జోలార్‌పేట-షొరనూర్ రైలు మార్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోలార్‌పేట-షొరనూర్ రైలు మార్గం
సేలం జంక్షను
అవలోకనం
స్థితిపనిచేస్తోంది
లొకేల్తమిళనాడు, కేరళ, కర్ణాటక
ఆపరేషన్
ప్రారంభోత్సవం1861
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ రైల్వే, నైరుతి రైల్వే
డిపో (లు)ఈరోడ్, జోలార్‌పేట
రోలింగ్ స్టాక్WDM-2, WDM-3A, WDM-3D, WDG-3A, WDG-4, WDP-4B/D డీజిల్ లోకోలు; WAG-7, WAP-4,WAP-7, WAG-9 ఎలక్ట్రిక్ లోకోలు.
సాంకేతికం
ట్రాక్ పొడవుప్రధాన మార్గం: 418 km (260 mi)
శాఖా మార్గాలు
Salem–Yeshvantapur 229 km (142 mi)
Salem–Mettur Dam 39 km (24 mi)
Irugur–Coimbatore–Mettupalayem 54 km (34 mi)
ట్రాక్ గేజ్5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజి
ఆపరేటింగ్ వేగం140 km/h
అత్యధిక ఎత్తుజోలార్‌పేట 405 metres (1,329 ft)
కోయంబత్తూరు 411 metres (1,348 ft)
యశ్వంతపూర్ 919 metres (3,015 ft)
మార్గ పటం
మూస:Jolarpettai–Shoranur line

జోలార్‌పేట-షోరనూర్ లైన్ చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ లైన్‌లోని జోలార్‌పేటను, కేరళలోని షోరనూర్‌ను కలుపుతుంది. జోలార్‌పేట వద్ద అరక్కోణం, కాట్పాడి మీదుగా చెన్నై/తిరుపతి వైపు నుండి అనేక శాఖల లైన్లు వస్తాయి. అవి - జోలార్‌పేట-బంగారుపేట్-బెంగళూరు, సేలం-ఓమలూరు-మెట్టూర్ డ్యామ్/ధర్మపురి-హోసూర్-యశ్వంతపూర్, సేలం-నమక్కల్-కరూర్, సేలం-విరుద్ధాపురం-విరుద్ధాపురం ఈరోడ్-కరూర్, ఇరుగూర్/పోదనూరు-కోయంబత్తూరు-మెట్టుపాళయం, పాలక్కాడ్-దిండిగల్. షోరనూర్ నుండి, రైల్వే లైన్లు కేరళలోని కోజికోడ్, నిలంబూర్, త్రిస్సూర్ వైపున మరింత శాఖలుగా ఉన్నాయి. ఈ నెట్‌వర్క్ కేరళలోని రైల్వే నెట్‌వర్క్‌ను తమిళనాడు, కర్ణాటకలోని నెట్‌వర్క్‌లకు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకూ అనుసంధానిస్తుంది.

చరిత్ర[మార్చు]

1856లో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు సేవ, భారతదేశంలో మూడవది మద్రాసు రైల్వే ద్వారా రాయపురం వేయసరపాడు నుండి వాలాజా రోడ్ (ఆర్కాట్) వరకు నిర్వహించబడింది. మద్రాసు రైల్వే దాని ట్రంక్ మార్గాన్ని 1861లో బేపూర్ / కడలుండి (కాలికట్ సమీపంలో) వరకు విస్తరించింది [1]

మీటర్-గేజ్ పోడనూర్-మెట్టుపాళయం లైన్ను 1873లో తెరిచారు. యునెస్కో హెరిటేజ్ ట్రాక్, నీలగిరి మౌంటైన్ రైల్వేను రెండు దశల్లో ప్రారంభించారు. మెట్టుపాళయం-కూనూర్ సెక్షన్ను 1899లో ప్రారంభించారు. దీన్ని 1908 లో [2] ఉదగమండలం (ఊటీ) వరకు విస్తరించారు. పోదనూరు-మెట్టుపాళయం సెక్షన్ను 2000ల ప్రారంభంలో బ్రాడ్ గేజ్‌గా మార్చారు.

రెండు నారో గేజ్ కరువు-రక్షణ మార్గాలను ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లో తెరవడం జరిగింది. 25.25 mi (41 km) పొడవున్న తిరుపత్తూరు-కృష్ణగిరి లైన్ 1905లోను, 18.5 mi (30 km) -పొడవున్న మొరప్పూర్-ధర్మపురి లైన్ను 1906లోనూ ప్రారంభించారు. దీన్ని – 54.5 mi (88 km) పొడవున హోసూర్ వరకు పొడిగించారు. హోసూర్-ధర్మపురి లైన్ను 1941లో నిలిపివేసారు. ఇతర రెండు లైన్లను 1945లో మూసివేసారు. [3] [4]



అరక్కోణం-జోలార్‌పేట-సేలం-ఈరోడ్-పాలక్కాడ్-ఎర్నాకులం లైన్ను "గ్రూప్ B" లైన్‌గా వర్గీకరించబడినప్పటికీ, దీని వేగం 130 km/h వరకు ఉంటుంది. గరిష్టంగా అనుమతించిన వేగం 110 కిమీ/గం [5]

ఈరోడ్ లోని డీజిల్ లోకో షెడ్డులో WDM-2, WDM-3A, WDM-3D, WDG-3A, WDG-4 లోకోలు ఉన్నాయి. ఈరోడ్ లోనే ఉన్న ఎలక్ట్రిక్ లోకో షెడ్డులో WAG-7, WAP-4, WAP-7 లోకోలున్నాయి. ఇది భారతీయ రైల్వేలలో అతిపెద్ద WAP-4 లోకో షెడ్డు. దేశంలోని ఎలక్ట్రిక్ రైళ్ల కోసం కొన్ని పొడవైన మార్గాలను నిర్వహిస్తుంది. [6]

జోలార్‌పేటలో ఎలక్ట్రిక్/డీజిల్ ట్రిప్ షెడ్ ఉంది. [6]

ప్రయాణీకుల కదలిక[మార్చు]

ఈ లైన్‌లో ఉన్న సేలం, కోయంబత్తూర్, ఈరోడ్, పాలక్కాడ్‌లు భారతీయ రైల్వేలోని టాప్ వంద బుకింగ్ స్టేషన్‌లలో ఉన్నాయి. [7]

మూలాలు[మార్చు]

  1. "IR History – Early days". 1832–1869. IRFCA. Retrieved 23 December 2013.
  2. "Mettupalam-Udhagamandalam (Ooty) Train". india invites. Archived from the original on 24 December 2013. Retrieved 23 December 2013.
  3. "Salem District (1916)". IRFCA. Retrieved 29 December 2013.
  4. "Chronology of Railways in India, Part 3 (1900–1947)". IRFCA. Retrieved 29 December 2013.
  5. "Chapter II : The Maintenance of Permanent Way". Archived from the original on 3 December 2013. Retrieved 23 December 2013.
  6. 6.0 6.1 "Sheds and Workshops". IRFCA. Retrieved 23 December 2013. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "sheds" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 10 May 2014. Retrieved 23 December 2013.