శివసేన
| శివసేన | |
|---|---|
| నాయకత్వము | బాలాసాహెబ్ థాకరే |
| స్థాపితము | 1966 |
| ముఖ్య కార్యాలయము | సేనా భవన్, ముంబయి |
| కూటమి | జాతీయ ప్రజాస్వామ్య కూటమి |
| సిద్ధాంతము | {{{ideology}}} |
| ప్రచురణలు | {{{publication}}} |
| వెబ్ సైట్ | www.shivsena.org |
| చూడండి | భారత రాజకీయ వ్యవస్థ |
శివసేన (మరాఠీ: शिव सेना Śiv Senā, అంటే శివ్ సైన్యం అని అర్థం, ఈ పేరు శివాజీని సూచించింది) అనేది భారతదేశంలో జూన్ 19, 1966లో బాలాసాహెబ్ థాకరే చేత ప్రారంభించబడిన ఒక తీవ్ర-సంప్రదాయవాద రాజకీయ పార్టీ. దీనికి ప్రస్తుతం థాకరే కుమారుడు ఉద్ధవ్ థాకరే అధిపతి. గతంలో బాంబే, ఇప్పుడు ముంబయిలో, మహారాష్ట్రలో [[మరాఠీ]ల ఆధిపత్యానికి విస్తృత మద్దతు ఇచ్చిన ఒక ఉద్యమం నుంచి ఈ పార్టీ ఉద్భవించింది. మహారాష్ట్ర మరాఠీ వర్గానికి చెందినదని మరియు అందువలన మిగిలిన భారతీయ రాష్ట్రాలకు చెందిన వలసదారుల కంటే వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే తన సిద్ధాంతం ద్వారా 60వ దశకంలో ఈ పార్టీ మరాఠీ వర్గంలో బలమైన కోటను నిర్మించుకుంది. పార్టీ యొక్క ప్రధాన స్థావరం ఇప్పటికి కూడా మహారాష్ట్రకు మాత్రమే పరిమితమై ఉన్నప్పటికీ, ఇది మిగిలిన భారతీయ రాష్ట్రాలకు కూడా తన ఉనికిని విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే క్రమక్రమంగా పార్టీ మరాఠీ-అనుకూల సిద్ధాంతానికి మాత్రమే కట్టుబడి ఉండాలనే భావన నుంచి ఒక విస్తృతమైన హిందూ జాతీయవాద అజెండా[citation needed]కు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది, దీనిలో భాగంగా ఇది భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. పలు సందర్భాల్లో పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది, అంతేకాకుండా 1998-2004 మధ్యకాలంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి మంత్రివర్గంలో ఒక సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా కూడా ఉంది. శివసేన పార్టీకి చెందిన సభ్యులను శివసైనికులుగా సూచిస్తారు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] మూలాలు
1947లో భారతదేశ స్వాతంత్ర్యం తరువాత, వలసరాజ్యాల శకం నుంచి క్రమక్రమంగా ప్రాంతీయ పాలక మండలాలు మారాయి, భాషాపరమైన సరిహద్దులతో రాష్ట్రాలు సృష్టించబడ్డాయి. బాంబే ప్రెసిడెన్సీలో మరాఠీ-మాట్లాడే పౌరులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక ప్రసిద్ధ పోరాటం ప్రారంభమైంది. 1960లో గుజరాత్ మరియు మహారాష్ట్ర అనే రెండు భాషా రాష్ట్రాలుగా బాంబే ప్రెసిడెన్సీ విభజించబడింది. అంతేకాకుండా, గతంలోని హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠీ-మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో చేర్చారు. అనేక విధాలుగా భారతదేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబయి మహారాష్ట్ర రాజధానిగా మారింది. ఒకవైపు గుజరాతీ మరియు మార్వారీ వర్గాలకు చెందిన పౌరులకు నగరంలో ఎక్కువ భాగం పరిశ్రమలు మరియు వ్యాపార సంస్థలు ఉన్నాయి.[1] మరోవైపు, నగరానికి దక్షిణ భారత వలసదారుల రాక నిరంతరం పెరుగుతూ, ఇలా వచ్చిన వారికి ఉద్యోగాలు దక్కుతున్నాయి.
1960లో మార్మిక్ వారపత్రికలో ముంబాయికి చెందిన కార్టూనిస్ట్ బాలాసాహెబ్ థాకరే వ్యంగ్య చిత్రాలు ప్రచురించడం మొదలుపెట్టాడు. ఈ పత్రిక ద్వారా ఆయన వలస-వ్యతిరేక భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడు. జూన్ 19, 1966న, థాకరే శివసేన పేరుతో ఒక రాజకీయ సంస్థను స్థాపించాడు. దీనిని ప్రారంభించిన సమయంలో, శివసేన రాజకీయ పార్టీ కాదని స్పష్టం చేశాడు.[2]
[మార్చు] ప్రారంభ సంవత్సరాలు
శివసేన యొక్క రాజకీయ విధానం భూమిపుత్ర (గిరిపుత్రులు లేదా భూమిపుత్రులు) సిద్ధాంతం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది, మరాఠీయులకు మహారాష్ట్ర స్వతఃసిద్ధమనే భావన దీని ప్రధాన రాజకీయ విధానంగా ఉంది. తాము బయటివారిగా భావించే వ్యక్తులు తమ సొంత రాష్ట్రంలో స్థానిక మరాఠీయులను తక్కువ చేసి చూడటంపై ఆగ్రహ భావన నుంచి శివసేన ఉద్భవించింది.[3]
శివసేన ముఖ్యంగా అసంతృప్తితో ఉన్నవారిని, తరచుగా నిరుద్యోగ మరాఠీ యువతను భారీ సంఖ్యలో ఆకర్షించింది, వీరందరూ థాకరే వలస-వ్యతిరేక వాగ్ధాటికి ఆకర్షితులయ్యారు. దక్షిణ భారతీయులపై అనేక దాడులు చేయడం, దక్షిణాదివారి రెస్టారెంట్లపై విధ్వంసక చర్యలకు పాల్పడటం, మరాఠీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని యాజమాన్యాలపై ఒత్తిళ్లు తీసుకురావడం తదితర కార్యకలాపాల్లో శివసేన కార్యకర్తలకు ప్రమేయం ఉంది.[4]
ప్రారంభ సంవత్సరాల్లో శివసేన యొక్క ఇతర ప్రధాన కార్యకలాపాల్లో తరచుగా కమ్యూనిస్ట్ వ్యాపార సంఘాలకు వ్యతిరేకంగా పోరాడటం కూడా ఒకటి. శివసేనను స్థాపించక ముందు, భారతీయ కమ్యూనిస్టు పార్టీ ముంబయి కార్మిక రాజకీయాల్లో ఆధిపత్య పాత్ర పోషించింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ లోపల వ్యక్తులు ఈ కొత్త సంస్థ వామపక్ష వ్యాపార సంఘాల ప్రభావాన్ని బలహీనపరుస్తుందని భావించి శివసేనకు మద్దతు ఇచ్చారు. ప్రారంభమైన కొంతకాలానికే శివసేన కార్యకర్తలు వామపక్ష వ్యాపార సంఘాల కార్యకర్తలతో హింసాత్మక ఘర్షణలకు దిగారు. 1970లో CPIకి చెందిన దాదర్ శాసనసభ్యుడు కృష్ణ దేశాయ్ హత్యకు గురైనాడు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఈ హత్యకు శివసన కారణమని ఆరోపించింది, థాకరేను ఈ హత్యకు బాధ్యుడిగా చిత్రీకరించింది.
