Coordinates: 18°14′00″N 79°47′46″E / 18.233455°N 79.796240°E / 18.233455; 79.796240

తిరుమలగిరి (రేగొండ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుమలగిరి, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలంలోని గ్రామం.[1].

తిరుమలగిరి
—  రెవిన్యూ గ్రామం  —
తిరుమలగిరి is located in తెలంగాణ
తిరుమలగిరి
తిరుమలగిరి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°14′00″N 79°47′46″E / 18.233455°N 79.796240°E / 18.233455; 79.796240
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ భూపాలపల్లి
మండలం రేగొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,334
 - పురుషుల సంఖ్య 1,629
 - స్త్రీల సంఖ్య 1,605
 - గృహాల సంఖ్య 928
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన రేగొండ నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గ్రామ జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 928 ఇళ్లతో, 3234 జనాభాతో 2739 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1629, ఆడవారి సంఖ్య 1605. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 504 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578060[3].పిన్ కోడ్: 506348.

చరిత్ర[మార్చు]

వరంగల్ జిల్లాకేంద్రానికి 50 కి.మీ. దూరంలో, వరంగల్-మహదేవ్ పూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవుల గుట్టలున్నాయి. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు కన్పిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు.పాండవులగుట్టల్లో ‘ఎదురుపాండవులు, గొంతెమ్మగుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీసబండ, తుపాకులగుండు, యానాదుల గుహ’లు చూడాల్సిన ప్రదేశాలు.

