అటవీ అమరవీరుల సంస్మరణ దినం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అటవీ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం నవంబరు 10 న జరుపుకుంటారు.[1]గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ (Indian Forest Service - IFS) అధికారి శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.[2] అటవీ అధికారులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా కలప స్మగర్లతో తీవ్ర వాదులతో పోరాటం చేసి, వారు చేసిన దాడులలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమరవీరుల అత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి సేవలను ఈ రోజు గుర్తు చేసుకుంటారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అటవీ అమరవీరుల త్యాగానికి గుర్తుగా అటవీ శాఖకు సంబంధించిన పలువురు రక్తదానం చేస్తారు.

హైదరాబాదులో అటవీ అమరవీరుల దినోత్సవం[మార్చు]

ప్రతిఏటా నవంబరు 10న నెహ్రూ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కూడా హాజరై కార్యక్రమానికి అధ్యక్షత వహించి నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర అటవీశాఖ కార్యదర్శి, జూపార్క్ సంచాలకులు కూడా డినికి హాజరౌతారు. రక్తదాన శిభిరం కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు 3 దశాబ్దాలలో దాదాపు 30 మంది అటవీ అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. అధికమంది కలప స్మగ్లింగ్ కాంట్రాక్తర్ల చేతిలో అమరులైననూ కొందరు వన్యప్రాణుల బారి నుంచి మరికొందరు నక్సలైట్ల దాడులతో ప్రాణాలు వదిలారు.

నెహ్రూ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపం

జిల్లాలలో అటవీ అమరవీరుల దినోత్సవాలు[మార్చు]

నవంబరు 10న రాష్ట్ర రాజధానిలో జరిపేవిధంగానే ప్రతి జిల్లా కేంద్రాలలో కూడా అటవీ అమరవీరుల దినోత్సవాలను నిర్వహిస్తారు. జిల్లాస్థాయి అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై జిల్లా అటవీప్రాంతాలలో అమరులైన అటవీ అధికారులకు నివాళులు అర్పిస్తారు. మనరాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో అధికంగా అడవులున్నందున స్మగ్లర్ల దాడులు కూడా ఈ జిల్లాలో అధికంగా ఉంటాయి. కడపలో ఎర్రచందనం అక్రమరవాణా చేసే కాంట్రాక్టర్ల దాడుల వల్ల కూడా అటవీ శాఖ అధికార్ల మరణం అధికంగా ఉంటుంది.

అటవీ అధికారులు అమరులైన విధాలు[మార్చు]

విధి నిర్వహణలో ఉన్నప్పుడు అటవీ అధికారులు అనేకకారణాలతో అమరులవుతున్నారు.

  • కలప స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు పట్టుకోవడంతో స్మగ్మర్లు చేసే దాడులవల్ల
  • అటవీ భూములు కాపాడుతునప్పుడు ఆక్రమణ దారులచేసే దాడులవల్ల
  • అడవులలో తనిఖీ చేస్తున్నప్పుడు వన్యప్రాణులు అకస్మాత్తుగా దాడుల చేయడం వల్ల
  • నక్సలైట్ల దాడుల వల్ల

అటవీ అధికారులు విధినిర్వహణలో దాడులు తగ్గుటకై ప్రభుత్వం చర్యలు[మార్చు]

మూడు దశాబ్దాల నుంచి సరాసరిన ఒక్కో అధికారి మరణం పొందడంతో పాటు అనేక మంది గాయాలబారిన పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం తగు చర్యలు కూడా తీసుకుంది. 2010లో హైదరాబాదులోని జూపార్కులో జరిగిన అటవీ అధికారుల సంస్మరణ దినీత్సంలో రాష్ట్ర అటవీ మంత్రి మాట్లాడుతూ అడవులలో పర్యవేక్షించే అధికారులకు రైఫిళ్ళు సరఫరా చేస్తామని ప్రకటించారు. దట్టమైన అరణ్యాలలో సీసీ కెమరాలు ఉంచడం కూడా జరిగింది. దీనివల్ల అధికారులు కార్యాలయంలో ఉంటూ అడవులలో జరుగుతున్నది పర్యవేక్షించవచ్చు. స్మగ్లర్లు ఉన్నట్లు తెలిస్తే ఆయుధాలు, బలగాలతో వెళ్ళవచ్చు. దీనివల్ల మరణాలు తగ్గుతాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. అటవీ అమరవీరుల సంస్మరణ దినం,1991 నవంబర్ 10న[permanent dead link]
  2. "ప్రజాశక్తి పత్రికలొ ఆర్టికల్". Archived from the original on 2013-02-13. Retrieved 2013-02-07.

బయటి లింకులు[మార్చు]