Coordinates: 16°17′36.5″N 80°26′51″E / 16.293472°N 80.44750°E / 16.293472; 80.44750

జిన్నా టవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిన్నా టవర్
ప్రదేశంగుంటూరు
భౌగోళికాంశాలు16°17′36.5″N 80°26′51″E / 16.293472°N 80.44750°E / 16.293472; 80.44750
విస్తీర్ణంఆంధ్రప్రదేశ్, భారతదేశం

జిన్నా టవర్ (ఆంగ్లం:Jinnah Tower) (ఉర్దూ:جناح_مینار) గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడం. దీనికి పాకిస్తాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టడం జరిగింది. ఈ కట్టడం గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ వీధిలో ఉంది. ఇది శాంతి, సామరస్యాలకు చిహ్నం.[1]

చరిత్ర[మార్చు]

ఈ కట్టడం యొక్క మూలం రెండు కథలుగా ప్రచారం జరుగుతుంది. మొదటిది, జిన్నా యొక్క ప్రతినిధి గుంటూరు నగరానికి వచినప్పుడు, ఆ సందర్భానికి చిహ్నంగా లాల్ జాన్ భాషా ఈ టవర్ ని కట్టించి జిన్నాని గౌరవించారని. రెండోది, గుంటూరు మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు, తెల్లాకుల జాలయ్య వారి వారి పదవీకాలంలో శాంతి సామరస్యాలకు చిహ్నంగా దీనిని కట్టించారు అని.

నిర్మాణం[మార్చు]

ఇది ఆరు స్తంబాల మీద నిలబడి, పైన గుమ్మటపు కప్పు (డోమ్) ఉన్న కట్టడం.. ఇది 12వ శతాబ్దానికి చెందిన ముస్లిం నిర్మాణ శైలిలో ఉంటుంది.[2]

స్థితి[మార్చు]

2011 వార్తల ప్రకారం ఈ కట్టడం నిర్లక్ష్యానికి గురి అయ్యి అధ్వాన స్థితిలో ఉంది.[3]

మూలాలు[మార్చు]

  1. Ajay Mankotia (20 May 2015). "Finding Kamala Nehru in Pakistan, Jinnah in Guntur". NDTV.com.
  2. "The Hindu : Tower of harmony in Guntur". The Hindu. 2003-09-07. Archived from the original on 2003-10-27. Retrieved 2016-06-13.
  3. Staff Reporter (2011-03-19). "Jinnah Tower in a state of neglect". The Hindu.