వాటిలో ఎదురుపాండవులు దానికి కుడిపక్కన వెనకవైపు గుహలు, గొంతెమ్మగుహ, పంచపాండవుల దొనెల్లో అద్భుతమైన శిలాశ్రయచిత్రాలున్నాయి. ప్రాక్ యుగం నుండి చారిత్రకయుగం దాకా వేయబడిన రాతిచిత్రాలెన్నో అప్పటి జీవనశైలీ వైవిధ్యాల్ని కనువిందు చేస్తున్నాయి. కొన్నిచోట్ల పాతబొమ్మల మీదనే కొత్తబొమ్మలు వేసిన జాడలగుపిస్తున్నాయి. ఆరుచోట్ల వున్న చిత్రిత శిలాశ్రయాల్లో అన్నిబొమ్మలు ముదురు ఎరుపురంగుతో చిత్రించబడ్డవే. మందమైన గీతలతో చదునైన పూతలతో గీయబడిన ఈ బొమ్మల్లో శాకాహార, మాంసాహార జీవులు, మనుషుల బొమ్మలు వున్నాయి. వీటిలో జింకలు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్ళపందులు, కుందేళ్ళు, తాబేలు, పాము, చిలుక, సీతాకోకచిలుకలు, కొండెంగ, నెమలి, కప్ప,బల్లి, ఎలుగుబంటి, పెద్దపులులు, పండు, వలతో మనుషులు, పులి వంటి జంతువును చంపిన సరీసృపం వంటి పెద్ద జంతువు, కుందేళ్ళను తరుముతున్న కుక్కలు, కుక్కలు చుట్టి నిలుచున్న మనిషి, ఈనిన జింక, జింకపిల్లను నాకుతున్న దృశ్యాన్ని చూస్తున్న మనిషి, త్రిభుజాలు, త్రిశూలం, చుక్కల వంటి రేఖాకృతులు, కొన్ని శిథిలచిత్రాలు, ఇవేకాక గొంతెమ్మగుహలో చేతిగుర్తులు, యుద్ధం చేస్తున్న వీరుల బొమ్మ లున్నాయి. పంచపాండవుల గుహలో రంగులలో పంచపాండవులు, కుంతి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెండ్లి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతుల చిత్రాలున్నయి. ఈ బొమ్మలన్నింటిలో ‘ఎదురు పాండవుల’నే కొండచరియలో వేసివున్న రాతిచిత్రాలు అతి పురాతనమైనవి, అపూర్వమైనవి. ఈ చిత్రాలొకచోట 6 అడుగుల కంటె ఎత్తుగా వున్నాయి. ఈ చిత్రాలు వేసిన తీరు, శైలి, మొరటుదనం, వాటిలోని జంతు జీవజాలం అన్నింటిని పరిశీలించి కాలానుశీలన చేస్తే ఇవి మనదేశంలోని మధ్యప్రదేశ్ ‘బింబేట్కా’ గుహల్లోని రాతిచిత్రాల కన్నా ప్రాచీనమైనవని తెలుస్తుంది. World Heritage వారు చెప్తున్నవిధంగా బింబేట్కా చిత్రాలు 30 వేల యేళ్ళనాటివైతే మన పాండవుల గుట్టబొమ్మల్లో అశ్వికులు, యుద్ధ సన్నివేశాలు, ఆయుధాలు, వివిధ వాహనాలు, అలంకరణలు వంటి ఆధునికరూపాలేవీలేవు కనుక ఇవి వాటికన్నా ప్రాచీనకాలానికి చెందినవని రుజువవుతున్నది.ఒక్క పంచపాండవుల గుహల్లలో మాత్రమే వర్ణచిత్రాలున్నాయి. (అవి 12, 13 శతాబ్దాల నాటివిగా పురాశాఖ వారు అనుమానిస్తున్నారు.).భారతదేశంలో దాదాపు 2,500 చిత్రిత శిలాశ్రయాలున్న 400ల స్థావరాలు 100 శిలాచిత్రలేఖన మండలాల్లో కన్పిస్తున్నాయి. తెలుగునాట 28 చోట్ల, తెలంగాణాలో 14 తావుల్లో ఈ రాతిచిత్రాలున్నాయి. పాండవుల గుట్టల్లోని చిత్రాలు అంత్యప్రాచీన శిలాయుగం నుండి మధ్యశిలాయుగంవరకు తర్వాత చారిత్రకయుగంలో చిత్రించబడినవి. పాండవులగుట్టలో రాళ్ళను చూస్తే ‘కొలరాడో’ గుర్తొస్తుంది. రాతిచిత్రాలను చూస్తే పాండవుల గుట్ట తెలంగాణాలోని ‘చిత్రిత శిలాశ్రయాల విశ్వవిద్యాలయం’ అనిపిస్తుంది. ప్రాక్ యుగం నుండి చారిత్రయుగం దాకా మానవజీవన పరిణామాన్ని ఒకేచోట నిలుపుకున్న గుహాచిత్రాల సమూహమిది. ఈ గుట్టలమీది రాతిచిత్రాలను తొలిసారి గుర్తించింది, పురావస్తువారికి రిపోర్టు చేసింది చారిత్రకపరిశోధకులు, రచయిత డా.ఈమని శివనాగిరెడ్డిగారే. పాండవుల గుట్టల్లో అన్నీ విశేషాలే. ‘ఎదురు పాండవుల’ గుహలకు కుడిపక్కన వెనక వైపున 5 చోట్ల రాతిచిత్రాల దొనెలతో పాటు ఒకచోట అద్భుతమైన సహజసిద్దమైన అవిచ్ఛిన్న ‘శిలాతోరణం’ ఉంది. ఒక రాతిగుండులో రెండు నిలువుల ఎత్తున ఈ శిలాతోరణం ఎంతో అందంగా కనిపిస్తున్నది. గొంతెమ్మగుహ కూడా విశేషాలున్న తావు. ఇక్కడి గుహలో చేతిముద్రలు, చిత్రాలు, లిపులున్నాయి. వివిధ చిత్రితశిలాశ్రయాల్లో మాదిరిగానే ఇక్కడ ముదురు ఎరుపురంగులో (కుడి)చేతిముద్రలు ఉన్నాయి.