ఆంధ్రప్రదేశ్ శాసనమండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
రకం
రకం
కాల పరిమితులు
శాశ్వత సభ, సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు
నాయకత్వం
అధ్యక్షుడు
ఉపాధ్యక్షుడు
ప్రతిపక్ష నాయకుడు
నిర్మాణం
సీట్లు58 (50 ఎన్నుకోబడిన+ 8 సూచించబడిన)
రాజకీయ వర్గాలు
అధికార పక్షం లేక జట్టు (45)
  •   YSRCP (35)
  •   నామినేటెడ్ (6)
  •   IND (4)

ప్రధాన ప్రతిపక్షం లేక జట్టు (13)

  •   TDP (8)
  •   నామినేటెడ్ (2)
  •   PDF (2)
  •   IND (1)
ఎన్నికలు
ఓటింగ్ విధానం
బదలాయించగల ఒక ఓటు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
శాసనమండలి భవనం
అమరావతి, ఆంధ్రప్రదేశ్
వెబ్‌సైటు
http://www.aplegislature.org/web/legislative-council

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (విధాన పరిషత్) భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభ.[1] 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, 2014[2] లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి కొనసాగుతుంది.

చరిత్ర[మార్చు]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆంధ్రా ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉంది. 1953 అక్టోబర్ 1 న[3] ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది, తరువాత 1956 లో తెలంగాణ ప్రాంతంతో కలపి నవంబర్ 1, 1956 న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాంగా అవతరించింది. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి 1958 వరకు ఒకే సభ ఉన్న పార్లమెంటరీ వ్యవస్థగా పనిచేసింది. 1956 డిసెంబరు 5 న ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి ఏర్పాటు చేయుటకు తీర్మానం చేసింది. ఈ వ్యవస్థ మూలంగా రెండు సభలు ఉంటాయి.[4] అధికారికంగా విధాన పరిషత్తు 1958 జూలై 1 న ప్రారంభించబడింది. ఈ ఏర్పాటు భారత రాజ్యాంగంలోని 168 అధికరణం మూలంగా జరిగింది. 1958 జూలై 7న అప్పటి భారత రాష్ట్రపతి, రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవం చేశాడు.[4]

రద్దులు, పునరుజ్జీవనాలు[మార్చు]

1985 రద్దు[మార్చు]

1980 వ దశకంలో, ఎగువ సభలను రద్దు చేయాలని కోరిన రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది ప్రజా ప్రాతినిధ్యం లేనిదని, రాష్ట్ర బడ్జెట్ పై భారమని, చట్టం ఆమోదించడంలో జాప్యాలకు కారణమనే విమర్శలతో రద్దు చేయటకు నాటి టీడిపి ప్రభుత్వం నిర్ణయించింది.[4][5][6][7] ఆ విధంగానే రద్దు తీర్మానాన్ని అసంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏదేమైనా అప్పటి పాలక పార్టీ తెలుగుదేశం రాజకీయ ప్రతిపక్షమైన భారత జాతీయ కాంగ్రెసుకు శాసన మండలిలో ఎక్కువ సీట్లు ఉండటంవల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు చట్టాలు అవ్వడానికి ఆలస్యం జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. [7]

ఆంధ్రప్రదేశ్ విధానసభ ఆమోదించి పంపిన తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు 1985 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (రద్దు) చట్టం ద్వారా విధాన పరిషత్‌ను రద్దు చేసింది.

2007 పునరుజ్జీవనం[మార్చు]

1989 లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ (ఐ) కు చెందిన ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శాసన మండలిని పునరుద్ధరించడానికి తదుపరి ప్రయత్నాలు ప్రారంభించాడు.[4][7] శాసన మండలిని పునరుద్ధరించడానికి ఒక తీర్మానం 1990 జనవరి 22 న విధానసభలో ఆమోదించబడింది.[4]

1990 మే 28 న రాష్ట్ర విధానసభ (అసంబ్లీ) తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు ఎగువ సభ (రాజ్యసభ)లో శాసన మండలి పునరుద్ధరణకు అధికారమిచ్చిన శాసనం ఆమోదం పొంది దిగువ సభైన లోక్‌సభ ఆమోదానికి పంపబడింది. కానీ అర్ధంతరంగా 1991 లో లోక్‌సభ రద్దు కావటంతో ఈ బిల్లు నిలిచిపోయింది.[4] తరువాత వచ్చిన లోక్‌సభలు (1991–1996, 1996–1998, 1998–2004) ఈ విషయంపై ఎలాంటి చర్యా తీసుకోలేదు.

