కొట్టాయం
మూస:Infobox Indian jurisdiction
- ఈ వ్యాసం కొట్టాయం నగరానికి చెందినది, కొట్టాయం జిల్లా కూడా చూడండి.
కొట్టాయం (మలయాళంలో:കോട്ടയം) భారతదేశంలోని కేరళ రాష్ట్రం యొక్క ఒక నగరం. ఇది కేరళ రాష్ట్ర మధ్యభాగంలో ఉంది మరియు కొట్టాయం జిల్లా పరిపాలనా కేంద్రం. 2001 జనాభా లెక్కల ప్రకారం కొట్టాయం జనాభా 60,725గా అంచనా వేయబడింది. ఈ పట్టణం, సుగంధ ద్రవ్యాలు మరియు వాణిజ్య పంటలకు, ప్రత్యేకించి రబ్బర్ కు ప్రధాన వ్యాపార కేంద్రం. మలయాళ మనోరమ మరియు దీపిక వంటి కేరళ యొక్క ప్రధాన ప్రచురణ మాధ్యమానికి ఈ నగరం ముఖ్య కేంద్రం. కేరళలో ఆధునిక విద్యకు మార్గదర్శిగా, ఈ నగరం 1989లో భారతదేశంలో 100% అక్షరాస్యత సాధించిన మొదటి పురపాలక సంస్థగా మారింది మరియు భారతదేశంలో మొదటి పొగాకు రహిత జిల్లా అయింది[citation needed]. ముద్రణా మాధ్యమం మరియు సాహిత్యంలో ఈ నగరం యొక్క సేవను పరిగణించి కొట్టాయం "అక్షర నగరి(അക്ഷര നഗരി) " అనగా "అక్షరాల నగరం" అని కూడా పిలువబడుతుంది.మొట్ట మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు చెంపిల్ అరయన్ అనంతపద్మనాభన్ వలియ అరయన్ కంకుమరాన్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కొచ్చిన్ కోట వద్ద 29 డిసెంబర్ 1808న పోరాడారు.చెంపిల్ అరయన్, వేలు తంబి దళవ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు.
శబ్ద ఉత్పత్తి శాస్త్రం [మార్చు]
కొట్టాయం అనే పేరు మలయాళ పదాలైన 'కొత్త' అనగా కోట మరియు 'ఆకం' అనగా 'అంతర్భాగం'ల నుండి ఉద్భవించిందని చెప్తారు, ఈ పదానికి అర్ధం 'కోట యొక్క లోపలిభాగం'.
చరిత్ర [మార్చు]
తెక్కుమ్కూర్ అనే చిన్న రాజ్యం యొక్క స్వతంత్ర ప్రభువులచే తఝాట్హంగడి నుండి 18వ శతాబ్దం వరకు కొట్టాయం పరిపాలించబడింది. ఆ సమయంలో, ట్రావన్కోర్ రాజైన మార్తాండ వర్మ, తెక్కుమ్కర్ మరియు కొట్టాయం యొక్క పరిసర ప్రాంతాలను ట్రావన్కోర్ రాజ్యంలో కలిపి వేసుకున్నాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలన సమయంలో, కొట్టాయం, ట్రావన్కోర్ సంస్థానంలో భాగంగానే కొనసాగింది.
ప్రారంభంలో, ట్రావన్కోర్ రెండు ఆదాయ విభాగాలను కలిగి ఉండేది అవి దక్షిణ మరియు ఉత్తర విభాగాలు, ఇవి ఒకొక్కటీ ఒకొక్క 'దివాన్ పేష్కార్' యొక్క పరిపాలనా నియంత్రణలో ఉండేవి. తరువాత 1868లో రెండు అదనపు విభాగాలైన క్విలన్(కొల్లాం) మరియు కొట్టాయం ఏర్పాటు చేయబడ్డాయి. ఐదవ విభాగమైన, దేవికుళం స్వల్పకాలం మనుగడలో ఉండి తరువాత కొట్టాయంలో కలిపివేయబడింది. 1949లో ట్రావన్కోర్ రాజ్యం మరియు కొచ్చిన్ ల కలయిక సమయంలో, ఈ ఆదాయ విభాగాలు జిల్లాలుగా పేరు మార్చబడ్డాయి మరియు దివాన్ పేష్కార్ల స్థానంలో జిల్లా కలెక్టర్లు వచ్చారు. ఆ విధంగా కొట్టాయం జిల్లా జూలై 1949 నుండి మనుగడలోకి వచ్చింది. తరువాత 1957లో కేరళ రాష్ట్రం ఏర్పడినపుడు, ఇది అదే పేరుతో జిల్లా ముఖ్యపట్టణంగా ఆ రాష్ట్రంలో భాగమైంది.
కేరళలోని ప్రారంభ సాంఘిక పోరాటాలలో కొట్టాయం పౌరులు ప్రముఖ పాత్ర పోషించారు. 1891లో ట్రావన్కోర్ పౌరసేవలలో, బయటి వ్యక్తులతో పోల్చినపుడు ట్రావన్కోరియన్లకు అధిక ప్రాతినిధ్యాన్ని కోరుతూ 'మలయాళీ మెమోరియల్ యాజిటేషన్' అనే ఒక వ్యతిరేక పోరాటం జరిగింది. దీని ఆరంభం కొట్టాయంలోనే జరిగిందని భావిస్తారు. కేరళ యొక్క ఆధునిక రాజకీయ ఉద్యమాల ప్రారంభంలో ఈ పోరాటం తీవ్ర ప్రభావాన్ని చూపింది[citation needed]. హిందువులలోని నిమ్న కులాలు, క్రైస్తవులు మరియు ముస్లింలకు ట్రావెన్కోర్ శాసనసభలో ప్రాతినిధ్యం కోరుతూ 1930లో జరిగిన 'నివర్తన ఉద్యమం'లో, కొట్టాయం ప్రధాన పాత్ర పోషించింది. 1924లో మహాత్మా గాంధీ నాయకత్వంలో అంటరానితనంకి వ్యతిరేకంగా జరిగిన వైకోమ్ సత్యాగ్రహము, కొట్టాయం సమీపంలోని వైకోమ్ లో జరిగింది. ఇది అణగారిన వారి హక్కులను సాధించుకోవడానికి సాంప్రదాయానికి వ్యతిరేకంగా కేరళలో జరిగిన మొదటి వ్యవస్థీకృత పోరాటం.