[మార్చు] 1995 ఎన్నికలు
శివసేన-భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి 1995 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత, శివసేన తన యొక్క వ్యవస్థలో మార్పులు చేపట్టింది. ఎన్నికల తరువాత ఆరు నెలలకు ముంబయిలో 'శివసేన రాజ్యప్రముఖ్ పరిష్యత్ సదస్సు' జరిగింది. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో స్థానిక పార్టీ నేతలు మరియు పార్టీలోని వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఒక భాగస్వామ్య పార్టీగా కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు పార్టీ వ్యవస్థను నవీకరించేందుకు ఈ సమావేశం ఉద్దేశించబడింది.ఈ సమావేశంలోనే బాంబేకు ముంబయిగా పేరు మార్చాలని నిర్ణయించారు.[5]
[మార్చు] హిందుత్వవైపు పయనం, భారతీయ జనతా పార్టీతో పొత్తు
తన ప్రధాన గిరిపుత్రుల సిద్ధాంతం బలహీనపడుతుండటంతో, సేన తన దృష్టిని హిందుత్వ భావనవైపు మరల్చడం 1970వ దశకంలో ప్రారంభమైంది.[4] హిందుత్వవైపు మార్గాన్ని మార్చుకున్న తరువాత, థాకరే ముస్లింలు మరియు పొరుగునున్న పాకిస్తాన్పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
భారతీయ జనతా పార్టీ (BJP)తో కలిసి సంకీర్ణంలో 1995-99 వరకు శివసేన రాష్ట్రాన్ని పాలించింది. 1999 నుంచి భాజపాతో కలిసి సేన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉంది. శివసేన-భాజపా సంయుక్తంగా ముంబాయి మహా నగరపాలక సంస్థ్ను పాలిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా శివసేన యొక్క బలమైన ఓటు బ్యాంకులు ముంబయి మరియు కొంకణ్ తీర ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే, 2004 లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ఈ ఎన్నికల్లో శివసేన రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ముంబయిలో పరాజయాలు చవిచూసింది.
[మార్చు] రాజ్ థాకరే చీలిక
జులై 2005లో, నారాయణ్ రాణేను పార్టీ నుంచి బహిష్కరించారు, అయితే ఈ పరిణామం పార్టీలో అంతర్గత వివాదాన్ని రగిలిచింది. అదే ఏడాది డిసెంబరులో బాల్ థాకరే సోదరుడి కుమారుడు రాజ్ థాకరే పార్టీని విడిచిపెట్టాడు.[6] రాజ్ థాకరే తరువాత మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (MNS) పేరుతో కొత్త పార్టీని స్థాపించాడు. చీలిక తరువాత, రెండు సేనల కార్యకర్తల మధ్య పలు సందర్భాల్లో ఘర్షణలు జరిగాయి.
MNS శివసేన నుంచి విడిపోయిన పార్టీ అయినప్పటికీ, ఆ పార్టీ కూడా ఇప్పటికీ హిందుత్వ మరియు భూమిపుత్ర సిద్ధాంతాల ఆధారంగానే కార్యకలాపాలు సాగిస్తోంది. శివాజీ పార్కులోని ఒక సమావేశ మందిరంలో పార్టీ ఆవిష్కరణ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ హిందుత్వకు ఏం జరుగుతుందో చూసేందుకు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని పేర్కొన్నారు.[7] అంతేకాకుండా ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందుత్వ వంటి అంశాలపై పార్టీ యొక్క వైఖరిని, మహారాష్ట్ర అభివృద్ధిపై తమ అజెండాను, పార్టీ జెండాలో రంగుల యొక్క ప్రాధాన్యతను మార్చి 19 బహిరంగ సమావేశంలో విశదీకరిస్తానని చెప్పాడు.[8]
రాజ్ థాకరే తననితాను భారత జాతీయవాదిగా పరిగణించుకుంటాడు (ప్రాంతీయవాదిని మాత్రమే కాదని), కాంగ్రెస్కు రెండు ముఖాలు ఉన్నాయని ఆయన పేర్కొంటాడు.[9]
[మార్చు] పార్టీ నిర్మాణం
పార్టీ ప్రముఖ్ (అధినేత) బాలాసాహెబ్ థాకరే అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటాడు, తాను 1995 నుంచి 1999 వరకు సేనా-భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఒక రిమోట్ కంట్రోల్ మాదిరిగా పనిచేస్తూ నడిపించానని ఒక సందర్భంలో ఆయన పేర్కొన్నాడు. శివసేన కార్యకర్తలు మరియు సభ్యులు తమనితాము శివ సైనికులు గా పిలుచుకుంటారు, వీరు పార్టీలో ఎక్కువగా కిందిస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఇటీవల సంవత్సరాల్లో, థాకరే పార్టీ యొక్క రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు, ప్రస్తుతం పార్టీకి ఆయన చిన్న కుమారుడు ఉద్ధవ్ థాకరే నేతృత్వం వహిస్తున్నాడు.
