గోల్కొండ వజ్రాలు

వికీపీడియా నుండి
(గోల్కొండ వజ్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గ్రేట్ మొగల్ డైమండ్ ప్రతి రూపం
గోల్కొండ సుల్తానేట్ లో వజ్రపు గని దృశ్యం. సా.శ.1725 ముద్రితము

గోల్కొండ వజ్రాలు భారతదేశానికి చెందిన వజ్రాలు. ఇవి ఆ కాలంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో తవ్వినవి. కుతుబ్ షాహి రాజవంశం (గోల్కొండ సుల్తానులు) పాలనలో (16వ శతాబ్దం -17 వ శతాబ్దం) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానది పరివాహక తీర ప్రాంతాన ఉన్న (ప్రధానంగా కోళ్లూరు గనులు) గనుల నుండి సేకరించి, కోతకు హైదరాబాదు నగరానికి రవాణా చేయబడ్డాయి. వాటికి మెరుగు పెట్టడం, దాని విలువ మదింపు కట్టడం, అమ్మకం లాంటి లావాదేవీలకు హైదరాబాదులోని గోల్కొండ ఒక వజ్రాల వాణిజ్య కేంద్రంగా స్థిరపడింది.19 వ శతాబ్దం చివరి వరకు, ప్రపంచంలోని అతిపెద్ద అత్యుత్తమమైన వజ్రాల వాణిజ్యకేంద్రాలలో గోల్కొండ మార్కెట్ ఒకటిగా గుర్తించబడింది.ఆ విధంగా 'గోల్కొండ డైమండ్' అనే పురాణ పేరు గోల్కొండకు పర్యాయపదంగా మారింది.

కోహినూర్, నస్కాక్, ఆర్క్ డ్యూక్, హోప్, దారియా ఇ నూర్, రీజెంట్ డ్రెస్ డెన్ గ్రీన్, ఆర్లోవ్, నిజాం, జాకబ్ తో పాటు ఇప్పుడు కనబడని ఫ్లొరెంటీన్ ఎల్లో, అక్బర్ షా, గ్రేట్ మొగల వజ్రాలు , గోల్కొండ గనుల్లో లభించినవే.

ప్రధానమైన కోళ్లూరు గనుల (ప్రస్తుతం గుంటూరు జిల్లా) తో పాటు దక్షిణ భారతదేశంలో కృష్ణానది ప్రాంతంలో ఇతర గనుల వుండేవి. వజ్రాలతో పాటు, ఈ ప్రాంతం లోహపాత్రలు, ముత్యాలు, మసాలాదినుసులు, వస్త్రాలకు ప్రముఖ వాణిజ్య కేంద్రంగా వుండేది.

2013 ఏప్రిల్ 17న న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఆర్చ్‌డ్యూక్‌ జోసెఫ్‌ అనే పేరుగల 76 క్యారెట్ల వర్ణరహిత వజ్రం 211 కోట్ల రూపాయల ధర పలికింది.[1] ఈ వజ్రానికి క్లారిటీ, కట్‌, క్యారెట్‌ అనే మూడు అంశాల్లో ఎంతో విశిష్టత వుంది. హైదరాబాద్ చరిత్రకారుడు ముహమ్మద్ సఫిల్లా గోల్కొండలోని అన్ని గనుల నుండి జరిగిన ఉత్పత్తి 12 మిలియన్ క్యారెట్లు వుంటుందని అంచనా వేశాడు.[2]


చరిత్ర[మార్చు]

భారతదేశంలోని రెండు ప్రధాన సముద్ర ఓడరేవులైన సూరత్, మచిలీపట్నం మధ్య గోల్కొండ సుల్తానేట్ ఉంది.ఈ పట్టణం వజ్రాలకు వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయబడింది.కుతుబ్ షాహి పాలకుల ఆధ్వర్యంలో, గోల్కొండ కోట సమీపంలో వజ్రాల అభివృద్ధికి చేయబడింది. వజ్రాల వ్యాపారంలో పాల్గొన్న శ్రామిక శక్తి ఆకాలంలో సుమారు 100,000 మంది వరకు ఉండేవారు. మధ్యయుగ వజ్రాల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులను ఆకర్షించింది.ఇప్పటి పాలకలు వారికి సౌకర్యాలను ఏర్పాటు చేసారు.వ్యాపారులు ఉండటానికి,వ్యాపారం చేయడానికి, ముఖ్యంగా యూరప్,మధ్య ఆసియా నుండి ప్రయాణించేవారికి తగిన భద్రత కల్పించారు.2016 నవంబర్ 5 ది హిందూ దిన పత్రిక, (మను ఎస్. పిళ్ళై ) ప్రకారం , ప్రఖ్యాత ఫ్రెంచ్ యాత్రికుడు, ఆభరణాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్, గోల్కొండలోని ఒక చెరశాలలో ఉంచిన గ్రేట్ టేబుల్ డైమండ్ అనే ఫ్లాట్ డైమండ్‌ను చూసినట్లు పేర్కొన్నారు.[3] 'గోల్కొండ డైమండ్స్'లో ప్రెంచ్ దేశానికి చెందిన జీన్ డి థెవెనోట్, ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఉన్నారు.[4]

కోహినూర్ డైమండ్[మార్చు]

కోహినూర్ వజ్రానికి ప్రతిరూపం

భారత దేశానికి చెందిన అన్ని వజ్రాలలో రంగులేని కోహినూర్ డైమండ్ అత్యంత విలువగలది.ఇది అత్యంత ప్రసిద్ధిచెందిన కోళ్లూరు గనులు నుండి సేకరించందని చరిత్ర ద్వారా తెలుస్తుంది.[5][6][7]కోళ్లూరు మైన్ అత్యంత ప్రసిద్ధ వజ్రాల గనులలో ఒకటి. కోహినూర్ డైమండ్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ యాజమాన్యంలో ఉంది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. A, Sivathasan; k, Venkateshwarlu (2012-11-14). "Golconda diamond fetches world record price". The Hindu.
  2. "Famed golconda diamonds may still fetch record prices". The New Indian Express. 2016-10-22. Retrieved 2020-07-22.
  3. "The Market for Golconda Diamonds Has Mushroomed". Newyork times. 2011-03-20.
  4. Tata, Madhavi (2007-11-07). "On Golconda rock". Outlook. Archived from the original on 2020-07-22. Retrieved 2020-07-22.
  5. "Koh-i-Noor: Six myths about a priceless diamond". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2016-12-09. Retrieved 2020-07-22.
  6. "The Koh-I-Noor Diamond". Worthy (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-24. Archived from the original on 2020-07-02. Retrieved 2020-07-22.
  7. "గుంటూరులోని ఆ ప్రాంతంలో వానలకు వజ్రాలు కురుస్తాయి!". ఆంధ్రజ్యోతి. 2018-06-18. Archived from the original on 2020-07-22. Retrieved 2020-07-22.

వెలుపలి లంకెలు[మార్చు]