భూగోళ శాస్త్రం మరియు వాతావరణం [మార్చు]
కొట్టాయం మధ్య కేరళలోని
ప్రాంతంలో ఉంది.[1] ఇది సముద్రమట్టాని కంటే సగటున 3 మీటర్ల (9 అడుగుల) ఎత్తును కలిగి ఉంది.
కొట్టాయం పట్టణం మీనచిల్ నది హరివాణం మరియు పశ్చిమ కనుమలలోని ఇడుక్కి జిల్లాలో అనేక ప్రవాహాల ద్వారా ఏర్పడిన వెంబనాడ్ వెనుకకు వచ్చిన జలాల హరివాణంలో ఉంది. ఇది కొట్టాయం జిల్లాలో ప్రవహించి వెంబనాడ్ సరస్సులో కలుస్తుంది. ఎత్తుపై ఆధారపడి ఉన్నత భూభాగాలు, మధ్య భూభాగాలు మరియు నిమ్న భూభాగాలుగా కేరళలోని స్థలాల విభజనలో, కొట్టాయం మధ్య భూభాగంలోని భాగంగా భావించబడుతుంది. ఇక్కడి సాధారణ మృత్తిక ఒండ్రు మృత్తిక రకానికి చెందినది. సహజసంపద ప్రధానంగా ఆయనరేఖా సతత హరిత మరియు తేమతో కూడిన ఆకురాలు రకానికి చెందినది.
ఈ జిల్లాలో శీతోష్ణస్థితి మధ్యమంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. భూమధ్యరేఖకు కొట్టాయం యొక్క సామీప్యత కాలానుగుణంగా కొంచెం మార్పులకు దారితీసి, అధిక స్థాయిలో తేమను కలిగిస్తుంది. సాంవత్సరిక ఉష్ణోగ్రతలు
20మధ్య ఉంటాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు, నైరుతి ఋతుపవనాలు, పశ్చిమ కనుమలకు పవానాభిముఖ ప్రదేశంలో ఉన్న కొట్టాయంకు భారీ వర్షాలను తీసుకువస్తాయి. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు, కొట్టాయం వాయవ్య ఋతుపవనాల ద్వారా తేలికపాటి వర్షాలను పొందుతుంది. సాంవత్సరిక సగటు వర్షపాతం 3600 మిమీ.
కొట్టాయంకు దక్షిణ దిక్కున పతనంతిట్ట జిల్లా, పశ్చిమాన అలప్పుజ జిల్లా, ఉత్తరాన ఎర్నాకులం జిల్లా మరియు తూర్పున ఇడుక్కి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
గూగుల్ పటాలలో స్థానం: [1]
రవాణా [మార్చు]
ఈ నగరంలో ప్రజారవాణా అధికంగా బస్సులపై ఆధారపడింది, వీటిని వ్యక్తిగత నిర్వాహకులు మరియు కేరళ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (KSRTC) నిర్వహిస్తాయి. కొట్టాయంకు మూడు బస్సు స్టేషన్లు సేవలను అందిస్తున్నాయి- రెండు ప్రైవేట్ బస్సులకు సేవలను అందిస్తుండగా ఒకటి KSRTC బస్సులకు ప్రత్యేకించబడింది. ప్రైవేట్ బస్సు స్టేషన్లలో, పెద్దది రైల్వే స్టేషన్ సమీపంలోని నాగంపదంలో ఉండగా రెండవది నగర మధ్యభాగంలో ఉంది. బస్సు సేవలు చాలా తక్కువ రేట్లలో ఉంటాయి. పట్టణంలో పర్యటించడానికి స్థానిక బస్సు సేవలతో పాటు, కొట్టాయం, కేరళలోని మిగిలిన ప్రాంతాలతో KSRTC నడిపే అంతర్-రాష్ట్ర బస్సు సేవలతో అనుసంధానించబడింది. బాడుగకు తీసుకునే రవాణా రూపాలలో మీటర్లు బిగించిన టాక్సీలు మరియు ఆటో-రిక్షాలు ఉన్నాయి. వ్యక్తిగత వాహన రూపాలలో ద్విచక్ర వాహనాలు అధికంగా ఉన్నాయి.
నగరంలోని అంతర్-నగర రైలు రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేల దక్షిణ రైల్వే విభాగంచే నిర్వహించబడుతుంది. కొచి మరియు తిరువనంతపురం మధ్య కొట్టాయం మీదుగా నడిచే అన్ని రైళ్ళు, ఇక్కడ ఆగుతాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మరియు నగరాల నుండి కొట్టాయం ద్వారా రైళ్ళు ఉన్నాయి, వీటిలో న్యూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు మరియు చెన్నై ఉన్నాయి. 49 కిమీ రైల్వే లైన్ చంగానస్సేరి, కొట్టాయం, మీనచిల్(మీనచిల్ తాలూకాలోని కనక్కరి గ్రామం-ఎట్టుమనుర్ సమీపంలోనిది) మరియు వైకోమ్ తాలూకాల నుండి నడుస్తుంది. కంజిరప్పల్లి తాలూకాకు రైలు మార్గం లేదు.
