Jump to content

పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల సమాఖ్య శాసనసభ

వికీపీడియా నుండి

పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభ, భారతదేశం లోని పాటియాలా తూర్పు పంజాబ్ రాష్ట్రాల సమాఖ్య ఏకసభ రాష్ట్ర స్థాయి శాసనసభ.[1] ఈ శాసనసభకు రెండు ఎన్నికలు జరిగాయి. ఒకటి 1951లో, రెండవది 1954లో జరిగింది.[2][3] ఈ శాసనసభలో 60 స్థానాలు ఉన్నాయి. [2][3] ఈ సమావేశం దర్బార్ (కిలా ముబారక్ కోర్టు, పాటియాలా రాజ కోట) లో జరిగేది.

1951లో 40 ఏక-సభ్యుల నియోజకవర్గాలు, 10 ద్వంద్వ-సభ్యుల నియోజకవర్గాలున్నాయి (వాటిలో ఏదీ షెడ్యూల్డ్ కులాలకు గానీ, షెడ్యూల్డ్ తెగలకు గానీ కేటాయించలేదు).[2] ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ 26 స్థానాలను గెలుచుకుంది. అకాలీదళ్ 19 సీట్లతో, స్వతంత్రులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మద్దతును సేకరించి యునైటెడ్ ఫ్రంటును ఏర్పాటు చేసింది.[4]భారత జాతీయ కాంగ్రెస్ మంత్రివర్గం 1952 ఏప్రిల్ 18న రాజీనామా చేసింది. యునైటెడ్ ఫ్రంటుకు చెందిన జియాన్ సింగ్ రారేవాలా 1952 ఏప్రిల్ 22న మంత్రివర్గాన్నిఏర్పాటు చేశారు. రారేవాలా 1953 మార్చి 11న రాజీనామాచేశారు.[5]

భారత రాజ్యాంగం ఆర్టికల్ 172 (1) నిబంధనల ప్రకారం 1951లో ఎన్నికైన శాసనసభకు ఐదేళ్ల పదవీకాలం ఉండేది.1953 మార్చి 4న భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద ఈ శాసనసభను రద్దు చేశారు.[6] నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిషన్ పునర్య్వస్థీకరణ పూర్తయిన వెంటనే కొత్త ఎన్నికలు జరుగుతాయని అధ్యక్షుడు ప్రకటించారు.[6] డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వు 1953 సెప్టెంబరు 15న ప్రచురించబడింది. పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల శాసనసభకు 1954 ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరిగాయి.[6]1954 ఎన్నికలలో 34 రిజర్వు చేయని ఏక-సభ్యుల నియోజకవర్గాలు,2 ఏక-సభ్యుల స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు,12 రిజర్వు చేయబడని ద్వంద్వ-సభ్యుల నియోజకవర్గాలకు రిజర్వు చేయబడ్డాయి.[3]ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది.కల్నల్ రఘ్బీర్ సింగ్ 1954 మార్చి 6న భారత జాతీయ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.రెండురోజుల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[5] రాంసరంచంద్ మిట్టల్ స్పీకర్గా, సర్దార్ చేత్ సింగ్ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు.[7]

1956 అక్టోబరు 31న పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభను పంజాబ్ శాసనసభలో విలీనం చేశారు.పాటియాలా,తూర్పు పంజాబ్ రాష్ట్రాల సమాఖ్య శాసనసభ సభ్యులు 1956 నవంబరు 1 నాటికి పంజాబ్ శాసనసభలో సభ్యులుగా మారారు.[8] పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభ సభ్యులు కూడా పంజాబ్ శాసన మండలి ఆరుగురు సభ్యులను ఎన్నుకున్నారు.[1]

కూర్పు

[మార్చు]
పార్టీ 1952–1954 1954–1956
అకాలీదళ్ 19
భారతీయ జన్ సంఘ్ 2
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 2 4
భారత జాతీయ కాంగ్రెస్ 26 37
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 1
లాల్ కమ్యూనిస్టు పార్టీ 1
షెడ్యూల్డ్ కులాల సమాఖ్య 1
శిరోమణి అకాలీదళ్ (మన్ గ్రూప్) 10
శిరోమణి అకాలీదళ్ (రామన్ గ్రూప్) 2
స్వతంత్రులు 8 7

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Economic and Political Weekly. Punjab—PEPSU Merger
  2. 2.0 2.1 2.2 Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF PATIALA & EAST PUNJAB STATES UNION
  3. 3.0 3.1 3.2 Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1954 TO THE LEGISLATIVE ASSEMBLY OF PATIALA & EAST PUNJAB STATES UNION
  4. Guha Thakurta, Paranjoy, and Shankar Raghuraman. Divided We Stand: India in a Time of Coalitions. Los Angeles: SAGE Publications, 2007. p. 361
  5. 5.0 5.1 Bhargava, Gopal K., and S. C. Bhatt. Punjab. Delhi: Kalpaz publ, 2006. p. 389
  6. 6.0 6.1 6.2 Punjab District Gazetteers: Faridkot. Controller of Print. and Stationery, 2000. p. 559
  7. The Times of India Directory & Yearbook, Including Who's who. Times of India Press, 1954. p. 1157
  8. Grover, Verinder, and Ranjana Arora. Encyclopaedia of India and Her States. Vol. 4. New Delhi [India]: Deep & Deep, 1996. p. 359