భారతీయ క్రాంతి దళ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ క్రాంతి దళ్
స్థాపకులుచరణ్ సింగ్
స్థాపన తేదీ1967 అక్టోబరు
రంగు(లు)ఆకుపచ్చ
Election symbol

భారతీయ క్రాంతి దళ్ అనేది ఒక రాజకీయ పార్టీ. దీనిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ స్థాపించాడు. 1967 అక్టోబరులో లక్నోలో జరిగిన సమావేశంలో పార్టీ స్థాపించబడింది.[1] 1977 సాధారణ ఎన్నికల తరువాత, భారతీయ క్రాంతి దళ్ వారసుడు, భారతీయ లోక్ దళ్ జనతా పార్టీలో విలీనం చేయబడింది.[2]

హుమాయున్ కబీర్ ఢిల్లీలో కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో 1967 ఏప్రిల్ 9న భారతీయ క్రాంతి దళ్ ఏర్పాటుకు బీజాలు పడ్డాయి.[3] 1967 నవంబరులో భారతీయ క్రాంతి దళ్ ఇండోర్ సమావేశంలో, మహామాయ ప్రసాద్ సిన్హా పార్టీ మొదటి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[3]

కూటమి[మార్చు]

1967లో ఈ పార్టీ సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, జనసంఘ్‌లతో కలిసి సంయుక్త విధాయక్ దళ్ కూటమిని ఏర్పాటుచేసింది.

మూలాలు[మార్చు]

  1. Wallace, Paul. India: The Dispersion of Political Power Paul Wallace, in Asian Survey, Vol. 8, No. 2, A Survey of Asia in 1967: Part II. (Feb., 1968), pp. 87-96.
  2. E.M.S. Namboodiripad. The Communist Party in Kerala — Six Decades of Struggle and Advance. New Delhi: National Book Centre, 1994. p. 265-266
  3. 3.0 3.1 Brass, Paul R. (2014). An Indian Political Life: Charan Singh and Congress Politics, 1967 to 1987 - Vol.3 (The Politics of Northern India) (in ఇంగ్లీష్). Sage India. ISBN 978-9351500322.