గుహ బయట వీరుల యుద్ధసన్నివేశం చిత్రించబడివుంది. రంగు, గీతలను బట్టి ఈ బొమ్మ చారిత్రకయుగం నాటిదనిపిస్తున్నది. గుహలో ఒక రాతిగో మీద బూడిదవన్నె రంగుతో రాసిన లిపి ఉంది. అట్లాంటి రాతలే ఎరుపురంగులో పంచపాండవుల గుహలో కూడా ఉన్నాయి. లిపిని బట్టి 6,7 శతాబ్దాలనాటివని తోస్తున్నది ఆ రాతలు. పాండవుల గుట్టల్లో మరొక చారిత్రకయుగ విశేషముంది. గొంతెమ్మగుహ తూర్పున బండరాయి అంచున ఒక ‘లఘుశాసనం’ ఉంది. అది ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసనం. ఈ శాసనం గురించి పురావస్తుశాఖ వారు వివరించి రాయలేదు. కాని, ఇదే పేరుతో గల ఇట్లాంటి లఘుశాసనాలు తెలుగునాట 11చోట్ల, మహారాష్ట్రలో ఒకచోట లభించాయి. ఆరుచోట్ల ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’ అని తప్ప సంపూర్ణశాసనాలు లభ్యం కాలేదు. తక్కిన ఆరు తావుల్లో శాసనాలని చదివి తెలిసిందానిమీద చర్చోపచర్చలు చేసిన చారిత్రక పరిశోధకులు ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’ అనేది ఒక శిల్పకారుల సంఘం పేరై వుంటుందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. కాని ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’ మీద పరిశోధక గ్రంథం రాసిన ‘తెలుగు గోష్టి’ వ్యవస్థాపక అధ్యక్షులు చీమకుర్తి శేషగిరిరావు గారు ఈ ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’లు కాలాముఖశైవులై వుంటారని, వారు అప్పట్లో 6,7 శతాబ్దాలలో బౌద్ధ, జైన ఆరామ, విహార, చైత్యాలను, దేవాగారాలను ధ్వంసం చేస్తూ ‘మేం బౌద్ధ, జైన మతాలనే ప్రమాదాలకు(ఉత్పత్తి అంటే ప్రమాదమని అర్థం) పిడుగు (వజ్రం)లాంటి వాళ్ళం’ అని (కృష్ణమూర్తి ‘ వేల్పుల కథ’) వేసిన హెచ్చరిక శాసనాలై వుంటాయని తేల్చారు. దానికి వారు చూపిన ఆధారాలు సబబుగానే ఉన్నాయి. కర్నూలు సాతానికోటలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్త నివాసి లోక శీలాభిమాన – అర్జునన్ మహేశ్వర కాలాముఖ’ అని, నంద్యాల కడమల కాల్వలోని గుడిలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్త నివాసి’ అని, మహానందిలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు కాలాముఖ’ అని వుండడం వల్ల, మహబూబ్ నగర్ సంగమేశ్వరాలయంలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్తనివాసి’ అనే శాసనం వల్ల, ఇపుడు మన పాండవులగుట్ట గొంతెమ్మగుహ (బహుశః బౌద్ధుల వర్షావాసం అయివుంటుంది )లోని శాసనంలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాంతవాసి పరమ మహేశ్వర భతన్ మహాముని’ అని రాసి వుండడం వల్ల చీమకుర్తి గారి వాదమే నిజమనే సాక్ష్యం లభించినట్లైంది. ఆ శాసనంలో చెక్కబడివున్న గదలాంటిది (ఇంద్రుని వజ్రాయుధం లేదా కంటకశిల కాదు) లకులీశుని ( ఆలంపురం దేవాలయ మ్యూజియంలోని లకులీశుని విగ్రహం) చేతిలోని ఆయుధం ‘లగుడం’ వలెనె ఉంది. సున్నా గుర్తు బౌద్ధుల శూన్యవాదాన్ని సూచించే చిహ్నం అని పరిశోధకులు రాంభట్ల కృష్ణమూర్తి ‘ వేల్పుల కథ’లో రాసారు.ప్రాచీన గుహ చిత్రాలయాల స్థావరం.పాండవుల గుట్టలు వరంగల్ జిల్లాకేంద్రానికి 50 కి.మీ. దూరంలో, వరంగల్-మహదేవ్ పూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు కన్పిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు. పాండవులగుట్టల్లో ‘ఎదురుపాండవులు,గొంతెమ్మగుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీసబండ, తుపాకులగుండు, యానాదుల గుహ’లు చూడాల్సిన ప్రదేశాలు. వాటిలో ఎదురుపాండవులు దానికి కుడిపక్కన వెనకవైపు గుహలు, గొంతెమ్మగుహ, పంచపాండవుల దొనెల్లో అద్భుతమైన శిలాశ్రయచిత్రాలున్నాయి. ప్రాక్ యుగం నుండి చారిత్రకయుగం దాకా వేయబడిన రాతిచిత్రాలెన్నో అప్పటి జీవనశైలీ వైవిధ్యాల్ని కనువిందు చేస్తున్నాయి. కొన్నిచోట్ల పాతబొమ్మల మీదనే కొత్తబొమ్మలు వేసిన జాడలగుపిస్తున్నాయి. ఆరుచోట్ల వున్న చిత్రిత శిలాశ్రయాల్లో అన్నిబొమ్మలు ముదురు ఎరుపురంగుతో చిత్రించబడ్డవే. మందమైన గీతలతో చదునైన పూతలతో గీయబడిన ఈ బొమ్మల్లో శాకాహార, మాంసాహార