సయ్యద్ ముఖాసిర్‌షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయ్యద్ ముఖాసిర్ షా
సయ్యద్ ముఖాసిర్‌షా


పదవీ కాలం
1979-1980
1980-1985
ముందు ఎన్.వెంకటసుబ్బయ్య
తరువాత ఎ.చక్రపాణి

పదవీ కాలం
1970-1974
1974-1979
ముందు ఎర్రం సత్యనారాయణ
తరువాత కంచెర్ల కేశవరావు

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1968-1985

వ్యక్తిగత వివరాలు

జననం (1932-03-15)1932 మార్చి 15
ఆదిలాబాద్, తెలంగాణ
మరణం 1992 అక్టోబరు 17(1992-10-17) (వయసు 60)
మతం ముస్లిమ్

సయ్యద్ ముఖాసిర్‌షా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ అధ్యక్షుడు.

విశేషాలు[మార్చు]

సయ్యద్ ముఖాసిర్‌షా 1932, మార్చి 15న ఆదిలాబాద్ జిల్లాలో సయ్యద్ ముదాసిర్ షా, అజీజ్ ఉన్నీసా బేగం దంపతులకు జన్మించాడు. ఇతడు హైదరాబాదులోని బద్రుక కళాశాల నుండి బి.కామ్‌. పట్టాను పొందాడు.

ఇతడు 1968 జూలై 1 నుండి 1974 జూన్ 30 వరకు, 1974 జూలై 1 నుండి 1980 జూన్ 30 వరకు ఆదిలాబాదు స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైనాడు. తరువాత 1980 జూలై 1 నుండి 1985 మే 31 వరకు శాసనమండలిలో నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నాడు.

ఇతడు 1970 డిసెంబరు 17న శాసనమండలి ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై ఆ పదవిలో 1979 మార్చి 24 వరకు పనిచేశాడు. 1979 మార్చి 26న శాసనమండలి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై 1980 జూన్ 30 వరకు, తిరిగి 1980 జూలై 1 నుండి 1985 మే 31వరకు పనిచేశాడు.

ఇతడు 1970-71 మధ్య కాలంలో ప్రభుత్వ లెక్కల కమిటీ సభ్యుడిగా, 1971-72, 1972-73 సంవత్సరాల మధ్యకాలంలో విశేషాధికారాల కమిటీ, అర్జీల కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.

ఇతడు లండన్‌లో జరిగిన 31వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు హాజరయ్యాడు. ఇంకా ఇతడు ఇంగ్లాండు, పశ్చిమ జర్మనీ, సౌదీ అరేబియా దేశాలను సందర్శించాడు.

ఇతడు 1992 అక్టోబరు 17న తన 60వ యేట మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "శ్రీ సయ్యద్ ముఖాసిర్ షా". లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్. Centre for Good Governance. Retrieved 11 May 2020.