడా ఉన్నాయి. పరీక్షా వసతులు, కొలతల వసతులు కూడా ఉన్నాయి. 80,000 సామర్థ్యం గల ఓడలు నిర్మించగల కవర్డ్ బిల్డింగ్ డాక్ కూడా ఉంది. సామర్థ్యరీత్యా భారతదేశంలో కొచ్చిన్ నౌకానిర్మాణకేంద్రం తర్వాత పెద్దది ఇదే.
నౌకలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Hindustan Shipyard. |