సమీప విమానాశ్రయమైన కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం నుండి 90 కిమీ దూరంలో ఉంది. మరొక పెద్ద విమానాశ్రయం తిరువనంతపురంలో, నగరానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వెంబనాడ్ సరస్సుకి దాని సామీప్యత వలన కొట్టాయం నగరం, కేరళ రాష్ట్ర నీటి రవాణా విభాగం (KSWTD) యొక్క సేవలను కూడా పొందుతోంది. KSWTD కొట్టాయం మరియు అలేప్పీల మధ్య క్రమమైన నది మరియ సరస్సు ప్రయాణ సేవలను నడుపుతుంది. అనేక చిన్న గమ్యస్థానాలకు కూడా ఈ సేవలు నడుస్తాయి. కొట్టాయం పట్టణానికి సమీప పడవల కేంద్రం కోడిమత.
పురాతన పడవ కేంద్రాలైన చందకవల వంటివి, పోషణ లేకపోవడం వలన లేదా ఉపరితల నీటి-మార్గాలు నీటి పుష్పాలు మరియు ఇతర మొక్కలతో నిండి ఉండటం వలన వదలి వేయబడ్డాయి.
కొట్టాయం విమానాశ్రయం
కొట్టాయం ప్రధాన నగరంగా ఉన్న మధ్య ట్రావన్కోర్ ప్రాంతానికి సేవలను అందించడానికి, కొట్టాయం పట్టణానికి దక్షిణ దిశగా, కొట్టాయం జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్ ఉంది. కొట్టాయంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే కోరిక చాలా పురాతనమైనది, అయితే కన్నూర్ విమానాశ్రయం వలె దానికి మాధ్యమం లేదా రాజకీయ మద్దతు లేదు. ఈ విమానాశ్రయం, మధ్య ట్రావన్కోర్ ఆర్ధిక అభివృద్ధితో పాటు పర్యాటక ఆకర్షణలైన కొట్టాయంలోని కుమరకోమ్ మరియు వగమోన్ లకు, అలప్పుజ, పీరుమేడు, తెక్కడి, మున్నార్ మరియు అరణ్ముల అభివృద్ధికి ప్రేరేపణ కలిగిస్తుంది. ఇది పెద్ద సంఖ్యలో ప్రయోజనం కలిగే వారిలో: ఆ ప్రాంతంలోని ప్రవాస భారతీయులు(NRIs), ప్రత్యేకించి కొట్టాయం-పతనంతిట్ట ప్రాంతం వారు మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో నివసించే ప్రవాస కేరళీయులు(NRKs) ఉన్నారు.
వాయుమార్గం లేకపోవడం ఈ ప్రాంత ఆర్ధిక పెరుగుదలకు మరియు అభివృద్ధికి అడ్డంకిగా మారింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన IITల వంటివి నెలకొల్పడానికి విమానాశ్రయానికి సామీప్యత ఒక ముఖ్యమైన లక్షణంగా ఉంటుంది.
తిరునక్కర, భరనంగనం, వైకోమ్, కడప్పట్టుర్, ఎట్టుమనుర్, అరువితర, ఎరుమేలి, శబరిమల వంటి పుణ్యక్షేత్రాలకు ప్రతి సంవత్సరం వచ్చే లక్షలాది భక్తులు ఈ విమానాశ్రయం వాస్తవ రూపం దాల్చినపుడు ప్రయోజనం పొందగలరు.
కొట్టాయం ఈ ప్రాంతంలోని అత్యంత ప్రధానమైన నగరం మరియు ఈ ప్రదేశాలన్నిటికీ ఉత్తమమైన ప్రవేశమార్గం కావడంతో పాటే ఇది తీర-సరస్సు ప్రాంతానికి మరియు పశ్చిమ కనుమలకు మధ్య మంచి ప్రదేశంలో ఉంది, అందువలన కేరళలో 5వ విమానాశ్రయ స్థాపనకు కొట్టాయం ఉత్తమమైన ప్రదేశం.
ఈ విమానాశ్రయ ప్రకల్పన LDF నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని(NOC) పొందవలసి ఉంది, ఇది గత UPA ప్రభుత్వ హయాం నుండే విమానయాన మంత్రిత్వశాఖ నుండి అనుమతి పొందింది.
జనాభా లెక్కలు [మార్చు]
2001 [update] భారతదేశ జనాభాలెక్కలు,[2] కొట్టాయం పట్టణ సంఘటిత జనాభా 1,72,878 , కొట్టాయం జిల్లా 19,52,901 జనాభాను కలిగి ఉంది. ఈ జనాభాలో పురుషులు 49%, స్త్రీలు 51% ఉన్నారు. 1991 నుండి 2001 మధ్య జనాభా పెరుగుదలలో ప్రతికూలతను చూసిన అతికొద్ది ప్రదేశాలలో ఇది ఒకటి.[citation needed]
కేరళ రాష్ట్రం యొక్క 90.92% మరియు భారతదేశం యొక్క 65.38% అక్షరాస్యతతో పోల్చినపుడు కొట్టాయం 95.9% అక్షరాస్యతతో ప్రధమ స్థానంలో ఉంది. (2001 జనాభా లెక్కలు). ఇది జనాభా మరియు ప్రదేశాల పరంగా కేరళలోని జిల్లాలలో 10వ స్థానంలో ఉంది. ఈ జిల్లా అత్యల్ప దశాబ్ద జనాభా పెరుగుదల రేటు 6.76%ను నమోదు చేసింది, కేరళలోని ఇతర ప్రాంతాల్లో ఇది 9.42%గా ఉంది.
