ఎల్.పి.జై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్.పి.జై
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లక్ష్మీదాస్ పురుషోత్తందాస్ జై
పుట్టిన తేదీ(1902-01-04)1902 జనవరి 4
బాంబే, బాంబే ప్రెసిడెన్సీ
మరణించిన తేదీ1968 జనవరి 29(1968-01-29) (వయసు 66)
బాంబే, మహారాష్ట్ర
మారుపేరులల్లూభాయ్[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 13)1933 డిసెంబరు 15 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1920–1941Hindus
1926–1941Bombay
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 67
చేసిన పరుగులు 19 3,231
బ్యాటింగు సగటు 9.50 31.99
100లు/50లు 0/0 6/19
అత్యధిక స్కోరు 19 156
వేసిన బంతులు 210
వికెట్లు 3
బౌలింగు సగటు 44.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/6
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 26/–
మూలం: ESPNcricinfo, 2020 మే 13

లక్ష్మీదాస్ పురుషోత్తమదాస్ జై (1902 ఏప్రిల్ 1 - 1968 జనవరి 29) ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో ఆడిన భారత క్రికెట్‌ క్రీడాకారుడు. [2]

జై బొంబాయిలో గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. [3] [4] అతను చక్కటి కుడిచేతి స్ట్రోక్ ప్లేయర్. అతని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు చాలా వరకు బాంబే క్వాడ్రాంగులర్‌ పోటీల్లో వచ్చాయి. అతను మొట్టమొదటి రంజీ ట్రోఫీ ఛాంపియన్‌షిప్‌లో బాంబేకి సారథ్యం వహించాడు.

భారతీయ రాజకీయ నాయకులను జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హిందూ జింఖానా వ్యతిరేకత తెలియజేసిన కారణంగా, జైతో పాటు విజయ్ మర్చంట్, చంపక్ మెహతా 1932లో ఇంగ్లండ్‌లో పర్యటించే భారత జట్టు ఎంపికల సమయంలో ట్రయల్ మ్యాచ్‌లకు అందుబాటులో లేరు [5] ఈ పర్యటనలో భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ఉంది. భారత్‌లో జరిగిన తొట్టతొలి టెస్టే అతని ఏకైక టెస్టు. అతను 1936లో ఇంగ్లాండ్‌లో పర్యటించాడు గానీ వేలు విరగడంతో ఎక్కువగా ఆడలేదు.

అతను 1950లలో సెలెక్టర్‌గా ఉన్నాడు. వెస్టిండీస్‌తో 1958/59 సిరీస్‌లో జరిగిన వివాదం కారణంగా రాజీనామా చేసాడు. ప్రతి సీజన్‌లో రంజీ ట్రోఫీలో వేగవంతమైన సెంచరీ సాధించిన ట్రోఫీకి అతని పేరు పెట్టారు.

కెరీర్[మార్చు]

జై ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసాడు. స్టాంపుల సేకరణలో అతనికున్న అభిరుచిని పెంపొందించడానికి ఇది సహాయపడింది. అతను ప్రతిరోజు బ్యాంకుకు వచ్చే ప్రతి స్టాంప్ కవరును "రక్షించగల" స్థానంలో ఉన్నందున అతను ఒక ప్రముఖ ఫిలాటెలిస్ట్ అయ్యాడు. అతను బ్రిటిష్ ఎంపైర్ స్టాంపులలో ప్రత్యేకత సాధించాడు.

జై 1968 జనవరి 29 న బొంబాయిలో గుండెపోటుతో మరణించాడు. [1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "L.P. Jai dead". The Indian Express. 30 January 1968. p. 12.
  2. "L.P.Jai". ESPNcricinfo. Retrieved 13 May 2020.
  3. Bamzai, Sandeep (2002). Guts and Glory: The Bombay Cricket Story (in ఇంగ్లీష్). Rupa & Company. p. 114. ISBN 978-81-7167-611-8.
  4. Guha, Ramachandra (2005). The States of Indian Cricket: Anecdotal Histories (in ఇంగ్లీష్). Permanent Black. p. 42. ISBN 978-81-7824-108-1.
  5. "Relive India's first ever Test match... against England in 1932!". Rediff.com (in ఇంగ్లీష్). 1 July 2014. Retrieved 2023-04-25.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎల్.పి.జై&oldid=3962206" నుండి వెలికితీశారు