జనువాడ రామస్వామి
Jump to navigation
Jump to search
జనువాడ రామస్వామి | |
---|---|
జననం | 1952, జనవరి 15 |
వృత్తి | కవులు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు ప్రొఫెసర్, కవులు |
భాగస్వామి | సత్యవతి |
తల్లిదండ్రులు |
|
జనువాడ రామస్వామి, తెలంగాణకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు.
జననం[మార్చు]
రామస్వామి 1952, జనవరి 15న ఆగమయ్య - పార్వతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, చిలుకూరు గ్రామంలో జన్మించాడు.
చదువు - ఉద్యోగం[మార్చు]
తెలుగులో ఎం.ఏ, పి.హెచ్.డి చేశారు. జ్యోతిష్య శాస్త్రం, సంస్కృతంలో ఎం.ఏ చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ తెలుగు ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. ప్రిన్సిపాల్ గా పదవి విరమణ పొందారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
రామప్వామికి సత్యవతితో వివాహం జరగింది. వారికి ఒక కుమారుడు (రాఘవేంద్ర)
ప్రచురిత పుస్తకాలు[మార్చు]
- కవితారామం (కవితా సంకలనం, 1986)
- మనోనేత్రం (కవితా సంకలనం, 1996)
- శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం (2002)[1]
- జనువాడ కవితలు (2003)
- శ్రీ తిరుమలేశ శతకం (2010)
- శ్రీ వేంకటాచల నివాస శతకము (2018)[2]
- రాజదండం (పద్యకృతి)[3]
మూలాలు[మార్చు]
- ↑ జనువాడ రామస్వామి (2002). శ్రీ చిలుకూరు వేంకటేశ్వర శతకం.
- ↑ "ఆత్మ సమర్పణకు అద్దం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2023-04-03. Retrieved 2023-04-03.
- ↑ "పార్టీలకు చురక, ప్రజలకు వైతాళిక గీతిక | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2023-04-03. Retrieved 2023-04-03.