ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం భారత ప్రభుత్వం దేశంలోని 718 జిల్లాలలో వెనుకబడ్డ 112 జిల్లాలలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమం. దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వివిధ మద్దతుదారుల సహాయంతో చేపడుతుంది.[1][2]

స్థాపన[మార్చు]

ఈ కార్యక్రమాన్ని 2018 జనవరి నెలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల పరిపాలన అధికారులు నీతి ఆయోగ్ సమన్వయ సంస్థలతో కలిసి చేపడుతున్నారు.

ఆకాంక్ష జిల్లాల జాబితా[మార్చు]

ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని 112 జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా గుర్తించింది. వీటిలో తెలంగాణాలో మూడు, ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆకాంక్ష జిల్లాలు:

  1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
  2. జయశంకర్ భూపాలపల్లి జిల్లా
  3. కొమరంభీం జిల్లా
  4. విజయనగరం జిల్లా
  5. విశాఖపట్నం జిల్లా
  6. వైఎస్‌ఆర్ జిల్లా

ముఖ్య విభాగాలు[మార్చు]

  • వైద్యం, పౌష్టికాహారం
  • విద్య
  • సేద్యం, జల వనరులు
  • ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి
  • మౌలిక సదుపాయాలు

మార్పు విజేతలు[మార్చు]

2018 ఏప్రిల్ నెలలో నీతి ఆయోగ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఆకాంక్ష జిల్లాలలో జరిగే మార్పుల నివేదికలు నిర్వహించటానికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ పోర్టల్ను ప్రారంభించింది. పైన సూచించిన అయిదు విభాగాలలో అభివృద్ధి పరంగా జిల్లాలకు డెల్టా ర్యాకింగును కేటాయిస్తుంది. ఈ ర్యాకింగును ప్రతి నెల కేటాయిస్తారు, దీనికి సంబందించిన జాలస్థలి ప్రజలందరికి అందుబాటులో ఉంటుంది.[3]

మూలాలు[మార్చు]

  1. "India's aspirational districts programme resulted in sectoral growth: UNDP report". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-06-11. Retrieved 2021-06-27.
  2. "About the Aspirational Districts Programme | NITI Aayog". niti.gov.in. Retrieved 2021-06-29.
  3. "UN body lauds success of Centre's Aspirational Districts Programme". The Indian Express (in ఇంగ్లీష్). 2021-06-12. Retrieved 2021-06-27.

బయటి లంకెలు[మార్చు]