1976 నుంచి సేనకు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ముంబయిలోని దాదర్ ప్రాంతంలో ఉన్న సేనా భవన్ను ఇటీవల కొత్త మెరుగులు దిద్దారు.[10] సేన యొక్క శాఖలు మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా విస్తరించివున్నాయి, ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రదేశాల్లో కూడా దీనికి శాఖలు ఉన్నాయి, స్థానిక సమస్యలు ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని నగరాలు లేదా పట్టణాల్లో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి.[4]
[మార్చు] ఎన్నికల ప్రదర్శన
| ఎన్నికలు | అభ్యర్థులు | విజేతలు | ఓట్లు | మూలం |
|---|---|---|---|---|
| 1971 పార్లమెంట్ | 5 | 227468 | [11] | |
| 1980 పార్లమెంట్ | 2 | 129351 | [12] | |
| 1989 పార్లమెంట్ | 3 | 1 | 339426 | [13] |
| 1989 గోవా అసెంబ్లీ | 6 | 4960 | [14] | |
| 1991 పార్లమెంట్ | 22 | 4 | 2208712 | [15] |
| 1993 మధ్యప్రదేశ్ అసెంబ్లీ | 88 | 75783 | [16] | |
| 1996 పార్లమెంట్ | 132 | 15 | 4989994 | [17] |
| 1996 హర్యానా అసెంబ్లీ | 17 | 6700 | [18] | |
| 1997 పంజాబ్ అసెంబ్లీ | 3 | 719 | [19] | |
| 1998 పార్లమెంట్ | 79 | 6 | 6528566 | [20] |
| 1998 ఢిల్లీ అసెంబ్లీ | 32 | 9395 | [21] | |
| 1998 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ | 6 | 2827 | [22] | |
| 1999 పార్లమెంట్ | 63 | 15 | 5672412 | [23] |
| 1999 గోవా అసెంబ్లీ | 14 | 5987 | [24] | |
| 2000 ఒరిస్సా అసెంబ్లీ | 16 | 18794 | [25] | |
| 2001 కేరళ అసెంబ్లీ | 1 | 279 | [26] | |
| 2002 గోవా అసెంబ్లీ | 15 | [27] | ||
| 2004 పార్లమెంట్ | 56 | 12 | 7056255 | [28] |
| 2009 పార్లమెంట్ | 22 | 11 | 6828382 | [29] |
[మార్చు] ఇటీవల ఎన్నికల విజయాలు
ఫిబ్రవరి 2007లో మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన విజయాలు సాధించింది, రాష్ట్రంలో తన భాగస్వామి భారతీయ జనతా పార్టీతో కలిసి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్లో అధికారాన్ని దక్కించుకొని మరో ఐదేళ్లపాటు అధికారంలోకి వచ్చింది.[30] తమ ఓటు బ్యాంకులో ప్రధానమైన మహారాష్ట్ర పౌరులకు ప్రాధాన్యత ఇస్తామనే నినాదంతోనే వారు ఈ విజయాన్ని సాధించారు. ఈ విజయం అనేక విధాలుగా చిరస్మరణీయంగా నిలిచింది. 2012నాటికి, అంటే వచ్చే BMC ఎన్నికలు జరిగే సమయానికి, శివసేనకు ముంబయి మహానగరాన్ని నిరవధికంగా 20 ఏళ్లు పాలించిన ఘనత దక్కుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షించిన జూనియర్ థాకరేకు ఇది ఉపశమనం కలిగించింది.[31]
సేనా నేతృత్వంలోని కూటమి గత రెండేళ్లకాలంలో జరిగిన అన్ని అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయి, మొత్తం 227 స్థానాలకుగాను ఈ కూటమికి 111 స్థానాలు మాత్రమే దక్కాయి. ప్రకటించిన 226 స్థానాల ఎన్నికల ఫలితాల్లో, శివసేనకు 83 సీట్లురాగా, BJPకి 28 సీట్లు వచ్చాయి, వామపక్ష ప్రత్యర్థులు, భారత జాతీయ కాంగ్రెస్ 71 సీట్లు గెలుచుకున్నాయి, ఇతర ప్రత్యర్థి పార్టీల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకోగా, MNS 7 స్థానాల్లో విజయం సాధించింది.[30][31]
[మార్చు] పని
[మార్చు] మహారాష్ట్రీయులకు ప్రయోజనాలు కల్పించామని ఉద్ఘాటనలు
ముంబయిలో మరాఠీ మనుస్ (మరాఠీయులు) పార్టీ కారణంగా లబ్ది పొందారని సేన మద్దతుదారులు పేర్కొంటారు,[32] ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో మరాఠీయులకు లబ్ది చేకూరిందని వారు చెబుతారు.[33]
[మార్చు] ధారవి విముక్తి
ఆసియాలో అతిపెద్ద మురికివాడగా పరిగణించబడుతున్న, ముంబయిలోని ధారవి ప్రాంతంలో ఉండే 500,000 మంది మురికివాడల ప్రజలకు విముక్తి కల్పించడంలో తాము కీలకపాత్ర పోషించామని శివసేన ఉద్ఘాటిస్తుంది.[34] అయితే, మురికివాడల ప్రజలకు ఉచిత గృహాలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ విధానం దశాబ్దం క్రితం శివసేన-BJP ప్రభుత్వం దానిని ప్రవేశపెట్టినప్పటి నుంచి వివాదంలో చిక్కుకొని ఉంది.[35][36]
[మార్చు] మౌలిక సదుపాయాల అభివృద్ధి
మహారాష్ట్రలో, ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబయిలో, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి శివసేన క్రియాశీలకంగా ప్రయత్నిస్తుంది. ముంబయిలో 40 వంతెనలు మరియు ముంబయి-పూణే ఎక్స్ప్రెస్వే శివసేన పాలనలో నిర్మించబడ్డాయి, ఈ చర్యలు ముంబయిలో గణనీయమైన స్థాయిలో మౌలిక సదుపాయాల వృద్ధికి ఊతం ఇచ్చాయి. గతంలో అధికారంలో ఉన్న శివసేన-BJP ప్రభుత్వం ఈ సమస్యలకు సత్వరం స్పందించగా, తరువాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు ముంబయి రవాణా సమస్యలను విస్మరించినట్లు విమర్శలు మూటగట్టుకున్నాయి. విస్తృత రోడ్డు పథకాలు ప్రారంభించడం ద్వారా శివసేన స్పష్టంగా ప్రజా రవాణాకు ప్రైవేట్, మోటారు రవాణాకు ప్రాధాన్యత ఇచ్చిందనే అభిప్రాయం ఒక స్థానిక వార్తాపత్రికలో ప్రచురించబడింది. కేవలం తొమ్మిది శాతం మంది నగర ప్రయాణికులు మాత్రమే ప్రైవేట్ రవాణఆను ఉపయోగిస్తారని సూచిస్తూ వాస్తవానికి విమర్శకులు మాత్రమే ఈ విధానాన్ని ఆక్షేపిస్తారని, ఈ నివేదిక పేర్కొంది.[37]
అయితే ఈ చర్యలు భారతదేశంలో పార్టీకి ప్రాచుర్యం పెరగడానికి కీలకమైన అంశాలుగా మారాయి, మరింత అభివృద్ధికి సంబంధించిన హామీలు శివసేన ప్రచారాలకు ఊతం ఇచ్చాయి.