2004 ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, కాంగ్రెస్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ జూలై 8, 2004 న శాసన మండలి పునరుద్ధరణకు మరొక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది.[4] కేంద్రం ప్రభుత్వం 2004 డిసెంబరు 16 న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2006 డిసెంబరు 15 న లోక్‌సభ ఆమోదం, డిసెంబరు 20 న రాజ్యసభ ఆమోదం పొంది, 2007 జనవరి 10 న రాష్ట్రపతి ఆమోదం పొందింది.[4] నూతనంగా పునరుద్ధరించబడిన శాసన మండలి 2007 మార్చి 30 న ఏర్పాటు చేయబడింది, ఏప్రిల్ 2 న అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ చేత ప్రారంభించబడింది.[4]

2020 రద్దు ప్రయత్నం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన రెండు బిల్లులను అసంబ్లీ ఆమోదించిన తర్వాత, శాసనమండలి నిశితమైన పరిశీలన కొరకు సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం శాసనసభలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం పై చర్చకు తెదేపా హాజరుకాలేదు. జనసేన శాసనసభ్యుడు అంగీకారం తెలిపారు దీనితో 133-0 ఆధిక్యంతో ఆమోదం పొందింది (మామూలుగా హాజరైన సభ్యులలో యాభై శాతానికి మించి ఆమోదిస్తే సరిపోతుంది). ఈ బిల్లును కేంద్రం పెండింగ్ లో ఉంచింది.[8] 2021 లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంది.[9]

చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్[మార్చు]

కౌన్సిల్ చేత ఎన్నుకోబడిన చైర్‌పర్సన్, కౌన్సిల్ యొక్క సెషన్లకు అధ్యక్షత వహిస్తారు. చైర్‌పర్సన్ అందుబాటులోకి లేని సమయంలో సభను నిర్వహించడానికి డిప్యూటీ చైర్‌పర్సన్ ను కూడా ఎన్నుకుంటారు. విరిరువురు ఏదైనా కారణం చేత సభకు హాజరు కాని పక్షంలో చైర్‌పర్సన్ ల ప్యానల్ లోని ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు . ఈ చైర్‌పర్సన్ ల ప్యానల్ ను చైర్‌పర్సన్ తాను భాధ్యతలు తీసుకున్న మొదటి సేషన్ లోనే 10 మందికి మించకుండా నిర్ణయిస్తారు. చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు చైర్‌పర్సన్ ల ప్యానల్ లోని సభ్యులు సభకు అధ్యక్షత వహించలేరు. ఆ సమయంలో గవర్నర్ సభలో అందరికంటే సినియర్ సభ్యుడికి అధ్యక్ష భాధ్యతలు అప్పగించడం ఆనవాయతి.[10]

సభ్యత్వం , పదవీకాలం[మార్చు]

శాసన మండలి శాశ్వత సభ.[4] ఇందులో 58 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల సాధారణ కాలపరిమితి ఆరుసంవత్సరాలు. అందులో 1/3 వంతు మంది ప్రతీ రెండు సంవత్సరాలకు సభ్యత్వం పూర్తి చేసుకుంటారు. కొత్త సభ్యులు ఎన్నికవుతారు.[4] శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరసత్వం కలిగి ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. మానసికంగా ఆరోగ్యం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు.

20 మంది సభ్యులు శాసనసభ్యుల ద్వారా, 20 మంది సభ్యులు అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల సముదాయం ద్వారా, 10 మంది సభ్యులు పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుండి ఎన్నుకోబడతారు . ఆంధ్రప్రదేశ్ గవర్నరు ద్వారా 8 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు. [11]

ఓటు వేసే విధానం - ఎన్నికలు - ఫలితం - నిర్ణయం[మార్చు]

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే శాసనమండలి ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికలలో ఓటరు ఒకరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి తమ ఓటును ప్రాధాన్యతల ద్వారా సూచించాల్సివుంటుంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ క్రిందివిధంగా ఉంటుంది.

