జంబలకిడిపంబ: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 16: | పంక్తి 16: | ||
==కథ== |
==కథ== |
||
రామలక్ష్మి కోట శ్రీనివాసరావు కూతురు. విశాఖపట్నం లో వాళ్ళు నివసించే కాలనీలో మగవాళ్ళు అందరూ తీరిగ్గా కూచుని పేకాట ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వారి భార్యలు ఇంటి పనిలో సతమతమవుతూ ఉంటారు. వారి బాధల్ని చూసి రామలక్ష్మి మనసు బాధ పడుతూ ఉంటుంది. ఆమె అలా బాధ పడినప్పుడల్లా ఎక్కడో నుంచో ఆమెకు ఒక లేఖ అందుతూ ఉంటుంది. మొదట్లో ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు. కానీ అది ఆమె మహిళల సమస్యల గురించి బాధ పడినప్పుడల్లా కనిపించే సరికి ఒకసారి ఆ లేఖను చదువుతుంది. |
రామలక్ష్మి కోట శ్రీనివాసరావు కూతురు. విశాఖపట్నం లో వాళ్ళు నివసించే కాలనీలో మగవాళ్ళు అందరూ తీరిగ్గా కూచుని పేకాట ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వారి భార్యలు ఇంటి పనిలో సతమతమవుతూ ఉంటారు. వారి బాధల్ని చూసి రామలక్ష్మి మనసు బాధ పడుతూ ఉంటుంది. ఆమె అలా బాధ పడినప్పుడల్లా ఎక్కడో నుంచో ఆమెకు ఒక లేఖ అందుతూ ఉంటుంది. మొదట్లో ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు. కానీ అది ఆమె మహిళల సమస్యల గురించి బాధ పడినప్పుడల్లా కనిపించే సరికి ఒకసారి ఆ లేఖను చదువుతుంది. |
||
ఆ లేఖలో ఆమెను విశాఖ పట్నానికి కొంచెం దూరంలో ఉన్న బొర్రా గుహల దగ్గరికి ఒంటరిగా రమ్మని రాసి ఉంటుంది. రామలక్ష్మి అక్కడికి వెళ్ళి అంబ అనే యోగినిని కలుసుకుంటుంది. ఆమె పురుషాధిక్య సమాజం వలన తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి జీవితం మీద విరక్తితో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. సమాజం మీద కక్ష తీర్చుకోవడానికి ఆమె జంబలకిడి పంబ అనే మందు తయారు చేసి ఉంటుంది. ఆమె శిష్యుడు చిదంబరానంద స్వామిని పిలిచి ఆ మందును రామలక్ష్మికిచ్చి ఆ మందును తీసుకెళ్ళి తాగే నీళ్ళలో కలపమంటుంది. |
|||
మరుసటి రోజు క్యాంపు నిమిత్తం విశాఖపట్నం వెళ్ళివచ్చిన ఓ పోలీసు ఐజీ మరికొంత మంది అధికారులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. పోలీసులు వైజాగ్ లో ఏదో జరిగిందని అనుమానించి అక్కడికి రాకపోకలు నిషేధిస్తారు. ఏం జరిగిందీ తెలుసుకోమని స్పెషల్ ఆఫీసరు నరేష్ ను అక్కడికి పంపిస్తారు. |
|||
==నటీనటులు== |
==నటీనటులు== |
15:13, 20 ఆగస్టు 2016 నాటి కూర్పు
జంబలకిడిపంబ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి. సత్యనారాయణ |
---|---|
తారాగణం | నరేష్ , ఆమని |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | బాలాజీ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
జంబలకిడిపంబ ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 1992 లో వచ్చిన ఒక విజయవంతమైన హాస్యభరిత సినిమా. ఇందులో నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆడవాళ్ళ పనులు మగవారు, మగవాళ్ళ ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వినోదభరితంగా తెరకెక్కించారు.
కథ
రామలక్ష్మి కోట శ్రీనివాసరావు కూతురు. విశాఖపట్నం లో వాళ్ళు నివసించే కాలనీలో మగవాళ్ళు అందరూ తీరిగ్గా కూచుని పేకాట ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వారి భార్యలు ఇంటి పనిలో సతమతమవుతూ ఉంటారు. వారి బాధల్ని చూసి రామలక్ష్మి మనసు బాధ పడుతూ ఉంటుంది. ఆమె అలా బాధ పడినప్పుడల్లా ఎక్కడో నుంచో ఆమెకు ఒక లేఖ అందుతూ ఉంటుంది. మొదట్లో ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు. కానీ అది ఆమె మహిళల సమస్యల గురించి బాధ పడినప్పుడల్లా కనిపించే సరికి ఒకసారి ఆ లేఖను చదువుతుంది.
ఆ లేఖలో ఆమెను విశాఖ పట్నానికి కొంచెం దూరంలో ఉన్న బొర్రా గుహల దగ్గరికి ఒంటరిగా రమ్మని రాసి ఉంటుంది. రామలక్ష్మి అక్కడికి వెళ్ళి అంబ అనే యోగినిని కలుసుకుంటుంది. ఆమె పురుషాధిక్య సమాజం వలన తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి జీవితం మీద విరక్తితో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. సమాజం మీద కక్ష తీర్చుకోవడానికి ఆమె జంబలకిడి పంబ అనే మందు తయారు చేసి ఉంటుంది. ఆమె శిష్యుడు చిదంబరానంద స్వామిని పిలిచి ఆ మందును రామలక్ష్మికిచ్చి ఆ మందును తీసుకెళ్ళి తాగే నీళ్ళలో కలపమంటుంది.
మరుసటి రోజు క్యాంపు నిమిత్తం విశాఖపట్నం వెళ్ళివచ్చిన ఓ పోలీసు ఐజీ మరికొంత మంది అధికారులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. పోలీసులు వైజాగ్ లో ఏదో జరిగిందని అనుమానించి అక్కడికి రాకపోకలు నిషేధిస్తారు. ఏం జరిగిందీ తెలుసుకోమని స్పెషల్ ఆఫీసరు నరేష్ ను అక్కడికి పంపిస్తారు.
నటీనటులు
- రామలక్ష్మి గా ఆమని
- పోలీసు ఆఫీసర్ గా నరేష్
- కోట శ్రీనివాస రావు
- డబ్బింగ్ జానకి
- ఆనందం గా బ్రహ్మానందం
- పార్వతి గా శ్రీలక్ష్మి
- తూటాల రాణి గా జయలలిత
- నాగులు గా బాబుమోహన్
- కీరవాణి గా జయ ప్రకాష్ రెడ్డి
- మల్లికార్జున రావు
- మహర్షి రాఘవ
- ఆలీ
- చిడతల అప్పారావు
- ఐరన్ లెగ్ శాస్త్రి
- కల్పనా రాయ్
- చిదంబరానంద గా కళ్ళు చిదంబరం
- హెడ్మాస్టరుగా బాలాదిత్య