ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 12: | పంక్తి 12: | ||
ఇక్కడ నీరు నది ద్వార వచ్చి ఇక్కడ పడడం లేదు. ప్రకాశం జిల్లాలో నుండి అంతర్వాహినిగా నీరు ప్రవహించి ఇక్కడ బయల్పడి జలపాతం ఏర్పడింది. ఇదొ వింత. |
ఇక్కడ నీరు నది ద్వార వచ్చి ఇక్కడ పడడం లేదు. ప్రకాశం జిల్లాలో నుండి అంతర్వాహినిగా నీరు ప్రవహించి ఇక్కడ బయల్పడి జలపాతం ఏర్పడింది. ఇదొ వింత. |
||
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి '''పున్నమి''' అతిథి గృహం ఇక్కడ ఉంది. |
|||
13:10, 23 డిసెంబరు 2015 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉన్నది.[1] 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యములో తాళ్ళపల్లె వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయువ్యాన కృష్ణా నదిలో కలుస్తున్నది.[2] ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది.[3]
యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల)గా ప్రసిద్ధిగాంచింది.
ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది.
ఆలయాలు
ఈ లోయలో వెలిసిన దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి ఏటా తొలి ఏకాదశినాడు జరిగే తిరునాళ్ళకు సమీప జిల్లాల్లోని సుగాలీలు అసంఖ్యాకంగా హాజరవుతారు. మధుమతీదేవి, రంగనాధస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడున్నాయి. ఈ దేవాలయాలు ఎత్తిపోతల జలపాతానికి దిగువభాగంలో ఉన్న అతిపురాతన దేవాలయాలు. వీటిని గురించి బయటి ప్రపంచానికి తెలిసినది అంతంతమాత్రమే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉన్నది. దేవాలయం మొత్తం, కొండను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటుచేసినారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే తలదించుకొని వెళ్ళావలసినదే. లేదంటే తలకు పైభాగం రాతి ప్రాంతానికి తగిలి తల బొప్పి కట్టవలసినదే. ప్రతి తొలి ఏకాదశి, దత్త జయంతి మొదలగు పర్వదినాలలో, రాష్ట్రంలోని నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలివచ్చెదరు. మాచర్ల మండలంలో ఉన్న ఈ దేవాలయాలకు సరిహద్దులో ఉన్న నల్లగొండ, గుంటూరు, ప్రకాశం, మహబూబునగర్, కర్నూలు జిల్లాల నుండి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. అయినా ఇక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నవి. [3]
ఇక్కడ నీరు నది ద్వార వచ్చి ఇక్కడ పడడం లేదు. ప్రకాశం జిల్లాలో నుండి అంతర్వాహినిగా నీరు ప్రవహించి ఇక్కడ బయల్పడి జలపాతం ఏర్పడింది. ఇదొ వింత.
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.
-
దత్తాత్రేయ దేవాలయం
-
మధుమతీదేవి గుడి
-
రంగనాధస్వామి దేవాలయం
మూలాలు
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014, ఆగష్టు-7; 4వపేజీ.