కందుకూరి అంబికా వరప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబికా వరప్రసాదరావు
జననం1884
ఏలూరు
మరణంసెప్టెంబరు 20, 1964
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు , న్యాయవాది

కందుకూరి అంబికా వరప్రసాదరావు రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు, న్యాయవాది.[1]

జననం[మార్చు]

అంబికా వరప్రసాదరావు 1884లో ఏలూరులో జన్మించాడు

రంగస్థల ప్రస్థానం[మార్చు]

ధార్వాడ కంపెనీ నాటక ప్రదర్శనలు చూసిన వరప్రసాదరావు ధాత్రీ సభ అనే పేరుతో ఒక నాటక సంస్థను ప్రారంభించి హిందీ, తెలుగు నాటకాలు ప్రదర్శించాడు. కొంతకాలం తరువాత ముంజులూరి కృష్ణారావుతో కలిసి ది గ్రేట్ఇండియన్ థియేటర్ అనే నాటకసమాజం స్థాపించి, ఆ సంస్థలో తాను కూడా పాత్రలు ధరించాడు. నాటక సమాజాన్ని కట్టుదిట్టంగా నడిపాడు. వేదం వేంకటరాయ శాస్త్రి రచించిన ప్రతాపరుద్రీయం నాటక ప్రదర్శనకు వీరి సమాజానికి మంచి పేరు తెచ్చింది. ప్రతాపరుద్రీయంలో పేరిగాని పాత్రలో నటించి, అచ్చంగా తెలంగాణా రజకుడనిపించేలా తన ప్రతిభను ప్రదర్శించాడు.

నటించిన పాత్రలు[మార్చు]

  • పేరిగాడు
  • వాసుదేవమూర్తి
  • అక్బరు
  • సలీం
  • రామప్పంతులు
  • కరండకుడు
  • పిచ్చిరామ శాస్త్రి
  • రాజా కళింగ గంగు

సన్మానాలు[మార్చు]

మరణం[మార్చు]

60 సంవత్సరాలకు పైగా నాటకరంగానికి సేవలందించిన వరప్రసాదరావు 1964, సెప్టెంబరు 20న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.182.