గోల్డెన్ త్రెషోల్డ్: కూర్పుల మధ్య తేడాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు |
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) చి వర్గం:ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
==సాక్ష్యాలు== |
==సాక్ష్యాలు== |
||
{{reflist}} |
{{reflist}} |
||
[[వర్గం:ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు]] |
19:49, 11 ఏప్రిల్ 2013 నాటి కూర్పు
గోల్డెన్ త్రెషోల్డ్ అనే భవనం శ్రీమతి సరోజినీ నాయుడు హైదరాబాదు నివాస గృహం. హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక బంగళాలో ఆమె తండ్రి అయిన అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నివాసముండేవారు. దీనిని సరోజినీ నాయుడు తదనంతరం ఆమె ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చి గుర్తించసాగారు. వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం మరియు జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, హైదరాబాదు లో ఈ గృహం, కేంద్ర బిందువుగా ఉండేది. ఈ విశాల ప్రాంగణం ఛటోపాధ్యాయ కుటుంబం యొక్క ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం. గోల్డెన్ త్రెషోల్డ్ లో సరోజినీ నాయుడు మాత్రమే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి నటుడు మరియు సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి మరియు నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసమున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ కూడా గోల్డెన్ త్రెషోల్డ్ కు వచ్చినట్టు, ఆ సందర్భంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు, ఒక మొక్కను నాటినట్టు ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారి ఆధీనంలో ఉంది.[1]
హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు ఈ ప్రాంగణంలో ఆగష్టు 2012 నుండి ఒక థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ని నడుపుతున్నారు.