ఓటు హక్కును వినియోగించుకునే పద్దతి[మార్చు]

ఉదాహరణకు నలుగురు అభ్యర్ధులు ఒక శాసనమండలి స్థానం కొరకు బరిలో ఉంటే. ఓటరు తమ ఓటును ప్రాధాన్యతా క్రమంలో సూచించవల్సి ఉంటుంది. అంటే 1, 2, 3, 4 అని ఆంగ్ల సంఖ్యలతోగాని I, II, III, IV అని రోమన్ సంఖ్యలతోగాని లేదా 8 వ షెడ్యూల్ లో ఉన్న ఏ భాష సంఖ్యలతోనైన అభ్యర్థికి తమ ప్రాధాన్యతను సూచించవచ్చు. ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్యత మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత తప్పనిసరిగా ఇవ్వాలి, లేదంటే తమ ఓటు చెల్లదు. మిగిలిన ప్రాధాన్యతలు ఇచ్చేది లేనిది ఓటరు ఇష్టం.

ఎన్నికల ఫలితం, నిర్ణయం ప్రక్రియ[మార్చు]

మొదటిగా చెల్లని ఓట్లని బ్యాలెట్ పెట్టెల నుంచి వేరు చేస్తారు. తొలి ప్రాధాన్యత ఓటు లేని బ్యాలెట్ పత్రాన్ని చెల్లనిదిగానే పరిగణిస్తారు (తరువాతి ప్రాధాన్యతలు ఉన్నా). చెల్లుబాటైన వాటిల్లో తొలి ప్రాధాన్య ఓట్లు ముందుగా లెక్కిస్తారు, వాటిలో 50 శాతానికి మించి ఓట్లు వచ్చిన అభ్యర్థి విజయం సాధించినట్లు. అలా జరగకపోతే ఆ సమయానికి అతి తక్కువ తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చి చిట్టచివరి స్థానంలో నిలిచిన అభ్యర్థిని తొలగిస్తారు. ఆ అభ్యర్థి తొలి ప్రాధాన్యంగా వున్న బ్యాలెట్‌ పత్రంలో రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి పడ్డాయో గుర్తించి ఆయా అభ్యర్థులకు వాటిని బదలాయిస్తారు. అప్పుడు ఏ అభ్యర్థికైతే 50 శాతం కంటే అధికంగా ఓట్లు వస్తాయో వారు గెలిచినట్లు. అప్పుడు కూడా 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికీ రాకుంటే, తొలి ప్రాధాన్య ఓట్లు తక్కువగా వచ్చిన రెండో అభ్యర్థిని తొలగిస్తారు. ఆ అభ్యర్థి తొలి ప్రాధాన్యంగా వున్న బ్యాలెట్‌ పత్రంలో ఆ అభ్యర్ధి రెండో ప్రాధాన్య ఓట్లను, మొదట తొలగించిన అభ్యర్థికి వచ్చిన మూడో ప్రాధాన్య ఓట్లను మిగతా అభ్యర్థులకు కలుపుతారు. అలా ఒకరికైనా 50 శాతం కంటే ఒక్క ఓటైనా అధికంగా వచ్చేంతవరకూ లెక్కింపు కొనసాగించి ఫలితం ప్రకటిస్తారు. [12]

శాసన మండలి సభ్యులు[మార్చు]

శాసనసభ సభ్యుల ప్రాతినిధ్యం[మార్చు]

శాసససభ్యులచే 20 మంది ఎన్నుకోబడతారు.

