జెజ్జాల కృష్ణ మోహన రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెజ్జాల కృష్ణ మోహన రావు

జెజ్జాల కృష్ణ మోహన రావు తెలుగు రచయిత. అతను ఛందస్సులో అనేక వ్యాకరణ అంశాలను అంతర్జాలం ద్వారా అందించారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

నెల్లూరు జిల్లాలో 1943 వ సంవత్సరంలో జన్మించారు. వీరు మదరాసులో (చెన్నై) ఎస్.ఎస్.ఎల్.సి చదివారు. అప్పట్లో వీరికి తెలుగు మాస్టారుగా వేదం వేంకట కృష్ణ శర్మ ఉండేవారు. తిరుపతిలో ఉన్నతాబ్యాసము చేసి IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా పొందారు. తర్వాత 1980 దాకా మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన చేశారు.

తర్వాత అమెరికా వెళ్లి అక్కడే లో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం గడిపారు. వీరు ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు. పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు. వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి, పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.[2]

వీరి ప్రస్తుత నివాసం: ఫ్రెడరిక్, మేరీలాండ్, అ.సం.రా. హాబీలు: సాహిత్యము, సంగీతము, ముగ్గులు

మూలాలు[మార్చు]

  1. మిరియాల), Dileep Miriyala(దిలీపు. "ఛందం © | తెలుగు ఛందస్సుకు పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ | Chandam ©| A Complete Software for Telugu Chandassu". chandam.apphb.com. Archived from the original on 2021-11-02. Retrieved 2021-05-06.
  2. "ఈమాట రచయితలు – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-06.