జీవులు, మనుషుల బొమ్మలు వున్నాయి. వీటిలో జింకలు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్ళపందులు, కుందేళ్ళు, తాబేలు, పాము, చిలుక, సీతాకోకచిలుకలు, కొండెంగ, నెమలి, కప్ప,బల్లి, ఎలుగుబంటి, పెద్దపులులు, పండు, వలతో మనుషులు, పులి వంటి జంతువును చంపిన సరీసృపం వంటి పెద్ద జంతువు, కుందేళ్ళను తరుముతున్న కుక్కలు, కుక్కలు చుట్టి నిలుచున్న మనిషి, ఈనిన జింక, జింకపిల్లను నాకుతున్న దృశ్యాన్ని చూస్తున్న మనిషి, త్రిభుజాలు, త్రిశూలం, చుక్కల వంటి రేఖాకృతులు, కొన్ని శిథిలచిత్రాలు, ఇవేకాక గొంతెమ్మగుహలో చేతిగుర్తులు, యుద్ధం చేస్తున్న వీరుల బొమ్మ లున్నాయి. పంచపాండవుల గుహలో రంగులలో పంచపాండవులు, కుంతి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెండ్లి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతుల చిత్రాలున్నయి. ఈ బొమ్మలన్నింటిలో ‘ఎదురు పాండవుల’నే కొండచరియలో వేసివున్న రాతిచిత్రాలు అతి పురాతనమైనవి, అపూర్వమైనవి. ఈ చిత్రాలొకచోట 6 అడుగుల కంటె ఎత్తుగా వున్నాయి. ఈ చిత్రాలు వేసిన తీరు, శైలి, మొరటుదనం, వాటిలోని జంతు జీవజాలం అన్నింటిని పరిశీలించి కాలానుశీలన చేస్తే ఇవి మనదేశంలోని మధ్యప్రదేశ్ ‘బింబేట్కా’ గుహల్లోని రాతిచిత్రాల కన్నా ప్రాచీనమైనవని తెలుస్తుంది. World Heritage వారు చెప్తున్నవిధంగా బింబేట్కా చిత్రాలు 30 వేల యేళ్ళనాటివైతే మనపాండవుల గుట్టబొమ్మల్లో అశ్వికులు, యుద్ధ సన్నివేశాలు, ఆయుధాలు, వివిధ వాహనాలు, అలంకరణలు వంటి ఆధునికరూపాలేవీలేవు కనుక ఇవి వాటికన్నా ప్రాచీనకాలానికి చెందినవని రుజువవుతున్నది.ఒక్క పంచపాండవుల గుహల్లలో మాత్రమే వర్ణచిత్రాలున్నాయి. (అవి 12, 13 శతాబ్దాల నాటివిగా పురాశాఖ వారు అనుమానిస్తున్నారు.) భారతదేశంలో దాదాపు 2,500 చిత్రిత శిలాశ్రయాలున్న 400ల స్థావరాలు 100 శిలాచిత్రలేఖన మండలాల్లో కన్పిస్తున్నాయి. తెలుగునాట 28 చోట్ల, తెలంగాణాలో 14 తావుల్లో ఈ రాతిచిత్రాలున్నాయి. పాండవుల గుట్టల్లోని చిత్రాలు అంత్యప్రాచీన శిలాయుగం నుండి మధ్యశిలాయుగంవరకు తర్వాత చారిత్రకయుగంలో చిత్రించబడినవి. పాండవులగుట్టలో రాళ్ళను చూస్తే ‘కొలరాడో’ గుర్తొస్తుంది. రాతిచిత్రాలను చూస్తే పాండవుల గుట్ట తెలంగాణాలోని ‘చిత్రిత శిలాశ్రయాల విశ్వవిద్యాలయం’ అనిపిస్తుంది. ప్రాక్ యుగం నుండి చారిత్రయుగం దాకా మానవజీవన పరిణామాన్ని ఒకేచోట నిలుపుకున్న గుహాచిత్రాల సమూహమిది. ఈ గుట్టలమీది రాతిచిత్రాలను తొలిసారి గుర్తించింది, పురావస్తువారికి రిపోర్టు చేసింది చారిత్రకపరిశోధకులు, రచయిత డా.ఈమని శివనాగిరెడ్డిగారే. పాండవుల గుట్టల్లో అన్నీ విశేషాలే. ‘ఎదురు పాండవుల’ గుహలకు కుడిపక్కన వెనక వైపున 5 చోట్ల రాతిచిత్రాల దొనెలతో పాటు ఒకచోట అద్భుతమైన సహజసిద్దమైన అవిచ్ఛిన్న ‘శిలాతోరణం’ ఉంది. ఒక రాతిగుండులో రెండు నిలువుల ఎత్తున ఈ శిలాతోరణం ఎంతో అందంగా కనిపిస్తున్నది. గొంతెమ్మగుహ కూడా విశేషాలున్న తావు. ఇక్కడి గుహలో చేతిముద్రలు, చిత్రాలు, లిపులున్నాయి. వివిధ చిత్రితశిలాశ్రయాల్లో మాదిరిగానే ఇక్కడ ముదురు ఎరుపురంగులో (కుడి)చేతిముద్రలు ఉన్నాయి.గుహ బయట వీరుల యుద్ధసన్నివేశం చిత్రించబడివుంది. రంగు, గీతలను బట్టి ఈ బొమ్మ చారిత్రకయుగం నాటిదనిపిస్తున్నది. గుహలో ఒక రాతిగో మీద బూడిదవన్నె రంగుతో రాసిన లిపి ఉంది. అట్లాంటి రాతలే ఎరుపురంగులో పంచపాండవుల గుహలో కూడా ఉన్నాయి. లిపిని బట్టి 6,7 శతాబ్దాలనాటివని తోస్తున్నది ఆ రాతలు. పాండవుల గుట్టల్లో మరొక చారిత్రకయుగ విశేషముంది. గొంతెమ్మగుహ తూర్పున బండరాయి అంచున ఒక ‘లఘుశాసనం’ ఉంది. అది ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసనం. ఈ శాసనం గురించి పురావస్తుశాఖ వారు వివరించి రాయలేదు. కాని, ఇదే పేరుతో గల ఇట్లాంటి లఘుశాసనాలు తెలుగునాట 11చోట్ల, మహారాష్ట్రలో ఒకచోట