ఆర్థిక వ్యవస్థ [మార్చు]
భారతదేశంలో సహజ రబ్బర్ వర్తకానికి కొట్టాయం ప్రధాన వర్తక కేంద్రం. రబ్బర్ చెట్లు మధ్య కేరళలో విరివిగా సాగుచేయబడతాయి, ప్రత్యేకించి కొట్టాయం జిల్లాలోని విశాల ప్రాంతాలలో, పెద్ద మరియు చిన్న తోటలలో సాగుచేయబడతాయి. రబ్బర్ పరిశ్రమ అభివృద్ధికి భారత ప్రభుత్వంచే ఏర్పాటుచేయబడిన సంస్థ అయిన రబ్బర్ బోర్డ్, కొట్టాయంలో ఉంది. పట్టణంలోను మరియు పరిసరాలలో ఉన్న అనేక చిన్న మరియు మధ్య స్థాయి సంస్థలు రబ్బర్ లేటెక్స్ అభివృద్ధిలో మరియు రబ్బర్ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. రబ్బర్ తో పాటు, కొట్టాయం పరిసర ప్రాంతాలలో విస్తృతంగా సాగుచేయబడే సుగంధ ద్రవ్యాల వంటి ఇతర వాణిజ్య పంటలకు కూడా కొట్టాయం వర్తక ప్రదేశంగా ఉంది. ప్లాంటేషన్ కార్పోరేషన్ అఫ్ కేరళ యొక్క ప్రధాన కార్యాలయం కూడా కొట్టాయంలోనే ఉంది.
కొట్టాయం వాణిజ్య కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం గుండా పోయే కొట్టాయం–కుమిలి రోడ్ (KK రోడ్) యొక్క విస్తరణ ప్రధాన షాపింగ్ కేంద్రంగా ఉంది కొట్టాయంలోని అతివిశాలమైన రహదారి అయిన శాస్త్రి రోడ్, ప్రపంచంలోని అన్ని ప్రఖ్యాత బ్రాండ్ల దుకాణాలతో షాపింగ్ కు ప్రధాన ఆకర్షణగా ఉంది. బేకర్ జంక్షన్ మరియు కన్జికుజి కూడా నగరం యొక్క వాణిజ్య మరియు నివాస కేంద్రాలుగా భావించబడతాయి. కొట్టాయం జిల్లా హిందూస్తాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్, కొట్టాయం స్పిన్నింగ్ మిల్స్ మరియు KSE కర్మాగారం వంటి పరిశ్రమలను కలిగి ఉంది.
పర్యాటక రంగానికి చెందిన అనేక వ్యాపారాలు ఈ నగరంలో వృద్ధి చెందడంవలన, పర్యాటకరంగం ఈ ప్రాంత ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన సహకారాన్ని అందిస్తోంది. కేరళలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటైన కుమరకోమ్, ఈ పట్టణం నుండి కేవలం 14 కిమీల దూరంలో ఉంది. వాగమోన్ అనే మరొక దర్శనీయ స్థలం, కొట్టాయం మరియు ఇడుక్కి జిల్లాల సరిహద్దులో ఉంది.
కొట్టాయం మతపరమైన పర్యాటక రంగానికి కోరదగిన ప్రదేశంగా ఉంది. మొట్టమొదటి ఇండియన్ రోమన్ కాధలిక్ స్త్రీ సెయింట్, సెయింట్ ఆల్ఫోన్స ఇక్కడ జన్మించింది మరియు పెరిగింది.[citation needed]
ప్రతిపాదిత కొట్టాయం మునిసిపల్ కార్పోరేషన్ [మార్చు]
కొట్టాయం మునిసిపాలిటీని మునిసిపల్ కార్పోరేషన్ గా పెంచాలనే డిమాండ్ ఉంది.
ప్రతిపాదిత కొట్టాయం మునిసిపల్ కార్పోరేషన్ క్రింది ప్రాంతాలను కలిగి ఉంటుంది:
- కొట్టాయం మునిసిపాలిటీ (కొట్టాయం, వేలూర్, ముత్తంబలం, నట్టకం, పల్లం, కుమారనల్లుర్, పెరుమ్బైకాడ్)
- విజయపురం పంచాయత్
- పనచిక్కడ్ పంచాయత్
- తిరువర్ప్పు పంచాయత్ (తిరువర్ప్పు, చెంగలం సౌత్ గ్రామాలు)
- అయ్మానం పంచాయత్ (అయ్మానం, కుడమలూర్ గ్రామాలు)
- అర్పూకర పంచాయత్
మొత్తం ప్రదేశం: సుమారు 180 కిమీ2
మొత్తం జనాభా(1991 జనాభా లెక్కల ప్రకారం): 308,958
గమనిక: ($అయ్మానం మరియు అర్పూకరల పశ్చిమ భాగం ప్రత్యేక చిపుంగల్ గ్రామంగా ఉంది, ఇది కుమరకం పంచాయత్ తో కలసి కుమరకం పట్టణ ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది)
సంస్కృతి, సాహిత్యం మరియు క్రీడలు [మార్చు]
కేరళ సాంస్కృతిక పటంలో కొట్టాయం కు గౌరవప్రదమైన స్థానం ఉంది. కొట్టాయం యొక్క సంస్కృతి ప్రధానంగా పెద్ద సంఖ్యలో ఉన్న సిరియన్ క్రైస్తవ సమాజం ఉనికిచే ప్రభావితమైనది. కొట్టాయం యొక్క వంట పద్ధతి కేరళీయుల వంట, ముఖ్యమైన ఆహారంగా ఉప్పుడు బియ్యాన్ని వాడతారు మరియు కొబ్బరి ఇంకా సుగంధద్రవ్యాలు పుష్కలంగా వాడతారు.
మార్గంకలి మరియు అర్జున న్రితం ప్రసిద్ధ నృత్య రూపాలు. మార్గంకలి, సమూహ నృత్యాలను మరియు పరిచముట్టుకలి వంటి యుద్ధ కళలను కలిగి, సిరియన్ క్రైస్తవ సమాజంలో ప్రసిద్ధి చెందింది. దీనిని స్త్రీ, పురుషులు వేరువేరుగా ప్రదర్శిస్తారు. గతంలో ఇది, సిరియన్ క్రైస్తవ వివాహాలలో ప్రదర్శించబడేది. మయిల్పీలి తూక్కంగా కూడా పిలువబడే పురుషులు ప్రదర్శించే అర్జున న్రితం ప్రసిద్ధి చెందింది. వీటితోపాటు, దక్షిణ భారతదేశ ప్రసిద్ధ నృత్య రూపాలైన భరతనాట్యం, మోహినియాట్టం, మరియు కూచిపూడి మరియు సాంప్రదాయ కర్నాటక సంగీతంలను ఒక అభిరుచిగా లేదా పాట్యేతర కార్యక్రమంగా పెద్ద సంఖ్యలో యువకులు అభ్యసిస్తారు.
