ఏ తీరుగ నను దయ చూచెదవో
Jump to navigation
Jump to search
ఏ తీరుగ నను దయ చూచెదవో ఒక ప్రఖ్యాతిచెందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన భద్రాచల రామదాసు రచించాడు.
ఈ కీర్తనను మాయామాళవగౌళ జన్యమైన నాదనామక్రియ రాగం, ఆదితాళంలో గానం చేస్తారు.
కీర్తన[మార్చు]
- వికీసోర్స్ లో ఏ తీరుగ నను పూర్తి కీర్తన.
భారతీయ సంస్కృతి[మార్చు]
- రామవర్మ ఈ కీర్తనను శాస్త్రీయంగా గానం చేసి ధన్యులయ్యారు.[1]
- భక్త రామదాసు (1964) సినిమాలో చిత్తూరు నాగయ్య ఈ కీర్తనను స్వయంగా పాడుకొని, నటించి స్వరపరిచారు.[2]
- దీనిని శంకరాభరణం (1979) సినిమా కోసం వాణీ జయరాం గానం చేయగా కె.వి.మహదేవన్ స్వరపరిచారు. దీనిని కుమారి తులసి మీద చిత్రీకరిస్తారు. సంగీతం నేర్పమని అడగడానికి శంకరశాస్త్రి గారి ఇంటికి వెళుతూ ఈ కీర్తన పాడుకుంటుంది.[3]
- ఈ కీర్తనను రామదాసు (2006) సినిమాలో జేసుదాసు గానం చేశారు.