లభించాయి. ఆరుచోట్ల ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’ అని తప్ప సంపూర్ణశాసనాలు లభ్యం కాలేదు. తక్కిన ఆరు తావుల్లో శాసనాలని చదివి తెలిసిందానిమీద చర్చోపచర్చలు చేసిన చారిత్రక పరిశోధకులు ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’ అనేది ఒక శిల్పకారుల సంఘం పేరై వుంటుందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. కాని ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’ మీద పరిశోధక గ్రంథం రాసిన ‘తెలుగు గోష్టి’ వ్యవస్థాపక అధ్యక్షులు చీమకుర్తి శేషగిరిరావు గారు ఈ ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’లు కాలాముఖశైవులై వుంటారని, వారు అప్పట్లో 6,7 శతాబ్దాలలో బౌద్ధ, జైన ఆరామ, విహార, చైత్యాలను, దేవాగారాలను ధ్వంసం చేస్తూ ‘మేం బౌద్ధ, జైన మతాలనే ప్రమాదాలకు(ఉత్పత్తి అంటే ప్రమాదమని అర్థం) పిడుగు (వజ్రం)లాంటి వాళ్ళం’ అని (కృష్ణమూర్తి ‘ వేల్పుల కథ’) వేసిన హెచ్చరిక శాసనాలై వుంటాయని తేల్చారు. దానికి వారు చూపిన ఆధారాలు సబబుగానే ఉన్నాయి. కర్నూలు సాతానికోటలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్త నివాసి లోక శీలాభిమాన – అర్జునన్ మహేశ్వర కాలాముఖ’ అని, నంద్యాల కడమల కాల్వలోని గుడిలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్త నివాసి’ అని, మహానందిలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు కాలాముఖ’ అని వుండడం వల్ల, మహబూబ్ నగర్ సంగమేశ్వరాలయంలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్త నివాసి’ అనే శాసనం వల్ల, ఇపుడు మన పాండవులగుట్ట గొంతెమ్మగుహ (బహుశః బౌద్ధుల వర్షావాసం అయివుంటుంది )లోని శాసనంలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాంతవాసి పరమ మహేశ్వర భతన్ మహాముని’ అని రాసి వుండడం వల్ల చీమకుర్తి గారి వాదమే నిజమనే సాక్ష్యం లభించినట్లైంది. ఆ శాసనంలో చెక్కబడివున్న గదలాంటిది (ఇంద్రుని వజ్రాయుధం లేదా కంటకశిల కాదు) లకులీశుని ( ఆలంపురం దేవాలయ మ్యూజియంలోని లకులీశుని విగ్రహం) చేతిలోని ఆయుధం ‘లగుడం’ వలెనె ఉంది. సున్నా గుర్తు బౌద్ధుల శూన్యవాదాన్ని సూచించే చిహ్నం అని పరిశోధకులు రాంభట్ల కృష్ణమూర్తి ‘ వేల్పుల కథ’లో రాసారు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి రేగొండలో ఉంది.సమీప జూనియర్ కళాశాల రేగొండలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పరకాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ వరంగల్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

తిరుమలగిరిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

తిరుమలగిరిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

తిరుమలగిరిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1365 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 164 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 42 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 89 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 12 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 93 హెక్టార్లు
  • బంజరు భూమి: 190 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 781 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 637 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 427 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

తిరుమలగిరిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 427 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

తిరుమలగిరిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, ప్రత్తి, మిరప

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]