కొట్టాయం అనేకమంది ప్రసిద్ధ రచయితలు, పత్రికా విలేఖరులు మరియు కళాకారులను తయారు చేసింది. ముత్తతు వర్కేయ్ -నవలాకారుడు, పాల నారాయణన్ నాయర్ -కవి మరియు వాయల వాసుదేవన్ పిళ్ళై -నాటక కర్త మరియు నాటకోద్యమ మార్గదర్శి, వీరందరూ తమ తొలి అడుగులను కొట్టాయంలోనే వేసారు. ఉత్కంటను కలిగించే నేర పరిశోధన రచనలు చేసే కొట్టాయం పుష్పనాథ్ -కొట్టాయంలో నివసిస్తారు.
క్రికెట్, బాస్కెట్ బాల్ మరియు ఫుట్ బాల్ కొట్టాయంలో ప్రజాదరణ పొందిన ఆటలు. ఈ ప్రదేశం నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అనేక మంది అథ్లెట్లు రావడం వలన కొట్టాయం అథ్లెటిక్స్ కు కూడా ప్రసిద్ధి చెందింది. కొట్టాయంలో ప్రధాన క్రీడా ప్రాంగణమైన నెహ్రూ స్టేడియం నగర ప్రవేశం వద్దనే ఉంది. మరియన్ ట్రోఫి, గిరిదీపం ట్రోఫి, లౌర్దేస్ ట్రోఫి మరియు వర్జీనియా మెమోరియల్ టోర్నమెంట్ వంటి అనేక ప్రసిద్ధ బాస్కెట్ బాల్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించబడతాయి.
శాస్త్రి రహదారిలో ఒక పురపాలక ఉద్యానవనం ఉంది. ఇక్కడ మలయాళం, ఇంగ్లీష్, తమిళ్ మరియు హిందీ చిత్రాలను ప్రదర్శించే ప్రదర్శనశాలలు ఉన్నాయి. కేరళ, తమిళ్ మరియు ఉత్తర భారతదేశ వంటలను తయారుచేసే ఫలహారశాలలు కూడా ఉన్నాయి.
ప్రసిద్ధ వ్యక్తులు [మార్చు]
(కొట్టాయం పురపాలక ప్రాంతానికి చెందని వ్యక్తులు దీనిలో లేరు . దయచేసి ఆ విధమైన సమాచారం కొరకు కొట్టాయం జిల్లా వినియోగించుకోండి)
- భారతదేశ మాజీ రాష్ట్రపతి Dr.K R నారాయణన్, కొట్టాయం జిల్లా
- భారతదేశ ప్రధాన న్యాయమూర్తి - K G బాలకృష్ణన్, కొట్టాయం జిల్లా
- కందతిల్ వర్ఘీస్ మాపిల్లై, 1858–1904, మలయాళ మనోరమ స్థాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
- K. C. మమ్మేన్ మాప్పిల్లై, 1873–1956, మలయాళ మనోరమ సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ట్రావెన్కోర్ శ్రీ మొల్లం అసెంబ్లీ మాజీ సభ్యుడు
- M.N. గోవిందన్ నాయర్, న్యాయవాది-మలయాళ వ్యంగ్య రచయిత
- G. అరవిందన్, 1935–1991, ప్రసిద్ధ హాస్యరచయిత(కార్టూనిస్ట్) మరియు చిత్ర నిర్మాత. అనేక రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలను పొందాడు, పైన పేర్కొన్న M.N. గోవిందన్ నాయర్ కుమారుడు
- మమ్మూట్టి , చిత్ర కళాకారుడు(ఫిలింఫేర్, ఫిలిం క్రిటిక్స్, జాతీయ, రాష్ట్ర, పద్మశ్రీ, భారత్ పురస్కారాలు పొందాడు).కొట్టాయం జిల్లా
- జాన్ అబ్రహాం: "అమ్మ అరియన్" ద్వారా ప్రసిద్ధి చెందిన చిత్ర దర్శకుడు
- వైకోమ్ ముహామాద్ బషీర్ రచయిత
- N.N. పిళ్ళై, నాటక రచయిత మరియు చిత్ర/రంగస్థల నటుడు
- D. C. కిఝాకేమురి, రచయిత, సాంఘిక కార్యకర్త మరియు గ్రంధ ప్రచురణకర్త
- M.R.G పణికర్, 1910-2002, స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ప్రముఖ NSS నాయకుడు. కులాతీతంగా కుమారనేల్లోర్ దేవాలయంలోకి అందరికీ ప్రవేశం కల్పించడంలో ఆయన కృషికి శ్రీ చితిర తిరునాళ్ చే సత్కరించబడ్డాడు.
మతపరమైన సంస్థలు [మార్చు]
జనాభా యొక్క మతపరమైన నిర్మాణాన్ని ప్రతిబింబిస్తూ, పెద్ద సంఖ్యలో హిందూ దేవాలయాలు మరియు క్రైస్తవ చర్చ్ లు పట్టణ దృశ్యంలో ఉంటాయి. తిరునక్కర మహాదేవ దేవాలయం, వాలియ పల్లి మరియు మనర్కాడ్ పల్లి (మనర్కాడ్ చర్చ్)గా పిలువబడే రెండు చర్చ్ లు మరియు తజతంగడి జుమ మస్జిద్ వీటిలో కొన్ని.