పేరు ఎన్నికైన పార్టీ కాలం
యనమల రామకృష్ణుడు తె.దే.పా 2019 - 2025
పర్చూరి అశోక్ బాబు తె.దే.పా 2019 - 2025
దువ్వారపు రామారావు తె.దే.పా 2019 - 2025
బెందుల తిరుమల నాయుడు తె.దే.పా 2019 - 2025
షేక్ మహమ్మద్ ఇక్బాల్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
జంగా కృష్ణమూర్తి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2019 - 2025
దువ్వాడ శ్రీనివాస్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
పాలవసల విక్రాంత్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
దేవసాని చిన్న గోవిందరెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
ఇసాక్‌ బాషా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
బల్లి కళ్యాణ్ చక్రవర్తి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
మహమ్మద్ రుహుల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 25 మార్చ్ 2022 - 29 మార్చ్ 2027
పెన్మత్స సురేష్‌ బాబు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2023 - 29 మార్చ్ 2029
పోతుల సునీత[13] వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2023 - 29 మార్చ్ 2029
చంద్రగిరి యేసురత్నం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2023 - 29 మార్చ్ 2029
మర్రి రాజశేఖర్‌ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2023 - 29 మార్చ్ 2029
బొమ్మి ఇజ్రాయిల్‌ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2023 - 29 మార్చ్ 2029
పంచుమర్తి అనురాధ తె.దే.పా 30 మార్చ్ 2023 - 29 మార్చ్ 2029
జయమంగళ వెంకటరమణ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చ్ 2023 - 29 మార్చ్ 2029

స్థానిక సంస్థలు[మార్చు]

స్థానిక సంస్థలకు 20 సీట్లున్నాయి.

జిల్లా పేరు ఎన్నికైన పార్టీ కాలం
అనంతపురం వై. శివరామి రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
అనంతపురం సానిపల్లి మంగమ్మ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029
కర్నూలు ఎ.మధుసూదన్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029
కడప పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029
చిత్తూరు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
చిత్తూరు సిపాయి సుబ్రహ్మణ్యం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029
నెల్లూరు మేరిగ మురళీధర్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029
ప్రకాశం తూమాటి మాధవరావు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
గుంటూరు మురుగుడు హనుమంతరావు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
గుంటూరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021- 2027
కృష్ణా తలశిల రఘురాం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
కృష్ణా మొండితోక అరుణ్ కుమార్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
పశ్చిమ గోదావరి కవురు శ్రీనివాస్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023- 2029
పశ్చిమ గోదావరి వంక రవీంద్రనాథ్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029
తూర్పు గోదావరి కుడుపూడి సూర్యనారాయణ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029
తూర్పు గోదావరి అనంత ఉదయభాస్కర్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
విశాఖపట్నం వరుదు కల్యాణి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
విశాఖపట్నం
విజయనగరం ఇందుకూరి రఘురాజు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
శ్రీకాకుళం నర్తు రామారావు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029

పట్టభద్రులు[మార్చు]

జిల్లా పేరు ఎన్నికైన పార్టీ కాలం
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఇళ్ల వెంకటేశ్వరరావు పి.డి.ఎఫ్ 2019 - 2025
కృష్ణా జిల్లా, గుంటూరు కలగర సాయి లక్ష్మణరావు పి.డి.ఎఫ్ 2019 - 2025
శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం వేపాడ చిరంజీవిరావు తె.దే.పా 2023 - 2029
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు కంచర్ల శ్రీకాంత్‌ తె.దే.పా 2023 - 2029
అనంతపురం, కర్నూలు, కడప భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తె.దే.పా 2023 - 2029

ఉపాధ్యాయులు[మార్చు]

5 సీట్లు ఉపాధ్యాయ ప్రతినిధులకున్నాయి.

జిల్లా పేరు ఎన్నికైన పార్టీ కాలం
శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం పాకలపాటి రఘువర్మ స్వతంత్ర 2019 - 2025
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి షేక్‌ సాబ్జీ [14] యు.టి.ఎఫ్ 2021- 2023 డిసెంబర్ 15
కృష్ణా, గుంటూరు టి.కల్పలత [15] స్వతంత్ర 2021-2027
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029
అనంతపురం, కర్నూలు, కడప ఎం.వి. రామచంద్రారెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2023 - 2029

గవర్నర్‌ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీలు[మార్చు]

ఈ వర్గంలో ఎనిమిది సీట్లున్నాయి.

