కౌతా ఆనందమోహనశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26: పంక్తి 26:
[[వర్గం:1908 జననాలు]]
[[వర్గం:1908 జననాలు]]
[[వర్గం:1940 మరణాలు]]
[[వర్గం:1940 మరణాలు]]
[[వర్గం:చిత్రకారులు]]

13:21, 4 అక్టోబరు 2010 నాటి కూర్పు

కౌతా ఆనందమోహనశాస్త్రి (1908 - 1940) ప్రముఖ చిత్రకారులు.[1]

వీరు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో కౌతా శ్రీరామశాస్త్రి మరియు శేషమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యానంతరం అక్కడి జాతీయ కళాశాలలో విద్యార్ధిగా చేరి ప్రమోద కుమార్ ఛటర్జీ వద్ద చిత్రలేఖనం లో నాలుగు సంవత్సరాలు శిక్షణ పొందారు. తర్వాత మైసూరు వెళ్ళి అక్కడ రాజాస్థానంలో కళాచార్యులుగా మన్ననలు పొందిన వెంకటప్ప వద్ద చిత్రలేఖనంలో ఉన్నత స్థాయి శిక్షణను పొందారు. అహమ్మదాబాదులోని అంబాలాల్ సారాభాయి కళాశాలలో కళాచార్యులుగా 1930లో నియమితులై 1934 వరకు పనిచేశారు. వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు.

వీరు ప్లూరసీ వ్యాధిచే పీడితులై చికిత్స చేసిననూ ప్రయోజనం లేక చివరికి 21 మే 1940 తేదీన అకాల మరణం పొందారు.

పేర్కొనదగిన చిత్రాలు

  • అజంతా నర్తకి
  • ఏకలవ్యుడు
  • కత్తిని పదును పెట్టువాడు
  • గొర్రెల మేపు గొల్లపిల్ల
  • గ్రామ వీధి
  • తిక్కన సోమయాజి
  • దీపాలు
  • బుద్ధుడు
  • రుద్రుడు
  • లోయలో వటవృక్షం
  • వరూధినీ ప్రవరులు
  • శ్రీకృష్ణుడు
  • సంత నుండి
  • సతీ శిశువులు

మూలాలు

  1. ఆనందమోహనశాస్త్రి, కౌతా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 43-44.