మీనచిల్ నది ఒడ్డున ఉన్న తజతంగడి జుమ మస్జిద్, భారత దేశంలోని అత్యంత పురాతనమైన మసీదులలో ఒకటి మరియు 1000 సంవత్సరాల కంటే పూర్వానికి చెందినది, దాని నిర్మాణ శోభకు, మరియు కొయ్య చెక్కడాలలో అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ అనుచరులచే కేరళకు వారి మొదటి ప్రయాణాల సందర్భంగా నిర్మించబడింది. నగరం మధ్యలో ఉన్న శివ ఆలయమైన తిరునక్కర మహాదేవ ఆలయం, కేరళ దేవాలయ నిర్మాణ శైలిలి నిర్మించిన దేవాలయం, దీని అంతర్భాగంలోని చిత్రాలు హిందూ పురాణాల గాధలను వివరిస్తాయి. ఇది 16వ శతాబ్దంలో అప్పటి తేక్కుమ్కుర్ రాజుచే నిర్మించబడింది. సాంవత్సరిక దేవాలయ ఉత్సవం ఆరాట్టుగా పిలిచే కార్యక్రమంతో అంతమవుతుంది, దీనికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
కేరళలోని సిరియన్ క్రైస్తవులకు కొట్టాయం ప్రధాన కేంద్రంగా ఉంది. 1550లో పశ్చిమ ఆసియా నుండి వలస వచ్చిన క్నానయ సిరియన్ క్రైస్తవులు నిర్మించిన సెయింట్ మేరీస్ చర్చ్, వాలియా పల్లి (పెద్ద చర్చ్), కొట్టాయం పట్టణంలోని మొదటి క్రైసవ చర్చ్ గా భావించబడుతుంది. ఈ చర్చ్ పర్షియన్ శిలువలుగా పిలువబడే రెండు గ్రానైట్ శిలువలకు ప్రసిద్ధి చెందింది. ప్రధాన పూజావేదిక వెనుక మరియు పై కప్పు పై అరుదైన పురాతన చెక్కడాలు మరియు కుడ్య చిత్రాలు ఉన్నాయి.
1579లో తెక్కుమ్కుర్ రాజు తన క్రైస్తవ పౌరుల కొరకు నిర్మించిన మలంకర ఆర్థడాక్స్ చర్చ్ కు చెందిన మరొక సెయింట్ మేరీస్ చర్చ్, చెరియా పల్లి (చిన్న చర్చ్)గా ప్రసిద్ధి చెందింది. ఈ చర్చ్ లు దేవాలయ నిర్మాణకళతో ప్రభావితమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. కూరగాయల రంగులను ఉపయోగించి గీయబడిన లోపలి కుడ్యచిత్రాలు బైబిల్ లోని విషయాలను వివరిస్తాయి. ఏదేమైనా, కొట్టాయం జిల్లలో అత్యంత ప్రసిద్ధి చెందిన క్రైస్తవ చర్చ్ "మనర్కాడ్ పల్లి "గా ప్రసిద్ధి చెందిన సెయింట్ మేరీస్ కేథడ్రల్ మనర్కాడ్. కేరళలోని ఏ ఇతర చర్చ్ ఈ చర్చ్ కంటే ఎక్కువ మంది భక్తులను లేదా యాత్రికులను ఆకర్షించలేదు. "ఎట్టునోమ్పు " గా పిలువబడే "8 రోజుల ఉపవాసం"కు అన్ని మతాలూ మరియు అన్ని వర్గాలకు చెందిన సుమారు 1 మిలియన్ ప్రజలు హాజరవుతారు. 8వ రోజున జరిగే ఊరేగింపు- "రాజా " ఆసియాలో జరిగే ఆ విధమైన సంఘటనలలో అత్యంత గొప్పది. చూడండి (మనర్కాడ్ చర్చ్) యొక్క వెబ్ సైట్.
రోమన్ కాథలిక్ చర్చ్ యొక్క సైరో-మలబార్ సాంప్రదాయం కొట్టాయంలో ఒక మత పీఠము(archeparchy) ని కలిగి ఉంది. కొట్టాయంలోని ముఖ్యమైన రోమన్ కాథలిక్ చర్చ్ లలో లౌర్డ్స్ ఫారన్ చర్చ్, గుడ్ షెఫర్డ్ చర్చ్, విమలగిరి కెథడ్రల్ మరియు క్రీస్తురాజ కెథడ్రల్ కొన్ని. 1986లో తన భారతదేశ పర్యటన సందర్భంగా పోప్ జాన్ పాల్ II కొట్టాయంను సందర్శించారు. ఆయన కొట్టాయం జిల్లాకు చెందిన చావర యొక్క ఫాదర్ కురియకోస్ మరియు సిస్టర్ ఆల్ఫోన్సల పవిత్రీకరణను కొట్టాయంలో ప్రకటించారు. 12 అక్టోబర్ 2008లో సెయింట్ స్థానాన్ని పొందిన సెయింట్ ఆల్ఫోన్స పార్ధివ శరీరం, భారానగరంలోని సెయింట్ మేరీస్ చర్చ్ ప్రక్కన ఉన్న ప్రార్ధనాలయంలో ఉంచబడింది. ఇది ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రం.
మాధ్యమం [మార్చు]
మలయాళ సాహిత్యానికి మరియు ప్రచురణ మాధ్యమానికి కొట్టాయం నాడీ కేంద్రంగా భావించబడుతుంది. ఉన్నునీలి సందేశం, ఒక అందమైన మరియు ప్రసిద్ధ కవితా రచన, వాడక్కుమ్కుర్ రాజులు రచించినట్లుగా తెలుస్తుంది. 1821లో, బెంజమిన్ బైలీ అనే బ్రిటిష్ మత ప్రచారకుడు కేరళలోని మొట్ట మొదటి ముద్రణా యంత్రం C.M.S. ప్రెస్ ను కొట్టాయంలో స్థాపించాడు. అప్పటి నుండి వార్తా పత్రికలూ మరియు గ్రంధ ప్రచురణలలో రాష్ట్రంలో ఈ నగరం ముందంజలో ఉంది.