[మార్చు] ఇతరాలు
జులై 14, 2008న జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలోని కతువాలో జరిగిన హింసాకాండలో శివసేన ప్రమేయం ఉంది, జమ్మూ నగరంవైపుకు వెళుతున్న వారిని సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళానికి చెందిన సిబ్బంది అడ్డుకున్నప్పుడు ఈ హింసాకాండ జరిగింది.[38] హిందూ ఆలయ బోర్డుకు భూమిని అప్పగించడం లేదని కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా సేన నిరసన ప్రదర్శన చేపట్టింది, కాశ్మీర్ చరిత్రలో అతిపెద్ద వివాదాల్లో ఒకటి ఈ ప్రతిపాదన ద్వారా సృష్టించబడింది, ఈ నిర్ణయం ఆగ్రహం మరియు భౌగోళిక బలహీనత భయాలను రగిలించింది. శివసేన ఈ సందర్భంగా 1987 తరువాత మొదటిసారి ఒక దళాన్ని తయారు చేసింది, 1980వ దశకంలో తిరుగుబాటు సందర్భంగా 1987లో పంజాబ్ రాష్ట్రంలో నైతిక మద్దతు కార్యకలాపాలు పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో శివసేనకు చెందిన 125 మంది కార్యకర్తలు పాలుపంచుకున్నారు.[39] నగరం యొక్క ప్రధాన కూడలి లాల్ చౌక్లో భారత పతకాన్ని ఎగరవేసేందుకు 2004లో గ్రూపు ఈ దళాన్ని శ్రీనగర్కు పంపాలని భావించింది.[40] అదే ఏడాది, శివసేన ఢిల్లీలో పాకిస్థాన్ మరియు ఇండియా జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్కు అవాంతరం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది.[41] భారతదేశం న్యాయబద్ధంగా ఒక హిందూ దేశమని శివసేన భావిస్తుంది, ఈ హక్కును కాపాడేందుకు తమ కార్యకర్తలు ప్రాణత్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని శివసేన పేర్కొంది.[38]
[మార్చు] వివాదం
[మార్చు] భూమిపుత్ర ప్రచారం
ప్రారంభ సంవత్సరాల్లో, సేన సందర్భోచితంగా భూమిపుత్రుల సిద్ధాంతంతో ఇతర భారతీయ వర్గాలకు చెందిన పౌరులపై హింసాకాండకు మరియు బెదిరింపులకు పాల్పడింది. సేన ప్రారంభ సంవత్సరాల్లో, పార్టీ యొక్క విస్తృతంగా పంపిణీ చేయబడే మరాఠీ-వార పత్రిక మార్మిక్ ముంబయి మహారాష్ట్రీయన్లలో వలస-వ్యతిరేక భావాన్ని రెచ్చగొట్టేందుకు ఒక ప్రధాన సాధనంగా ఉపయోగపడింది.[42] ఉచిత ప్రెస్ జర్నల్కు కార్టూనిస్ట్గా ఉన్నప్పుడు థాకరే మొదట దక్షిణాది భారతీయుల సంఖ్య పెరుగుతుండటాన్ని లక్ష్యంగా చేసుకొని "లుంగీ హటావో పుంగీ బజావో" (దక్షిణ భారతదేశంలో సంప్రదాయ వస్త్రధారణను సూచిస్తూ లుంగీ, అనే మరాఠీ పదాన్ని ఇది సూచిస్తుంది),[4] మరియు "యెండు గుండు " (దక్షిణ భారతదేశంలో ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలను రెచ్చగొట్టే వర్ణన) వంటి నినాదాలు సృష్టించారు.[43] ఈ కాలంలో, శివసైనికులు ముంబయిలో బాగా ప్రాచుర్యం పొందుతున్న దక్షిణ భారతీయులకు చెందిన ఉడిపి రెస్టారెంట్లపై వరుసగా దాడులు చేశారు.[42] అదే విధంగా, థాకరే తరువాత గుజరాతీయులు, మార్వారీలు, బీహారీయులు మరియు ఉత్తరప్రదేశ్ ('UPites') వంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముస్లింలను తన ప్రసంగాల్లో లక్ష్యంగా చేసుకున్నారు.[44] ఇదిలా ఉంటే, థాకరే మహారాష్ట్రీయులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రాధాన్యత కల్పించకపోతే దాడులు చేస్తామని స్థానిక పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తలను బెదిరించాడు.
[మార్చు] పార్టీ హింసాకాండ
తన సిద్ధాంతాలను ప్రచారం చేసుకునేందుకు మరియు తన సిద్ధాంతాలను వ్యతిరేకించినవారిపై దాడి చేసేందుకు రాజకీయ హింసాకాండను ఉపయోగించినట్లు శివసేన ఆరోపణలు ఎదుర్కొంది. ఈ కారణంగా, దీనిని కొన్నిసార్లు తీవ్రవాద అతిసంప్రదాయవాద గ్రూపుగా వర్ణిస్తుంటారు.
1970వ దశకంలో, భారతీయ కమ్యూనిస్టు పార్టీ (CPI)కు చెందిన సెంట్రల్ ముంబయి పొరుగున ఉన్న పారెల్ శాసనసభ సభ్యుడి (MLA) హత్యకు శివసేన కార్యకర్తలు బాధ్యులని ఆరోపణలు వచ్చాయి. అయితే, దాడి చేసినవారిపై హత్యా ఆరోపణలు నిరూపించబడలేదు.[45] ఫిబ్రవరి 8, 2006న, సేన కార్యకర్తలు, సేన యొక్క విద్యార్థి విభాగం నేతృత్వంలో, జీ టివి ఛానల్పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి, ఈ దాడిలో కార్యాలయంలో లూఠీతోపాటు, విధ్వంసం జరిగింది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో ఛానల్ నేతృత్వంలో జరిగిన ఒక పురస్కార వేడుక సందర్భంగా వ్యంగ్యాత్మక నాటిక 'కాకా మాలా వచ్వా' (అంకుల్, నన్ను కాపాడండి) పేరుతో ప్రసారమైంది, దీనికి ప్రతిస్పందనగా ఈ దాడి జరిగింది. థాకరే కుటుంబంలో అధికార పోట్లాటపై కారణంగానే కొంతకాలం క్రితం థాకరే సోదరుడి కుమారుడు రాజ్ థాకరే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు ఈ నాటికలో వ్యంగ్య వ్యాఖ్యలు చేయబడ్డాయి.[46]
