Coordinates: 13°23′11″N 77°42′03″E / 13.3862588°N 77.7009344°E / 13.3862588; 77.7009344

నంది హిల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంది హిల్స్
నంది బెట్ట
నందిదుర్గ
పర్యాటక ప్రదేశం
నంది బెట్టనుండి సూర్యోదయం
నంది బెట్టనుండి సూర్యోదయం
నంది హిల్స్ is located in Karnataka
నంది హిల్స్
కర్ణాటక లో స్థానం
Coordinates: 13°23′11″N 77°42′03″E / 13.3862588°N 77.7009344°E / 13.3862588; 77.7009344
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాచిక్కబళ్లాపూర్
Elevation
1,478 మీ (4,849 అ.)
Time zoneUTC+5:30 (IST)
సమీప నగరంబెంగుళూరు

నంది కొండలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చేరువలో ఉన్న చిక్కబళ్ళాపూర్ జిల్లాలో ఉన్నాయి. ఈ కొండలు ఒక అందమైన పర్వత ప్రాంతం. ఈ కొండలపై నుండి సూర్యోదయాన్ని తిలకించడం ఓ రకమైన దివ్యమైన అనుభూతికి గురి చేస్తుంది. కొండపైనుండి చూస్తే మేఘాలపై నుండి చూస్తున్నట్టు ఉంటుంది. ఈ దట్టమైన మేఘాలపైన సూర్యోదయాన్ని చూడటం ఓ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూడాలంటే ఉదయం 6 గంటలలోపు అక్కడకు చేరుకోవాలి. పార్కింగ్ సదుపాయం ఉంది. వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొబైలు సిగ్నల్ దొరకడం కొంచెం కష్టమే. పురాతన కోట కట్టడాలను గమనించవచ్చు. కోట లోపలికి, సూర్యోదయాన్ని చూడడానికి ప్రవేశించాలంటే ప్రవేశ రుసుము చెల్లించాలి.[1]

చరిత్ర[మార్చు]

నంది కొండలపైన

ఈ ప్రాంతాన్ని టిప్పు సుల్తాన్ కట్టించాడు. ఈ కొండల మూలాలు అర్కవతి నది, పొన్నైయర్ నది, పాలర్ నది, పెన్నా నదిగా ఉండేవని చెప్పుకునేవారు..[2] ఈ కొండల గురించి అనేక చరిత్రలు ఉన్నాయి. చోళ రాజుల కాలంలో ఈ కొండలని ఆనందగిరిగా పిలిచేవారు. టిప్పు సుల్తాన్ కాలంలో ఈ కొండలని నందిదుర్గ అని కూడా పిలిచేవారు. ఈ కొండ పైన 1300 సంవత్సరాల పురాతన ద్రవిడియన్లు నిర్మించిన విదంగా నంది ఆలయం కట్టడం ఉంది కనుక ఈ కొండలను నంది హిల్స్ అనే పిలిచేవారని చరిత్ర చెబుతోంది.

ఈ కొండ క్రింద ఉన్న గ్రామము నంది గ్రామము. ఆ గ్రామమునందు సోమేశ్వరాలయము ఉంది.ఇక్కడ సంస్కృత శ్లోకాత్మకమైన శాసన మొకటి ఉంది. టి.యల్ నరసింహరావు చే పరిష్కృతమైన ఈ శాసనమును మద్రాసు ఓరియంటల్ మాన్యుస్క్రిప్టు లైబ్రరీ 1949లో ప్రచురించారు. (Bulletin of the Govt.Oriental Manuscripts Library, Madras. Vol 2 Page 41) ఈ శాసనమునందు కృష్ణరాజు అనుప్రభువు యొక్క ప్రశంస ఉంది. ఇందులో అష్టదిగ్గజాల ప్రశంస ఉంది. ఈ శాసనపు 11వ శ్లోకములో శాసనకాలము పేర్కొనబడింది. ఇందు సాంకేతికముగా పేర్కొనబడిన కలిశకము 3486, అనగా సా.శ.1527. అందువలన శాసనమందు పేర్కొనబడిన కృష్ణరాజు శ్రీకృష్ణదేవరాయలు అనవచ్చును. ఇదే సం.లో రాయలు తిప్పలూరును అష్టదిగ్గజ కవీశ్వరులకు సర్వాగ్రహారముగా ఇచ్చెను. ఆ సంవత్సరమునందే అష్టదిగ్గజ కవుల ప్రశంస మైసూరు రాష్ట్రమందుకల నందిదుర్గ క్షేత్రమును సోమశంకరదేవునకు భూదానము చేసిన సమయమున కృష్ణదేవరాయలు ప్రత్యేకముగా పేర్కొనెను.

దారి[మార్చు]

ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్ళాపూర్ జిల్లాలోని నంది అనే ఊరినుంచి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.

మూలాలు[మార్చు]

  1. Garg, Santosh Kumar (1999). International and interstate river water disputes. Laxmi Publications. pp. 7–8. ISBN 978-81-7008-068-8. Retrieved 28 July 2019.
  2. "Nandi Hills". 28 July 2019. Archived from the original on 2019-07-28.