18వ మరియు 19వ శతాబ్దాలలో, మలయాళ సాహిత్యం క్రైస్తవ మతప్రచారకుల రచనలతో సమృద్ధి చెందింది. రోమ్ పర్యటన గురించి పరమ్మేక్కల్ తోమ కథనార్ రచించిన వర్తమాన పుస్తకం(1778), మలయాళంలో మొదటి travelogue. మొదటి మలయాళ ఆంగ్ల నిఘంటువు మరియు మలయాళ నిఘంటువు కొట్టాయంలో వరుసగా 1846 మరియు 1865 సంవత్సరాలలో ప్రచురించబడ్డాయి. మలయాళంలో మొదటి స్వీయచరిత్ర వైకోమ్ పచు మూతతుచే 1870లో కొట్టాయంలో ప్రచురించబడింది. మొదటి మలయాళ బైబిల్ కూడా కొట్టాయంలోనే ప్రచురించబడింది.[citation needed]
జ్ఞాననిక్షేపం కేరళ స్థానికులచే ప్రచురించబడిన మొదటి వార్తాపత్రిక, ఇది కొట్టాయంలోని CMS ముద్రణాలయంలో 1848లో ప్రచురింపబడింది.[3] నస్రాని దీపిక 1887లో కొట్టాయం సమీపంలోని మన్ననం వద్ద కార్మేలైటీస్ అఫ్ మేరీ ఇమ్మక్యులేట్ (CMI) మత ప్రచారకుల ద్వారా స్థాపించబడింది. ఈ వార్తాపత్రిక ఇప్పటికీ దీపిక అనే పేరుతో ప్రచురించబడుతూ మలయాళంలో ప్రముఖ దినపత్రికగా ఉంది. భారతదేశంలో అత్యధికంగా పంపిణీ చేయబడే ప్రాంతీయ దినపత్రిక అయిన మలయాళ మనోరమ,[citation needed] 1890లో, K.C. మమ్మేన్ మాపిలచే ఇక్కడే స్థాపించబడింది. కొట్టాయం నుండి వెలువడే వార్తాపత్రికలైన మలయాళ మనోరమ, దీపిక మరియు మలయాళ మనోరమ సమూహం నుండి వెలువడే సాహిత్య పత్రిక భాషాపోషిణి, కేరళ యొక్క సాంస్కృతిక మరియు సాహిత్య అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించాయి.
నేడు, ఐదు ప్రధాన మలయాళ వార్తాపత్రికలు – మలయాళ మనోరమ, మాతృభూమి, దీపిక, మాధ్యమం మరియు మంగళం – మరియు సుమారు ముప్ఫై పత్రికలు కొట్టాయం నుండి ప్రచురింపబడుతున్నాయి. D. C. బుక్స్, లేబర్ ఇండియా పబ్లికేషన్స్ మరియు కరంట్ బుక్స్ వంటి అనేక మళయాళ గ్రంధ ప్రచురణ సంస్థలకు కూడా కొట్టాయం స్థావరంగా ఉంది. కేరళలో ప్రచురితమయ్యే దాదాపు 70 శాతం గ్రంధాలు కొట్టాయంలోనే ముద్రించబడతాయి.[4] 1945లో, ఒక రచయితల సంఘం సాహిత్య ప్రవర్తక సహకరణ సంగంను స్థాపించారు, మలయాళంలో దీనికి అర్ధం 'సాహిత్య కారుల' సహకార సంస్థ. ఇది రచయితలు, నవలాకారులు మరియు కవుల మొదటి సహకార సంస్థ.
విద్య [మార్చు]
మలంకర ఆర్థడాక్స్ చర్చ్ యొక్క ఆర్థడాక్స్ పఝాయ సెమినరి దక్షిణ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన మొదటి సంస్థ. C.M.S ఉన్నత పాఠశాల,(ప్రస్తుతం చర్చ్ మిషనరీ సొసైటీ కాలేజ్ హై స్కూల్), లండన్ లోని చర్చ్ మిషన్ సొసైటీకి చెందిన బ్రిటిష్ మత ప్రచారకుడు బెంజమిన్ బైలీచే స్థాపించబడింది. కేరళలోని మొట్టమొదటి కళాశాల అయిన C.M.S కళాశాల, కొట్టాయంలో 1817లో చర్చ్ మిషన్ సొసైటీచే స్థాపించబడింది. 1820లో అమలియ డోరోతేయ బెకర్ కొట్టాయంలో స్థాపించిన బెకర్ మెమోరియల్ గరల్స్ హై స్కూల్, భారతదేశంలోని అత్యంత పురాతనమైన బాలికల పాఠశాలలలో ఒకటి.
కేరళలోని ఆరు విశ్వవిద్యాలయాలలో ఒకటైన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, కొట్టాయంలో ఉంది. కొట్టాయం వైద్య కళాశాల పట్టణం నుండి 10 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ అనేక ఆర్ట్స్ & సైన్సు కళాశాలలు కూడా ఉన్నాయి, C.M.S. కళాశాల కొట్టాయం, K.G.కళాశాల పంపడి, BCM కళాశాల మొదలైనవి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలైన, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, కొట్టాయం, కిడంగూర్ ఇంజనీరింగ్ వంటి కొన్ని పట్టణానికి సమీపంలో ఉన్నాయి, మంగళం కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సెయింట్ గిట్స్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెయింట్ జోసెఫ్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వంటివి జిల్లాలోని కొన్ని స్వయం సమృద్ధ కళాశాలలలో ప్రధానమైనవి. పట్టణంలోను మరియు పరిసర ప్రాంతాలలో పాలిటెక్నిక్ కళాశాలలు మరియు అనేక నర్సింగ్ పాఠశాలలు ఉన్నాయి.
ఇతర సంస్థలలో సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్మెంట్ (CRM), కొట్టాయం (గ్రామీణాభివృద్ధి పరిశోధనా సంస్థలలో ముందున్న ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ), మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మాస్ కమ్యూనికేషన్ ఉన్నాయి.
వైద్యశాలలు మరియు ఆరోగ్య రక్షణ [మార్చు]
వైద్య కళాశాలతో పాటు, అక్కడ ఒక జిల్లా వైద్యశాల మరియు T.B. కేంద్రం ఉన్నాయి. ఒక పిల్లల వైద్యశాల, నాలుగు తాలుకా వైద్యశాలలు, ఆరు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 11 సమితి ఆరోగ్య కేంద్రాలు, 51 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు మరియు మరియు ఏడు ప్రభుత్వ వైద్యశాలలు ఆరోగ్యశాఖ క్రింద పని చేస్తున్నాయి.[5] ప్రభుత్వ మరియు ప్రైవేటు విభాగాలలో అత్యంత ఆధునిక చికిత్సా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఒక వ్యాధి పరిశీలనా కార్యక్రమం జిలాలో చేపట్టబడింది.
మతం [మార్చు]
క్రైస్తవమతంలోని అనేక విభాగాలు, ఇస్లాం మరియు హిందూమతం శాంతియుతంగా సహజీవనం సాగిస్తున్నాయి. ఎజవాలు, నాయర్లు, విశ్వకర్మ కులస్థులు మరియు షెడ్యూల్డ్ కులాలు & తెగలు హిందూ మతంలోని ప్రధాన విభాగాలుగా ఉన్నారు. ఆర్థడాక్స్ చర్చ్, సైరో-మలబార్ కాథలిక్ చర్చ్, జాకోబైట్ చర్చ్, క్నానయ, మార్థోమా చర్చ్, సెయింట్ థామస్ ఎవాంజెలికల్ చర్చ్, CSI చర్చ్, పెంతేకోస్టల్ చర్చ్ లు, ఇండియన్ బ్రదరెన్ అనుచరులు పెద్ద క్రైస్తవ విభాగాలుగా ఉన్నారు. కొట్టాయం, మలంకర ఆర్థడాక్స్ సిరియన్ చర్చ్ యొక్క ప్రధాన కేంద్రం.
ముఖ్యమైన ప్రదేశాలకు దూరం [మార్చు]
- కొట్టాయం - శబరిమల - 100 కిమీ
- కొట్టాయం - తెక్కడి - 114 కిమీ
- కొట్టాయం - తిరువనంతపురం - 160 కిమీ
- కొట్టాయం - గురువాయూర్ దేవస్థానం - 170 కిమీ
- కొట్టాయం - కోచి - 67 కిమీ
- కొట్టాయం - చెట్టికులంగర దేవస్థానం - 50 కిమీ
- కొట్టాయం - కాలికట్ - 285 కిమీ
- కొట్టాయం- తొడుపుజ - 55 కిమీ
రాజకీయాలు [మార్చు]
కొట్టాయం అసెంబ్లీ నియోజకవర్గం కొట్టాయం(లోక్ సభ నియోజకవర్గం)లో భాగంగా ఉంది.[6]
ఈ జిల్లా 09 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉంది - కొట్టాయం, పాల, ఎట్టుమనూర్, కడుథురుతి, కంజిరప్పల్లి, చంగనస్సేరి, పుతుప్పల్లి, పూంజర్ మరియు వైకోమ్. కొట్టాయం ఈ జిల్లాలోని ఏకైక పార్లమెంటరీ నియోజకవర్గం. కంజిరప్పల్లి మరియు పూంజర్ అసెంబ్లీ నియోజకవర్గాలు పతనంతిట్ట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మరియు చంగనస్సేరి, మవెలిక్కర పార్లమెంటరీ నియోజకవర్గంలో చేర్చబడింది.
పరిపాలనాపరంగా, కొట్టాయం రెండు రెవిన్యూ జిల్లాలను కలిగి ఉంది - కొట్టాయం మరియు పాల - ప్రతి ఒక్కటి ఒక రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ అధీనంలో ఉంటాయి. ఇక్కడ ఐదు తాలుకాలు ఉన్నాయి -కొట్టాయం, చంగనస్సేరి, వైకోమ్, మీనచిల్ మరియు కంజిరప్పల్లి.[7]
ఇది కూడా చూడండి [మార్చు]
- కొట్టాయం (లోక్ సభ నియోజకవర్గం)
సూచికలు [మార్చు]
- ↑ ఫాలింగ్ రెయిన్ జెనోమిక్స్, Inc – కొట్టాయం
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ సమాచార మరియు పౌరసంబంధాల శాఖ యొక్క అధికారిక వెబ్ సైట్
- ↑ కొట్టాయం జిల్లా యొక్క అధికారిక వెబ్ సైట్
- ↑ (ఆధారం జిల్లా కరదీపిక)
- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies". Kerala. Election Commission of India. Retrieved 2008-10-19.
- ↑ (ఆధారం: కేరళ జిల్లా కరదీపిక)
బాహ్య లింకులు [మార్చు]
| Wikimedia Commons has media related to: కొట్టాయం |
- కొట్టాయం జిల్లా యొక్క అధికారిక వెబ్ సైట్
- కేరళ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్ సైట్
- కొట్టాయంపై బ్రిటానికా సూచన
మూస:Kerala మూస:Municipalities of Kerala మూస:Kottayam district
- All articles with unsourced statements
- Articles with unsourced statements from May 2009
- Articles with invalid date parameter in template
- Articles with unsourced statements from July 2008
- Articles containing potentially dated statements from 2001
- All articles containing potentially dated statements
- Articles with unsourced statements from February 2007
- Articles with unsourced statements from June 2009
- Articles with unsourced statements from September 2008
- Commons category template with no category set
- కొట్టాయం జిల్లాలోని నగరాలు మరియు పట్టణాలు
- కొట్టాయం
- త్రివేండ్రం రైల్వే విభాగం