ముంబయిలో, మహారాష్ట్రేతరులపై వ్యతిరేక ప్రచారంతోపాటు, పశ్చిమ దేశాల ప్రభావంతో హిందుత్వ నాశనం అవుతుందని భావిస్తూ, దీనిపై కూడా శివసేన హింసాత్మక కార్యకలాపాలు, నిరసనలు చేపట్టింది. శివసేన పార్టీ ప్రమేయంతో జరిగిన కొన్ని నిరసనలు, అడ్డగింతలు, మార్కెట్ మూసివేతలు మరియు సమ్మెలు కొన్నిసార్లు హింసాత్మక ఘర్షణలు మరియు అల్లర్లుగా కూడా మారాయి. ఉదాహరణకు, వాలెంటైన్స్ దినం సందర్భంగా బహుమతులు విక్రయిస్తున్న దుకాణాలపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు, యువతపై పశ్చిమ దేశాల అసభ్యకర ప్రభావాల్లో ఇది కూడా భాగమని ఆరోపిస్తూ శివసేన కార్యకర్తలు ఈ చర్యకు దిగారు.[47] ఇదే విధంగా, 1998లో, శివ సైనికులు ముంబయిలో దర్శకురాలు దీపా మెహతా యొక్క ఫైర్ చలనచిత్రం ప్రదర్శిస్తున్న సినిమా హాళ్లపై దాడి చేశారు, స్వలింగ సంపర్కులుపై వచ్చిన అత్యంత వివాదాస్పద చిత్రం హిందూ విశ్వాసాలకు విరుద్ధంగా ఉందని, హిందువులు దీనిని చూడటం అనైతికమని ఆరోపిస్తూ ఇది ప్రదర్శిస్తున్న సినిమా హాళ్లపై దాడి చేశారు. దీని ఫలితంగా, ఈ చలనచిత్ర ప్రదర్శన నిలిపివేయబడింది. తరువాత, శివసేన వారణాసి విభాగానికి చెందిన కార్యకర్తలు మెహతా యొక్క వాటర్ చిత్ర షూటింగ్పై కూడా తీవ్ర స్థాయిలో నిరసనకు దిగారు, వారణాసి మరియు ఇతర పవిత్ర నగరాలను తప్పుడు కోణంలో చిత్రీకరించడం ద్వారా హిందూ మతానికి అపకీర్తి తీసుకొస్తున్నారని ఆరోపిస్తూ వారు చలనచిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు.[48] ఈ నిరసనల ఫలితంగా, చలనచిత్ర షూటింగ్ను పొరుగునున్న శ్రీలంకకు మార్చారు.[49]
[మార్చు] ముస్లింలపై హింసాకాండ ఆరోపణలు
ముస్లింలను కూడా లక్ష్యంగా చేసుకొని హింసాకాండకు పాల్పడినట్లు శివసేన ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఉత్తర భారతదేశంలోని పవిత్ర నగరం అయోధ్యలో 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత ముంబయిలో జరిగిన అల్లర్లలో సేన క్రియాశీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆపై జనవరి 23, 1993న, కాంగ్రెస్-నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయమూర్తి బి.ఎన్. శ్రీకృష్ణ (తరువాత బాంబే హైకోర్టు సిట్టింగ్ జడ్జి) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు నియమించింది. ముస్లిం-వ్యతిరేక అల్లర్లలో సేనకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు కమిషన్ సూచించింది, ముస్లింలపై వ్యవస్థీకృత దాడుల ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని తన శివసైనికులకు థాకరే ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపించింది.[50] అయితే, ఏడేళ్ల న్యాయవిచారణ ప్రక్రియ తరువాత, జులై 2000లో థాకరేపై మోపబడిన అన్ని క్రిమినల్ అభియోగాలు వీగిపోయాయి. అయితే, ఇదే నివేదిక ఈ కింది విషయాన్ని తెలియజేస్తుంది: " భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ముస్లింలపై వర్గ ద్వేషాన్ని ప్రోత్సహించారనే ఆరోపణల్లో థాకరే జోక్యాన్ని నిర్ధారించింది.[51]
అంతేకాకుండా, భారతదేశం మరియు ముస్లిం ఆధిపత్యం ఉన్న పాకిస్తాన్ మధ్య భాగస్వామ్య చర్యలకు విఘాతం కలిగించే చర్యల్లో భాగంగా, శివసైనికులు భారత్ మరియు పాకిస్థాన్ జట్లు ఆడాల్సివున్న మైదానాల్లో క్రికెట్ పిచ్లను ధ్వంసం చేసిన సంఘటలు కూడా ఉన్నాయి. సేన పిచ్లను లక్ష్యంగా చేసుకోవడానికి రెండు ముఖ్యమైన ఉదాహరణలు ఏమిటంటే, 1991లో ముంబయిలోని వాంఖడే స్టేడియం పిచ్ను, 1999లో దేశరాజధాని ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా మైదానం పిచ్ను సేన కార్యకర్తలు ధ్వంసం చేశారు.[52] రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం పెరుగుతున్న పరిస్థితుల్లో సేన ఈ విధ్వంసక చర్యలకు పాల్పడింది.
[మార్చు] సడలిన వైఖరి
1998లో ఒక ఇంటర్వ్యూలో, ముస్లింలకు మరియు శివసేనకు సంబంధించిన అనేక అంశాలపై, ముఖ్యంగా బాబ్రీ మసీదు లేదా రామ జన్మభూమి వివాదానికి సంబంధించి థాకరే కఠినమైన వైఖరి సడలినట్లు కనిపించింది: మనం ముస్లింలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వారు దేశానికి, హిందూస్థాన్ రాజ్యాంగానికి విధేయులై ఉన్నంతవరకు వారిని మనలో భాగంగా పరిగణించాలని థాకరే వ్యాఖ్యానించాడు.[53] అంతేకాకుండా, సేనకు చెందిన కొందరు సభ్యులు పార్టీకి మతపరమైన వివక్ష లేదని, తాము కేవలం జాతీయవాదం ఆధారిత సిద్ధాంతానికి నిబద్ధులమై ఉన్నామని పేర్కొన్నాడు.[54]
- ముంబై పేలుళ్ళలో పట్టుబడిన ఉగ్రవాది కసబ్ తరపున వాదిస్తున్న లాయర్ ఖాజ్మీ సభ్యత్వాన్ని రద్దు చేసిన జింఖానా అనే ఇస్లాం ఆద్యాత్మిక సంస్థ కు బాల్థాకరే శాల్యూట్ చేశారు.దేశంలోని మత సామరస్యానికి ఇస్లాం పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శంగా నిలుస్తుందని ,హింసావాదానికి చట్టం రక్షణ కల్పిస్తే హిందువులతో పాటు ముస్లీములకు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండవని సామ్నా ఎడిటోరియల్ లో థాకరే వివరించారు.
