నల్లమల అడవులు

వికీపీడియా నుండి
(నల్లమల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నల్లమల కొండలు
నల్లమల
విస్తృతి
బొగడ దగ్గరలోని నల్లమల . దొరబావి ఆకృతుల అవశేషాలను కూడా చూడవచ్చు.
దేశం భారతదేశం
Provinces/States ఆంధ్ర ప్రదేశ్
Highest point భైరానీ కొండ (శిఖరేశ్వరం)
 - ఎత్తు 3,047 ft (929 m)
 - ఆక్షాంశరేఖాంశాలు 15°40′41″N 78°47′10″E / 15.67806°N 78.78611°E / 15.67806; 78.78611
పొడవు 90 mi (144.84 km), ఉత్తర-దక్షిణ
Period ప్రోటోజోయిక్
కడపవైఎస్ఆర్ జిల్లా జిల్లాలో నల్లమల అడవులు

నల్లమల (ఆంగ్లం : The Nallamala) (సాహిత్యపరంగా."నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల శ్రేణి).గుంటూరు జిల్లాలోని గుతికొండలో నల్లమల అడవులు పుట్టాయి. ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఐదుజిల్లాలలో (కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లా) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణా నది, పెన్నా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి నల్లమల అడవులు అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి నల్లమల కొండలు అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు, గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.[1]. ఈ రెండు శిఖరాలూ కంభం పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.[2]. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.

భూగర్భ శాస్త్రము[మార్చు]

నల్లమల శ్రేణులలోని రాళ్ళు కడప జిల్లాలో దాదాపు 20,000 2222 2 ss2z6z6xcx6zc ani chepe adugulo అడుగుల మందాన్ని కలిగివున్నవి.[3]. ఈ రాళ్ళలో ప్రాథమికమైనది క్వార్‌జైట్, ఇవి ఒడుగుదిడుగుల పలకల రూపంలో ఉంది. సాండ్ స్టోన్ కూడా లభ్యమవుతున్నది. ఈ రాళ్ళ సవ్యదిశా లేమి కారణంగా వాణిజ్యానికి అంతగా అనువుగా లేదు. ఈ రాళ్ళు ప్రపంచంలోనే ప్రాచీనత కలిగివున్నవి. ఈ రాళ్ళు అగ్నిశిలల వల్ల ఏర్పడినవి.[2]

వాతావరణం[మార్చు]

ఈ నల్లమల అడవులలో సంవత్సరం పొడుగునా, వెచ్చని, వేడిమి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. సరాసరి వర్షపాతం 90 సె.మీ. నైఋతీ-ఋతుపవనాలపై ఆధారపడిన అడవులు. శీతాకాలంలో చల్లగానూ పొడిగాను, సరాసరి ఉష్ణోగ్రత 25 సె.గ్రే.ను కలిగి ఉన్నాయి. ఈ అడవుల వర్షపునీరు గుండ్లకమ్మ నదిలో కలుస్తాయి.

భౌగోళికం, నేల ఉపయోగం[మార్చు]

ఈ కొండలు దాదాపు అడవులతో నిండివున్నాయి. ఈ అడవులలో వృక్షసంపదను పెంచలేకపోవడానికి కారణ నీటి కొరత. వ్యవసాయం దాదాపు కనుమరుగు. కొన్ని పల్లెటూర్లవద్ద వ్యవసాయం కానవస్తుంది. ఈ అటవీ ప్రాంతం శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉంది.[4].

మానవ జీవనం[మార్చు]

నీటికొరత కారణంగా జనజీవనం అత్యల్పం. ఈ ప్రాంతంలో నగరాలు పట్టణాలు వెలవక పోవడానికి కారణం ఇదే. ఈ ప్రాంతంలో నంద్యాలపట్టణం పెద్దది.

ఈ ప్రాంతంలో అటవిక తెగలు : చెంచులు నివసిస్తున్నారు.

రవాణా[మార్చు]

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రాష్ట్ర ప్రధాన రైలు మార్గం గుంటూరు -గుంతకల్లు నల్లమల అడవులలో గుండా పోతున్నది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి కూడా ఈ అడవుల పశ్చిమ భాగం నుంచి వెళుతుంది.

రాజీవ్ అభయారణ్యం[మార్చు]

శ్రీశైలం టైగర్ రిజర్వ్ సూచన

నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 9500 చదరపు అడగులలో సుమారు మూడవ వంతు అనగా 3000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దటమైన అటవీ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తయిన చెట్లు ఉన్నాయి. కౄరమృగాలు ముఖ్యంగా పులులకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. ఈ కీకారణ్య ప్రాంతమును ప్రభుత్వం రాజీవ్ అభయారణ్యంగా ప్రకటించింది. దేశంలోని 19 పులుల అభయారణ్యాలలో ఇది ఒకటి. ఇక్కడ 80కి పైగా పులులు సంచరిస్తుంటాయి.[5]

ప్రధాన సంఘటనలు[మార్చు]

  • గతంలో కొందరు శివస్వాములు శ్రీశైలం వస్తూ ఈ అడవుల్లో దారి తప్పిపోతే హెలికాప్టర్ ద్వారా గాలించారు.
  • 2004 లో నక్సలైట్లు ( మావోయిస్టులు ) ను చర్చలకు ప్రభుత్వం పిలిస్తే ఈ అడవుల్లోనుంచే వచ్చారని చెబుతారు.
  • సెప్టెంబర్ 2, 2009న ఉదయం గం.9.35 ని.లకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అటవీ ప్రాంతంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో కూలిపోవడంతో రాజశేఖరరెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.[6] హెలికాప్టర్ కూలిపోయిన దాదాపు 25 గంటల వరకు ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెప్టెంబరు 3న ఈ ప్రాంతంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయినట్లు గుర్తించి మృతదేహాలను తరలించారు. దీనితో ముఖ్యమంత్రి మృతిచెందిన పావురాలగుట్ట (చింతగుండం) ప్రాంతం వార్తల్లోకి వచ్చింది.
  • నల్లమలలో యురేనియం అన్వేషణకు, వెలికితీత కు ప్రయత్నాలు జరిగాయి.

చూడదగ్గ ప్రదేశాలు[మార్చు]

నల్లమల అడవులు మల్లెలతీర్థం సమీపంలో
  • శ్రీశైలం : కృష్ణా నది ఒడ్డున గల శ్రీశైలం ప్రాజెక్టు.
  • శ్రీశైల క్షేత్రం
  • గుండ్ల బ్రహ్మేశ్వర శిఖరం. జలపాతం. నెమలిగుండం.ఓంకారమ్,మహానంది. రుద్రకోడూరు. పావురాలగుట్ట (చింతగుండం)
  • ఆత్మకూరు నుండి నంద్యాలకు వెళ్ళే మార్గములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివంగత నేత డా:వైయస్ రాజశేకరరెడ్డి గారి జ్ఞాపకార్ధం నల్లకలువ గ్రామానికి సమీపంలో వైయస్ఆర్ స్మృతివనాన్ని నిర్మించినది ఈ ప్రదేశము ఎంతో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్రదేశము

చిత్ర మాలిక[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

పాద పీఠికలు[మార్చు]

  1. Google Earth
  2. 2.0 2.1 http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_352.gif
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-07. Retrieved 2009-01-09.
  4. Kenneth Anderson: The Call of the Wild; The Black Panther of Sivanipalli
  5. సాక్షి దినపత్రిక, తేది. 03-09-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 04-09-2009

వెలుపలి లంకెలు[మార్చు]