వరి
| వరి | |
|---|---|
| ఒరైజా సెటైవా | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | Magnoliophyta |
| Class: | Liliopsida |
| Order: | Poales |
| Family: | పోయేసి |
| Genus: | ఒరైజా |
| జాతులు | |
|
|
భారతదేశం లో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి. వరి గింజలనుండి బియ్యం వేరుచేస్తారు. ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం.ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే. భారతదేశంలో పంటలకు ఒరైజా సటైవా ఇండికా రకపు వరి మొక్కలనే ఉపయోగిస్తారు. ఆకుమడి తయారుచేసి వరి విత్తనాలు జల్లుతారు. నారు అయిన తరువాత మళ్ళలోకి మార్పిడి చేస్తారు. వరి మొక్క ఏకవార్షికం. వరి నుండి వచ్చే బియ్యంతో అనేక రకాలైన వంటకాలు తయారు చేస్తారు. ఎండుగడ్డి, ఆకులు పశువులకు మేతగా ఉపయోగిస్తారు. ధాన్యంపై పొట్టు తీయకుండా వాటిని వేడినీటిలో ఉడికించిన తరువాత వాటికి ఆవిరి పట్టిస్తే ఉప్పుడు బియ్యంగా తయారవుతాయి. ఇడ్లీ, దోశ మొదలైన వంటలు వీటితో తయారు చేస్తారు. బియ్యపు పిండిని, బట్టల ఇస్త్రీలకు, కాలికో ముద్రణలోనూ ఉపయోగిస్తారు. కాల్చిన ఊకను ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు. తవుడు నుండి తీసిన నూనె వంటలలో ఉపయోగపడుతుంది. హంస, ఫల్గున, జయ, మసూరి, రవి, బాసుమతి మొదలైనవి స్థానికంగా పండించే కొన్ని వరి రకాలు.
విషయ సూచిక |
వరి గింజ [మార్చు]
B: Brown rice
C:Rice with germ
D: White rice with bran residue
E:Musenmai (Japanese:無洗米), "Polished and ready to boil rice", literally, non-wash rice
(1):Chaff
(2):Bran
(3):Bran residue
(4):Cereal germ
(5):Endosperm
వరిగింజ పరిమాణములో చిన్నగా ఉండి గట్టిగా ఉంటుంది. వరి గింజలో పాలు ఉత్పత్తి జరిగి, అవి గట్టి పడుటద్వారా తయారవుతుంది.
వరి గడ్డి [మార్చు]
ప్రపంచ దేశాలలో వరి [మార్చు]
| అత్యధిక వరి ఉత్పత్తిదారులు — 2005 (మిలియన్ మెట్రిక్ టన్ను) |
|
|---|---|
| 182 | |
| 137 | |
| 54 | |
| మూస:BAN | 40 |
| 36 | |
| 27 | |
| 25 | |
| 18 | |
| 15 | |
| 13 | |
| 11 | |
| World Total | 700 |
| Source: UN Food & Agriculture Organisation (FAO)[1] |
|
ప్రపంచ వరి ఉత్పాదకత[1] 1960లోని 200 మిలియన్ టన్నుల నుండి 2004లోని 600 మిలియన్ టన్నులకు చేరింది. 2004 సంవత్సరంలో వరి అత్యధికంగా పండించే దేశాలు చైనా (29%), భారతదేశం (20%) మరియు ఇండోనేషియా (9%).
ప్రపంచంలో ఉత్పత్తి అయిన వరిలో 5-6% మాత్రమే ఎగుమతి అవుతుంది. అన్నింటికన్నా ఎక్కువగా వరి ఎగుమతి చేసే దేశాలు థాయిలాండ్ (26%), వియత్నాం (15%) మరియు అమెరికా (11%). ఇండోనేషియా (14%), బంగ్లాదేశ్ (4%) మరియు బ్రెజిల్ (3%) ఎక్కువగా వరి దిగుమతి చేసుకుంటున్నాయి. వరి అత్యధికంగా పండించే దేశాలలో కంబోడియా మొదట్లో ఉన్నది. ఇక్కడి మొత్తం వ్యవసాయంలో 90 % వరినే సాగుచేస్తారు.
