కౌతా ఆనందమోహనశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కౌతా ఆనందమోహనశాస్త్రి
జననం1908
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం
మరణంమే 21 1940
నివాస ప్రాంతంమచిలీపట్నం
వృత్తిఅహమ్మదాబాదులోని అంబాలాల్ సారాభాయి కళాశాలలో కళాచార్యులు
ప్రసిద్ధిప్రముఖ చిత్రకారులు.
మతంహిందూ మతము
తండ్రికౌతా శ్రీరామశాస్త్రి
తల్లిశేషమ్మ


కౌతా ఆనందమోహనశాస్త్రి (1908 - 1940) ప్రముఖ చిత్రకారులు.[1]

వీరు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం లో కౌతా శ్రీరామశాస్త్రి, శేషమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యానంతరం అక్కడి జాతీయ కళాశాలలో విద్యార్ధిగా చేరి ప్రమోద కుమార్ ఛటర్జీ వద్ద చిత్రలేఖనం లో నాలుగు సంవత్సరాలు శిక్షణ పొందారు. తర్వాత మైసూరు వెళ్ళి అక్కడ రాజాస్థానంలో కళాచార్యులుగా మన్ననలు పొందిన వెంకటప్ప వద్ద చిత్రలేఖనంలో ఉన్నత స్థాయి శిక్షణను పొందారు. అహమ్మదాబాదులోని అంబాలాల్ సారాభాయి కళాశాలలో కళాచార్యులుగా 1930లో నియమితులై 1934 వరకు పనిచేశారు. వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. సుప్రసిద్ధ చిత్రకారులు కౌతా రామమోహన శాస్త్రి వీరికి స్వయాన సోదరులు.

వీరు ప్లూరసీ వ్యాధిచే పీడితులై చికిత్స చేసిననూ ప్రయోజనం లేక చివరికి మే 21, 1940 తేదీన అకాల మరణం పొందారు.

పేర్కొనదగిన చిత్రాలు[మార్చు]

  • అజంతా నర్తకి
  • ఏకలవ్యుడు
  • కత్తిని పదును పెట్టువాడు
  • గొర్రెల మేపు గొల్లపిల్ల
  • గ్రామ వీధి
  • తిక్కన సోమయాజి
  • వీధి దీపాలు
  • బుద్ధుడు
  • రుద్రుడు
  • లోయలో వటవృక్షం
  • వరూధినీ ప్రవరులు
  • శ్రీకృష్ణుడు
  • సంత నుండి
  • సతీ శిశువులు

మూలాలు[మార్చు]

  1. ఆనందమోహనశాస్త్రి, కౌతా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 43-44.