పేరు నామినేట్ చేసిన పార్టీ కాలం
పండుల రవీంద్రబాబు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2020 - 2026
జకియా ఖానమ్‌ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2020 - 2026
తోట త్రిమూర్తులు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
కొయ్యే మోషేన్‌రాజు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
రాజగొల్ల రమేశ్ యాదవ్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
కర్రి పద్మశ్రీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 11 ఆగష్టు 2023 - 09 ఆగష్టు 2029[16]
కుంభా రవిబాబు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 11 ఆగష్టు 2023 - 09 ఆగష్టు 2029[16]
లేళ్ల అప్పిరెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021-2027

చైర్మన్లు[మార్చు]

మాజీ శాసనమండలి సభ్యులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "legislative council, Andhrapradesh". AP Government. Retrieved 11 June 2019.
  2. "ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, 2014". సాక్షి. Retrieved 3 జూలై 2023.
  3. "1953 లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు". బైజ్యాస్. Retrieved 3 జూలై 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 "Andhra Pradesh Legislative Council History". National Informatics Centre. Retrieved 2010-09-03.
  5. Sharma. Introduction to the Constitution of India, Fifth Edition. PHI Learning Pvt. Ltd. pp. 212–13. ISBN 978-81-203-3674-2.
  6. Laxmikanth (2012-02-23). Indian Polity For UPSC 3E. Tata McGraw-Hill. pp. 27–1. ISBN 978-0-07-015316-5.
  7. 7.0 7.1 7.2 Agarala Easwara Reddy (1994). State politics in India: reflections on Andhra Pradesh. M.D. Publications Pvt. Ltd. pp. 97–110. ISBN 978-81-85880-51-8.
  8. "శాసనమండలి రద్దు బిల్లును కేంద్రానికి పంపిన ఏపీ ప్రభుత్వం". జీన్యూస్. 2020-01-28. Retrieved 2021-01-25.
  9. "రద్దు తీర్మానం ఉపసంహరణ". బిబిసి. Retrieved 4 జూలై 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "చైర్‌ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ల ప్యానల్ నిభందనలు". అన్ అకాడమీ. Retrieved 4 జూలై 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. TMH General Knowledge Manual. Tata McGraw. 2007. p. 176. ISBN 978-0-07-061999-9.
  12. "AP MLC Election Results 2021 LIVE: కృష్ణా-గుంటూరులో కల్పలత.. ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి ఘన విజయం". tv9. 2021-03-18. Retrieved 2021-03-18.
  13. "ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం". సాక్షి. 2020-01-19. Retrieved 2021-01-24.
  14. "AP MLC Election Results 2021 LIVE: కృష్ణా-గుంటూరులో కల్పలత.. ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి ఘన విజయం". tv9. 2021-03-18. Retrieved 2021-03-18.
  15. "AP MLC Election Results 2021 LIVE: కృష్ణా-గుంటూరులో కల్పలత.. ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి ఘన విజయం". tv9. 2021-03-18. Retrieved 2021-03-18.
  16. 16.0 16.1 Andhrajyothy (11 August 2023). "గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.
  17. 10TV (18 June 2021). "Andhrapradesh: శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం". 10TV (in telugu). Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  18. Andhrajyothy (19 November 2021). "మండలి చైర్మన్‌గా మోషేన్‌రాజు". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  19. Vaartha (25 June 2018). "ఎమ్మెల్సీగా గాలి స‌ర‌స్వ‌తి". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  20. "Rama Krishna wins from Guntur-Krishna teachers' constituency". Business Standard. 25 March 2015. Retrieved 12 June 2021.
  21. "చల్లా భగీరథరెడ్డి కన్నుమూత". సాక్షి. Retrieved 6 జూలై 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  22. "మహమ్మద్ కరీమున్నీసా గారు గుండే పోటుతో మరణించారు". HMTV. Retrieved 6 జూలై 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  23. "Chadipiralla Sivanatha Reddy". Retrieved 2021-03-28.
  24. 24.0 24.1 NT News (12 March 2024). "పార్టీ ఫిరాయింపు.. ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.

వెలుపలి లంకెలు[మార్చు]