ఆహార పదార్ధాలు [మార్చు]
| Rice, raw పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు |
||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శక్తి 360 kcal 1510 kJ | ||||||||||
|
||||||||||
| శాతములు, అమెరికా వయోజనులకు సూచించబడిన వాటికి సాపేక్షంగా |
||||||||||
పండిన ధాన్యాన్ని మొదట మిల్లులో ఆడించి ఊకను గింజ నుండి వేరుచేస్తారు. తరువాత వరి గింజల నుండి తవుడు ను వేరుచేసి తెల్లని బియ్యాన్ని తయారుచేస్తారు. దీనిని పాలిషింగ్ అంటారు. ఇలా చేయడం వలన వరి యొక్క పోషక విలువలు కోల్పోతున్నాము. విటమిన్ బి ఎక్కువగా ఈ పై పొరలలో ఉంటుంది. దీనిలోపం మూలంగా బెరి బెరి అనే వ్యాధి సోకుతుంది.
తవుడు నుండి ఈ మధ్య కాలంలో తవుడు నూనె (Rice bran oil) తీస్తున్నారు.
బియ్యాన్ని దంచి లేదా మిల్లులో ఆడించి బియ్యపు పిండి, ఉప్పుడు బియ్యం, బియ్యపు రవ్వ, ఉప్పుడు రవ్వ లాంటివి తయారుచేస్తారు. దీనితో దోసెలు, అట్లు, ఇడ్లీలు మొదలైనవి తయారుచేస్తారు.
బియ్యాన్ని నీరు లేదా ఆవిరిలో ఉడికించి వివిధ ఆహారపదార్ధాలతో కలిపి మనం తింటాము. దీనిని తిరిగి నూనెలో గాని నెయ్యిలో గాని వేయించి బిర్యానీ, పులావు మొదలైనవి తయారుచేస్తారు.
పండించే విధానం [మార్చు]
ఆరోజుల్లో వరి పంట పండించాలంటే ..... పొలాన్ని మూడు సార్లు మడక తో దున్ని, చువరి దుక్కిలో పశువుల ఎరువును వేసి చదును చేస్తారు. నీళ్లలో కలిపి దున్నే దుక్కిని అడుసు దుక్కి అని, నీళ్లు లేకుండా మెట్ట పొలాలలో దున్నే దుక్కిని వెలి దుక్కి అని అంటారు. వెలి దుక్కికి తగుమాత్రం తేమ వుండాలి. తేమ ఎక్కువగా వుంటే దున్నరు. ఆ తేమ శాతాన్ని పదును అంటారు. అడుసు దుక్కి దున్నిన తర్వాత ఒకపెద్ద చెక్క పలకను ఎద్దులకు కట్టి అడుసులో ఒక సారి తిప్పితే పొలం అంతా చదునుగా అవుతుంది. ఆ తర్వాతి పొలం అంతా ఆకు పరచి ఆ ఆకును కాళ్లతో బురద లోనికి తొక్కుతారు. ఆకు అనగా, కానుగ, వేప, గంగ రావి, జిల్లేడు మొదలగు ఆకు తెచ్చి అడుసు లో వేసి తొక్కుకాతారు. పొలాల గట్టు మీద ఈ ఆకు చెట్లు లేనివారు అడవికి వెళ్లి కనిపించిన ఆకు కొమ్మలను కొట్టి మోపులుగా కట్టి తెచ్చి పొలంలో పరచి తొక్కుతారు. ఇది పంటకు చాల సారవంత మైన సేంద్రియ ఎరువు. తర్వాత అది వరకే నారు పోసి వుంచుకున్న వరి నారును పీకి కట్టలు కట్టలుగా కట్టి పొలంలో వరుసలుగా వేస్తారు. ఆడ కూలీలు వచ్చి నాట్లు వేస్తారు. ఈ కూలీలు నాట్లు వేస్తూ పాటలు పాడతారు. ఈ పాటలు ఒకరు ఒక నుడుగు పాడితె మిగతా వారు కోరస్ గా పాడు తారు. ఆ దృశ్యం చూడ ముచ్చటగా, ఆ పాటలు విన సొంపుగా ఎంతో ఆహ్లాద కరంగా వుంటుంది. మద్యాహ్న సమయానికి పొలం యజమాని ఇంటి నుండి కూలీలకు (అన్నం) సంగటి వస్తుంది. అప్పుడు కూలీలు బయటికి వచ్చి తమ బురద కాళ్లను కడుక్కొని చెట్టు కింద కూర్చొని చేతిలో సంగటి ముద్దను వేయించుకొని తింటారు. కొందరు చిన్న పిల్ల లున్న తల్లులు రెండు ముద్దల సంగటిని కొంగులో వేసుకుని మూట గట్టుకొని తాము తెచ్చుకున్న గిన్నెలో కూర పోయించు కొని ఇంటి కెళ్లి తమ పిల్లలకు అన్నం పెట్టి, చంటి పిల్లలుంటే వారికి పాలిచ్చి తిరిగి పనిలోకి వస్తారు. పొద్దు పోయిందాక వారు పని చేసేవారు.
వరి నాటిన నాలుగు వారాలకు కలుపు తీయాలి. ఇది కూడ బురదలో పనే. ఆడవారి పనే. తెల్ల వారి సద్దులు తాగి పనిలోకి దిగితే మద్యాహ్నం ఒంటిగంటకు సంగటి తిని అరగంట అలసట తీసుకుని మల్లీ పనిలోకి దిగుతారు. కలుపు తీత లో కూడ వీరు పాటలు పాడుతారు. వరి నాట్లు, కలుపు తీయడం ఈ రెండు పనులలోనె ఈ పాటల కార్యక్రమం వుంటుంది. మిగతా ఏ పనిలోను ఈ కోరస్ పాటలుండవు. ఈపాటలు వారికి పనిలోని అలసటను మరిపించి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి.ఆ రోజుల్లో ఈ కూలివారికి డబ్బురూపంలో కాక వస్తు రూపంలో కూలి ఇచ్చేవారు. అనగా ఒక కూలికి రెండు బళ్ళల వడ్లు ఇచ్చేవారు. ఆతర్వాత కొంత కాలానికి డబ్బులను కూలీగా ఇచ్చే పద్దతి వచ్చింది. ఏ పనికైనా కూలిగా డబ్బులు తీసుకున్నా వరి పంటకు సంబందించిన పనికి మాత్రము... వడ్లను మాత్రమే కూలిగా తీసుకునేవారు. కొంత కాలానికి అన్ని పనులకు డబ్బులే కూలిగా ఇచ్చే పద్దతి వచ్చింది. మెదట్లో ఒక మనిషి కి ఒక రోజుకు కూలి అర్థరూపాయి గా వుండేది. ఆ తర్వాత.... తర్వాత అది పెరిగి ఈ రోజుకి అనగా 2011 వ సంవత్సరానికి 150 రూపాయలైంది. పని గంటలు మాత్రము తగ్గినాయి. అప్పట్లో పొద్దున ఎనిమిది గంటలకు పనిలోకి వస్తే సాయంత్రం పొద్దు పోయిందాక పని చేసే వారి. ఇప్పుడు పొద్దున 8 గంటలకు పనిలోకి దిగి మద్యాహ్నం భోజన సమయానికి అనగా ఒంటి గంటకు దిగి పోతారు.
శ్రీ వరి [మార్చు]
"శ్రీ వరి " అనేది వరి సాగులొ ఒక రకమైన సాగు పద్దతి .
మూలాలు [మార్చు]
- ↑ all figures from UNCTAD 1998–2002 and the International Rice Research Institute 2005 గణాంకాల ప్రకారం