అరూప్ కుమార్ గోస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరూప్ కుమార్ గోస్వామి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 జనవరి 2021
సూచించిన వారు శరద్ అరవింద్ బాబ్డే
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు జితేంద్ర కుమార్ మహేశ్వరి

పదవీ కాలం
15 అక్టోబరు 2019 – 5 జనవరి 2021
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు Meenakshi Madan Rai (acting)
తరువాత జితేంద్ర కుమార్ మహేశ్వరి

పదవీ కాలం
24 జనవరి 2011 – 14 అక్టోబరు 2019
సూచించిన వారు S. H. Kapadia
నియమించిన వారు ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-11) 1961 మార్చి 11 (వయసు 63)
జోర్హట్, అస్సాం

అరూప్ కుమార్ గోస్వామి (జననం 1961 మార్చి 11) భారతీయ న్యాయమూర్తి. 2021 జనవరి 6 నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. [1][2] దీనికి ముందు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. [3]

వృత్తి జీవితం[మార్చు]

1981 లో గౌహతి విశ్వవిద్యాలయం పరిధిలోని కాటన్ కాలేజీ నుండి ఎకనామిక్స్ (ఆనర్స్) లో పట్టభద్రుడయ్యాడు. 1985 లో గౌహతిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి ఎల్ఎల్‌బి డిగ్రీ పొందాడు. 16.8.1985 న అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరాడు. ప్రధానంగా సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, ఉద్యోగసేవల విషయాలపై న్యాయవాదిగా పనిచేశాడు.

24.01.2011 న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 07.11.2012 నాటికి శాశ్వత న్యాయమూర్తి అయ్యాడు.

తాత్కాలిక గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రెండు సార్లు - 06.09.2018 నుండి 29.10.2018 వరకు, 24.05.2019 నుండి 06.10.2019 వరకు పనిచేశాడు

2019 అక్టోబరు 15 న సిక్కిం హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

2020 డిసెంబరు 31 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు. 2021 జనవరి 6 న ప్రమాణ స్వీకారం చేశాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "Justice Goswami takes over as new chief justice of Andhra Pradesh". Hindustan Times (in ఇంగ్లీష్). 6 January 2021. Retrieved 7 January 2021.
  2. Reporter, Staff (6 January 2021). "Arup Kumar Goswami sworn in as Chief Justice of Andhra Pradesh High Court". The Hindu (in Indian English). Retrieved 7 January 2021.
  3. "Justice Arup Kumar Goswami sworn in as new Chief Justice of High Court of Sikkim". www.sikkim.gov.in. Retrieved 7 January 2021.
  4. "ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి". 2021-01-06. Archived from the original on 2021-01-28. Retrieved 2021-01-28.