కైవల్యోపనిషత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యే మాక్ష భిర్యజత్రాః
స్థిరై రంగై స్తుష్ఠువాగ్‍ం సస్తనూభిః
వ్యశే మదేవ హితం యదాయుః
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తి నః పూషా విశ్వవేదాః
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః
స్వస్తి నో బృహస్పతిర్దధాతు

అర్థం
ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెపుతుంది అంటే అతి శయోక్తి కాదు. ఈ పద్యం యొక్క అర్థము,
ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించెదము (చూచేదము) గాక ! మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తుతించు చుందుము కనుక మాకు మంచి ఆయుష్యు, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తి ని ప్రసాదించుము. ఆది కాలము నుంచి మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జేకూర్చుగాక! సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక !


ఓం శాంతిః శాంతిః శాంతిః ||

అర్థం
మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా "మూడు తాపములు" అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మంత్రముల అర్థము.



మూల మంత్రం[మార్చు]

ఇది కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]