[మార్చు] మీనాటాయ్ విగ్రహ అపవిత్రంపై నిరసనలు
జులై 9, 2006న, మీనాటాయ్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపవిత్రం చేసిన తరువాత (మరణించిన బాల్ థాకరే భార్య) శివ సైనికులు సెంట్రల్ ముంబయిలోని దాదర్ ప్రాంతంలో రోడ్లను దిగ్బంధించారు, ఒక పోలీసు అవుట్పోస్ట్ను ధ్వంసం చేశారు,[55] తరువాత రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు, నాగ్పూర్, పూణే, నాసిక్ మరియు మహారాష్ట్రలోని ఇతర నగరాల్లో ఈ నిరసనల సందర్భంగా స్తంభించాయి.[56]
[మార్చు] శివసేన & MNS ఘర్షణలు
అక్టోబరు 10, 2006న, శివసేన మరియు రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ముంబయిలోని SIES కళాశాల సమీపంలో శివసేన అధినేత బాల్ థాకరే ఛాయాచిత్రాలను MNS కార్యకర్తలు చింపివేశారని ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రతీకార చర్యగా, దాదర్లోని సేనా భవన్ సమీపంలో రాజథాఖరే ఛాయాచిత్రాలు ఉన్న హోర్డింగ్లను శివసేన కార్యకర్తలు నేలకూల్చారు.
ఈ వార్తలు వ్యాపించగానే, సేనా భవన్ సమీపంలో ఇరు వర్గాలకు చెందిన మద్దతుదారులు గుమిగూడి ఒకరిపైఒకరు రాళ్లు రువ్వుకోవడం మొదలుపెట్టారు. ఈ సంఘటనలో పోలీసు సిబ్బంది మరియు ఇరుపార్టీలకు చెందిన మద్దతుదారులు గాయపడ్డారు. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
పోలీసు చర్యలు మరియు ఉద్ధవ్ థాకరే మరియు అతని సోదరుడు రాజ్ థాకరే సంఘటనా స్థలంలో కనిపించిన తరువాత చివరకు సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయి. ఉద్ధవ్ సేన కార్యకర్తలను ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.[57] ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ:
"పోలీసులు అవసరమైన చర్య తీసుకుంటారు. MNS నుంచి అనేక మంది వ్యక్తులు మన పార్టీలో చేరుతుండటం వలన ఇది జరిగింది. పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి, అందువలనే వారు ఇటువంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.[57]
శివసేన విభాగ అధిపతి మిలింద్ వైద్య మాట్లాడుతూ ఈ సంఘటనకు పాల్పడిన MNS కార్యకర్తపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే MNS ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ దారేకర్ మాట్లాడుతూ, SIES కళాశాలలో స్థానిక ఎన్నికలు దీనికి కారణమని పేర్కొన్నారు. కళాశాలపై సేన తమ ఆధిపత్యాన్ని కోల్పోతుందనే భయంతో, వారు ఈ వివాదానికి రంగులు పూస్తున్నారని ఆయన ఆరోపించారు, సేన ఆరోపణల్లో ఎటువంటి యోగ్యత లేదని వ్యాఖ్యానించారు. MNS ఛాయాచిత్రాలను చింపివేయలేదని రాజ్ థాకరే తెలిపారు, బాల్ థాకరేను తనకు మరియు తన పార్టీ సభ్యులకు గౌరవభావం ఉందన్నారు.[58]
[మార్చు] న్యాయపరమైన మద్దతు
మాలేగావ్ బాంబు పేలుళ్లు 2008 తీవ్రవాద నిందితుడు ప్రగ్యా సింగ్ ఠాకూర్కు శివసేన మద్దతుగా నిలిచింది.[59]
[మార్చు] షారుఖ్ ఖాన్ వివాదం
ఫిబ్రవరి 2010 నుంచి, చాలాకాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్ను శివసేన పార్టీ లక్ష్యంగా చేసుకుంది, దీనికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించగా, షారుఖ్ ఖాన్ ప్రధాన నటుడిగా ఉన్నారు. 2010, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పాకిస్థానీ ఆటగాళ్లను చేర్చడానికి మద్దతుగా షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి, ఈ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలు ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు, వీటితోపాటు తాను మొదట భారతీయుడినని, రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కాదని చేసిన వ్యాఖ్యలు కూడా షారుఖ్ను శివసేనతో వివాదంలోకి నెట్టాయి. పాలించబడనప్పటికీ, సేన చేత నియంత్రించబడుతున్న నగరంలో ఉత్తరాది భారతీయుడు కావడం, ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిగా ఉండటంతో అతని దురవస్థకు ఆజ్యం పోశాయి. ఈ వివాదం కొంతకాలం పరిష్కారమయినట్లు కనిపించిది, అయితే చలనచిత్ర ప్రదర్శనను తాము అడ్డుకోబోమని బహిరంగ ప్రకటన తరువాత, శివసేన కార్యకర్తలు పోస్టర్లు తగలబెట్టడం మరియు విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సేన ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సినిమా ప్రదర్శిస్తున్న హాళ్ల వద్ద 10,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించడంతోపాటు, 1600 మందికిపైగా వ్యక్తులను ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలోకి తీసుకున్నారు.
[మార్చు] CNN-IBN కార్యాలయాలపై దాడి
ముంబయి మరియు పూణే నగరాల్లో IBN-7 మరియు IBN-లోక్మాత్ హిందీ మరియు మరాఠీ TV వార్తా ఛానళ్లపై నవంబరు 20, 2009న శివసేన కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.[60] సచిన్ టెండూల్కర్పై బాల్ థాకరే చేసిన వ్యాఖ్యలను వార్తా ఛానల్ విమర్శించినందుకు సేన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. శివసేన రాజ్యసభ MP సంజయ్ రౌత్ పార్టీ కార్యకర్తలు వారంతటవారే ఈ దాడులకు దిగారని పేర్కొన్నారు. శివసేనకు చెందిన పలువురు ప్రతినిధులు ఈ దాడులను సమర్థించారు.[61][62]
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మరింత చదవడానికి
పుస్తకాలు — మరాఠీ
- భోంస్లే, హర్షద్ (2004): 'ముంబయి మహానగరపాలిక నివేద్నుక్' ఇన్ పాల్షికర్ సుహాస్ మరియు నితిన్ బిర్మాల్ (eds), మహారాష్ట్రాచే రాజ్కరణ్ ప్రతిమా, పూణే.
- మహారాష్ట్రటిల్ సత్తాన్తార్, వోరా రాజేంద్ర మరియు సుహాస్ పాల్షికార్, గ్రాంథాలీ, ముంబయి 1996
- భోంస్లే, హర్షద్(2006),"ముంబైచ్యా వికాశచా ఆర్తీక్, రాజకీయ అనీ సమాజిక్ సందర్భ",ఇన్ బీ మంత్లీ అప్లా పరమ్ మిత్రా, సెప్టెంబరు-అక్టోబరు 2006,సంవత్సరం 5,సంచిక-3.
పుస్తకాలు — ఆంగ్లం
- ఎత్నిసిటీ అండ్ ఈక్వాలిటీ: ది శివసేన పార్టీ అండ్ ప్రిఫెరెన్షియల్ పాలిటిక్స్ ఇన్ బాంబే , MF కాట్జెన్స్టెయిన్ - 1979 - కార్నెల్ యూనివర్శిటీ ప్రెస్
- వారియర్స్ ఇన్ పాలిటిక్స్: హిందూ నేషనలిజం, వాయిలెన్స్, అండ్ ది శివసేన ఇన్ ఇండియా , S బెనర్జీ - 2000 - వెస్ట్వ్యూ ప్రెస్
- ది సేనా స్టోరీ , పురందేర్ వైభవ్, బిజినెస్ పబ్లికేషన్స్, ముంబయి,(1999)
- ది చరిష్మా ఆఫ్ డైరెక్ట్ యాక్షన్: పవర్, పాలిటిక్స్, అండ్ ది శివసేన , JM ఎకెర్ట్ - 2003 - ఆక్స్ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్
- నేటివిజం ఇన్ ఎ మెట్రోపోలిస్: ది శివసేన ఇన్ బాంబే , D గుప్తా - 1982 – మనోహర్ (OUP 1996)
- శివసేన: ఎన్ అసెస్మెంట్ , పాల్షికార్, సుహాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, యూనివర్శిటీ ఆఫ్ పూణే, పూణే (1999)
- మాగ్జిమమ్ సిటీ: బాంబే లాస్ట్ అండ్ ఫౌండ్, 'పవర్', ఛాప్టర్ 3, ముంబయి , మెహతా, సుకేతు, పెంగ్విన్ బుక్స్(2005)
వ్యాసాలు
- ది రీబర్త్ ఆఫ్ శివసేన: ది సింబియోసిస్ ఆఫ్ డిస్కర్సివ్ అండ్ ఆర్గనైజేషనల్ పవర్, మేరీ ఫాయిన్సోడ్ కార్జెన్స్టెయిన్, ఉదయ్ సింగ్ మెహతా, ఉషా థాకూర్, ది జర్నల్ ఆఫ్ ఆసియన్ స్టడీస్ , వాల్యూమ్ 56, నెంబరు 2 (మే 1997), పేజీలు 371–390
- సాఫోర్నిసేషన్ ఆఫ్ ది శివసేన, J లీలే — బాంబే: మెటాఫోర్ ఫర్ మెడ్రన్ ఇండియా , 1995
- కల్చరల్ పాపులిజం: ది అప్పీల్ ఆఫ్ ది శివసేన, G హ్యూజ్ — బాంబే: మెటాఫోర్ ఫర్ మోడ్రన్ ఇండియా , 1995
- ది శివసేనాస్ న్యూ అవతార్: మరాఠీ చ్వావినిజం అండ్ హిందూ కమ్యూనలిజం, R సర్దేశాయ్ - పాలిటిక్స్ ఇన్ మహారాష్ట్ర , 1995
- ది రెటోరిక్ ఆఫ్ హిందూ నేషనలిజం: ఎ నారేటివ్ ఆఫ్ మైథిక్ రీడెఫినిషన్, రాబర్ట్ C. రౌల్యాండ్, అబిక్ రాయ్; వెస్ట్రన్ జర్నల్ ఆఫ్ కమ్యూనికేషన్ , వాల్యూమ్ 67, 2003
- రిజెనరేటింగ్ మాస్కులినిటీ ఇన్ ది కన్స్ట్రన్క్షన్ ఆఫ్ హిందూ నేషనలిస్ట్ ఐడెంటిటీ: ఎ కేస్ స్టడీ ఆఫ్ శివసేన, అభిక్ రాయ్, కమ్యూనికేషన్ స్టడీస్ , వాల్యూమ్ 57, నెంబర్ 2 / జూన్ 2006,
- ది ఫెమినైజేషన్ ఆఫ్ వాయిలెన్స్ ఇన్ బాంబే: వుమెన్ ఇన్ ది పాలిటిక్స్ ఆఫ్ శివసేన, S బెనర్జీ - ఏషియన్ సర్వే , 1996
- ది వెర్నాక్యులేరైజేషన్ ఆఫ్ హిందుత్వ: ది BJP అండ్ శివసేన ఇన్ రూరల్ మహారాష్ట్ర, థామస్ బ్లూమ్ హాన్సెన్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ సోషియాలజీ , వాల్యూమ్ 30, నెంబరు 2, 177-214 (1996)
- ది శివసేన: ఎ మూమెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ లెజిటమసీ R జోషి - ఏషియన్ సర్వే , 1970
- ఆరిజన్స్ ఆఫ్ నేటివిజం: ది ఎమర్జెన్స్ ఆఫ్ శివసేన ఇన్ బాంబే MF కేట్జెన్స్టెయిన్ - ఏషియన్ సర్వే , 1973
- సర్దేశాయ్, రాజ్దీప్ 'శివసేనాస్ న్యూ అవతార్: మరాఠీ చౌవినిజం అండ్ హిందూ కమ్యూనలిజం' ఇన్ ఉషా ఠక్కర్ అండ్ మంగేష్ కులకర్ణి (eds), పాలిటిక్స్ ఇన్ మహారాష్ట్ర , హిమాలయ, ముంబయి, పేజీలు 127–46 (1995)
- " సిటీ ఆఫ్ మాంగ్రెల్ జాయ్": బాంబే అండ్ ది శివసేన ఇన్ మిడ్నైట్స్ చిల్డ్రన్ అండ్ ది మోర్స్ లాస్ట్ సింగ్, R ట్రౌస్డాల్ - జర్నల్ ఆఫ్ కామన్వెల్త్ లిటరేచర్ , 2004
నెట్లో అందుబాటులో ఉన్న కథనాలు
- ది శివసేన: ఎన్ ఎరప్షన్ ఆఫ్ సబ్నేషనలిజం, మోర్ఖాన్దికార్ R S, ఎకనామిక్ అండ్ పొలిటకల్ వీక్లీ , 21 అక్టోబరు, పేజీలు 1903–06 (1967
- శివసేన: ఎ టైగర్ విత్ మెనీ ఫేసెస్? S పాల్షికార్ - ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ , 2004
- ది చరిష్మా ఆఫ్ ఆటోక్రసీ బాల్ థాకరేస్ డిక్టేటర్షిప్ ఇన్ శివసేన J ఎకెర్ట్ — మనుషి, 2002
- శివసేన అండ్ నేషనల్ హిందూయిజం, G హ్యూజ్ — ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, 1992
[మార్చు] సూచనలు
- ↑ "Sena fate: From roar to meow". The Times of India (2005-11-29). తీసుకొన్న తేదీ: 2006-08-11.
- ↑ శివసేన శాఖ నెంబరు 111
- ↑ "Shiv Sena On The Threshold Of Disintegration". The Indian Express via www.countercurrent.org. తీసుకొన్న తేదీ: 2006-07-22.
- ↑ 4.0 4.1 4.2 4.3 "Know Your Party: Shiv Sena". Rediff.com. తీసుకొన్న తేదీ: 2006-07-22.
- ↑ బ్లూమ్ హాన్సెన్, థామస్. వేజెస్ ఆఫ్ వాయిలెన్స్: నేమింగ్ అండ్ ఐడెంటిటీ ఇన్ పోస్ట్కాలనియల్ ముంబయ్ . ప్రిన్స్టన్; ప్రిన్స్టన్ యూనివర్శిటీ ప్రెస్, 2002. పేజి 200
- ↑ BBC
- ↑ పేజి 1048 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ యాన్యువల్, 2006 బై మహేంద్ర గౌర్.
- ↑ "రాజ్ థాకరే లాంచెస్ న్యూ పార్టీ", ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా - సవరణ తేదీ: గురువారం, మార్చి 09, 2006, 1914 గంటలు IST
- ↑ పేజి 1048 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ యాన్యువల్, 2006 రచన మహేంద్ర గౌర్
- ↑ "Thackeray inaugurates new Sena bhavan". NDTV news. తీసుకొన్న తేదీ: 2006-07-29.
- ↑ [1]
- ↑ TitlePage-VolI_LS99.PDF
- ↑ TitlePage-VolI_LS99.PDF
- ↑ లిస్ట్ ఆఫ్ పొలిటకల్ పార్టీస్
- ↑ [2]
- ↑ rptDetailedResults
- ↑ http://www.eci.gov.in/StatisticalReports/LS_1996/Vol_I_LS_96.pdf
- ↑ TitlePage_HR-96.PDF
- ↑ TitlePage_PU-96.PDF
- ↑ http://www.eci.gov.in/StatisticalReports/LS_1998/Vol_I_LS_98.pdf
- ↑ rptProgrammeOFElections
- ↑ rptProgrammeOFElections
- ↑ http://www.eci.gov.in/StatisticalReports/LS_1999/Vol_I_LS_99.pdf
- ↑ TitlePageGA99.PDF
- ↑ TitlePage_OR_LA_2000.PDF
- ↑ http://archive.eci.gov.in/SE2001/pollupd/ac/candlwc/s11/s11shsacnst.htm
- ↑ []
- ↑ http://www.eci.gov.in/StatisticalReports/LS_2004/Vol_I_LS_2004.pdf
- ↑ [39] ^ [38]
- ↑ 30.0 30.1 http://www.ndtv.com/template/template.asp?template=BMCpolls&id=100333&callid=1
- ↑ 31.0 31.1 http://www.moneycontrol.com/india/news/currentaffairs/rajthackeraynarayanranes/shivsenavictory/market/stocks/article/265340
- ↑ "On the wrong track". The Hindu. తీసుకొన్న తేదీ: 2006-08-11.
- ↑ "Sena fate: From roar to meow". The Times of India. తీసుకొన్న తేదీ: 2006-08-11.
- ↑ p Rediff News.
- ↑ 'హైరైజెస్ డోంట్ స్యూట్ ధారవి స్లమ్ డ్వెల్లెర్స్'
- ↑ ధారవి స్లమ్ విల్ బి ఎకనామిక్ హబ్: జోషీ
- ↑ డ్రైవింగ్ టు నోహియర్
- ↑ 38.0 38.1 Shiv Sena activists go on rampage, lathi-charged. http://www.kashmirtimes.com.+తీసుకొన్న తేదీ: 2008-07-09.
- ↑ http://www.hinduunity.com/articles/bharathistory/nationalintegration1.html
- ↑ http://www.tribuneindia.com/2003/20031006/punjab1.htm#18
- ↑ http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005041518520300.htm&date=2005/04/15/&prd=th&
- ↑ 42.0 42.1 "'The General' in his labyrinth". The Hindu. తీసుకొన్న తేదీ: 2006-08-11.
- ↑ "NCP attracts EC ire on campaign spoofs". Yahoo News. తీసుకొన్న తేదీ: 2006-08-06.
- ↑ "Profile: Bombay's militant voice". BBC news (2000-07-19). తీసుకొన్న తేదీ: 2006-07-13.
- ↑ "Revolt In The Shiv Sena: death-knell for a fascist party?". The Kashmir Times accessed via website of the Europe Solidaire Sans Frontières association. తీసుకొన్న తేదీ: 2006-07-22.
- ↑ "Bala Saheb justifies attack on Zee TV". The Indian Express. తీసుకొన్న తేదీ: 2006-08-16.
- ↑ "Tough love for Indian Valentines". BBC news (2001-02-14). తీసుకొన్న తేదీ: 2006-07-13.
- ↑ "Controversial film 'Water' cleared". BBC News (2000-02-03). తీసుకొన్న తేదీ: 2006-08-13.
- ↑ " 'Opposition to Water was very traumatic' ". The Times of India. తీసుకొన్న తేదీ: 2006-08-13.
- ↑ "The Shiv Sena indicted". The Hindu Frontline Magazine. తీసుకొన్న తేదీ: 2008-08-08.
- ↑ "Firebrand Thackeray let off the hook". The Asian Times online edition. తీసుకొన్న తేదీ: 2008-08-08.
- ↑ "Spreading its wings". The Hindu Frontline Magazine. తీసుకొన్న తేదీ: 2006-08-13.
- ↑ http://www.rediff.com/news/1998/jan/21nandy.htm
- ↑ Rediff నో యువర్ పార్టీ: శివసేన
- ↑ "Shiv Sainiks run amok, Maha on high alert". The Indian Express. తీసుకొన్న తేదీ: 2006-07-09.
- ↑ "Maharashtra faces the wrath of Shiv Sena". The Hindustan Times. తీసుకొన్న తేదీ: 2006-07-22.
- ↑ 57.0 57.1 "Shiv Sena workers, Raj supporters clash". The Hindu. తీసుకొన్న తేదీ: 2006-10-17.
- ↑ "Sena vs new Sena, 30 injured". The Indian Express. తీసుకొన్న తేదీ: 2006-10-18.
- ↑ రియల్ మాస్టర్మైండ్స్ ఎట్ లార్జ్, ప్రగ్యా ఎ విక్టైమ్: సేన
- ↑ In the name of their Boss, Sena goons attack IBN TV channels http://www.indianexpress.com/news/time-for-cnn-ibn-to-introspect/544428/
- ↑ If you target us, we will attack: Shiv Sena leader http://ibnlive.in.com/news/if-you-target-us-we-will-attack-shiv-sena-leader/105645-3.html
- ↑ SHIV SENA ATTACKS IBN OFFICES, GLOATS http://ibnlive.in.com/news/shiv-sena-attacks-ibn-offices-in-mumbai-pune/105636-3.html